17, నవంబర్ 2019, ఆదివారం

చరణౌ కరుణాసింధుః

అంతరాంతరాలలో వున్న దీపం వెలగాలంటే ... ఈశ్వరుడిపై విశ్వాసం వుండాలి. లౌకిక దృష్టితో వ్యాపార దృష్టితో భక్తుడిని భగవంతుడిని చూసినంత కాలమూ భక్తి ఈశ్వరుడు రెండూ మనకి అర్ధం కావు . ఇవి మాటలు అర్ధమైనంత తేలికపాటి జ్ఞానం కాదు. అనుభూతి ప్రధానమైన ఆధ్యాత్మికమైన అనుభవం.  ఎవరి అనుభవం వారికి ప్రాధాన్యం. ఒకరికి మన అనుభవాన్ని సరఫరా చేయలేము... గీతాంజలిని  నిత్య పఠిత గ్రంధము చేసుకోవడం మూలంగా లోకం మరింత బాగా అర్ధమవుతుందని కాదు..మనం యెలా   జీవిస్తే ప్రశాంతంగా వుండగలమో తెలుస్తుంది. ఆ అనుభవంలో నుండి పుట్టినదే క్రింద వ్రాసుకున్న ప్రార్ధన. తర్వాత కొంత ఆలోచన చేసి ... ఈ ఉపోద్ఘాతం వ్రాసుకున్నాను. 

చిత్రం: అరుణాచలేశ్వరుని సన్నిధి (చిత్ర సేకరణ సునీత పోతూరి గోడపై నుండి ) 


తండ్రీ..
నిప్పులు చెరిగే యెండలో రాతి మెట్లపై నడిచే అవసరం కల్పించావ్ సరే..
పాదరక్షలు లేవని భంగ పడకుండా ..
ఆ రాతిబాటకు ఇరుపక్కలా.. పచ్చని పచ్చికనూ పరిచివుంచావు

కష్టంలో కూడా సౌఖ్యాన్ని పక్కనే వుంచిన నిన్ను
నా తండ్రిగా.. కీర్తించకుండా వుండగలమా..
నీ కరుణా సముద్రపు అలల తాకిడికి 
వినమ్రంగా తలవొంచనా.. తడిచిన.. కనులతో.. ఈశ్వరా!

కామెంట్‌లు లేవు: