14, సెప్టెంబర్ 2024, శనివారం

ఓ అమ్మ కథ

 కథ చాలా బాగుంది...... తల్లి ... బిడ్డల మీద ప్రేమతో... నాటిన మొక్కలలో బిడ్డలను చూసుకుంటుంది . రైల్వే లైన్ కోసం జరుపుతున్న భూసేకరణలో కొంత స్థలము ఆ మొక్కలు పోతాయని తెలిసి దిగులు పడుతుంది. పెళ్ళై అత్తవారింటివెళ్లిన కూతురు రాలేదు . అలాగే తతిమ్మా ఇద్దరు కొడుకులు రాలేరు. బిడ్డలా కోసం ఎదురుచూస్తున్న ఆమెకు నిరాశే మిగులుతుంది. ఆఖరికి బిడ్డల్లాగా భావించే చెట్లు నేల  కూలిపోతే ఆ తల్లి వేదనకు అంతు  ఏది ? వలస వెళ్లిన బిడ్డలు ఎప్పుడో ఒకప్పుడు తిరిగివస్తారనే ఆశ గా చూసే తల్లికి వాళ్ళు రారని తెలిసినప్పుడు ..జీవశ్చవమే కదా ! గుండెలని పిండేసే బరువైన కథ.  రెక్కలు వచ్చాక అంతే ... అందుకేనేమో ..పక్షలు రెక్కలొచ్చాక పిల్ల పక్షులను పట్టించుకోవడం మానేస్తాయి

కథ వినండీ.. 




​⁠ 

కామెంట్‌లు లేవు: