10, ఫిబ్రవరి 2016, బుధవారం

మేక్ ఇన్ ఇండియా

మా విజయవాడకి పండగ కాని పండగ 27 సంవత్సరాలగా వస్తూనే ఉంది.  ఆ పండగ వస్తుందనగానే ఇల్లిల్లూ జేబు తడుముకుంటుంది. జనవరి 1 వ తేదీ నుండి అంట. హమ్మయ్య పర్వాలేదు . .. జీతం రాళ్ళు జేబులో పడ్డాకే 11 రోజుల పండగ వస్తుంది. పిల్లలకి మొన్న మొన్ననేగా క్రిస్టమస్ కో, న్యూ ఇయర్ వేడుకల కోసమో  బట్టలు కొన్నాం. మళ్ళీ ఇప్పుడే ఈ పండగ  ముంచుకొచ్చింది. సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికో నాయనమ్మ దగ్గరకో వెళ్ళాలని ముచ్చట పడుతుంటే అటెళ్ళాలా - ఇటెళ్ళాలా  అని డైలమా లో పడ్డారు పిల్లలు.

నాన్నా ..నాన్నా ! ముందు ఈ పండక్కి వెళదాం. ఇక్కడ మా కోసం ఖర్చు పెట్టినదంతా ఊరు నుండి రాగానే ఇచ్చేస్తాం . ప్లీజ్ ఒప్పుకో నాన్నా ! పిల్లలు బతిమలాడుతున్నారు. "నన్నే  అడుగుతున్నారు కానీ  మీ అమ్మ దగ్గర టెండర్ పెట్టాలని మీకు తోచడం లేదు. ఆవిడ గారు అన్నింటి కంటే చీరలకో, నగలకో ప్రాధాన్యత ఇస్తారు. ఈ సారికి మీ అమ్మని అడగాల్సిందే " .అని చెప్పాడు నాన్న.   "మీరేం ..ఎగతాళి చేయనవసరం లేదు. ఈ సారి నా జీతంలో అగ్ర భాగం ఈ పండగ కోసమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. అయితే ఒక షరతుకి అందరూ ఒప్పుకోవాలి".. ఏదో మెలిక పెడుతుంది అమ్మ. అది సాధ్యం కానిదే అయుంటుంది అని ఆలోచిస్తున్నారు.

అంతగా ఆలోచించాల్సిన పని లేదు. రోజూ ఇంటికి రాగానే మీ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. టీవి ఆన్ చేయకూడదు. ఇంట్లో ఉన్న నలుగురు చేతిలో అదే  ఉండాలి .. అలా అయితే ప్రతి నెలా నా జీతం లో నుండి అగ్రభాగం ఇలాంటి పండగల కోసం ఖర్చు పెడతాను. మీ ముగ్గురూ ఆలోచించుకోండి .. అమ్మ సవాల్ విసిరి వంటింట్లోకి వెళ్ళింది. పిల్లలిద్దరూ నిరాశగా ముఖాలు పెట్టారు.

మన PM "మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా " అని స్తోత్రం వల్లిస్తుంటే  ... అమ్మ ఏంటో మొబైల్, టీవి ఇంట్లో నిషిద్దం కాని నిషిద్దం అంటుంది"  ఆ ... యన్స్ వాళ్ళు పేస్ బుక్ కూడా ఫ్రీ గా ఇచ్చారు. ఫ్రీ గా ఇచ్చిందాన్ని  ఉపయోగించుకోకపొతే ఎలా ?  మెదడు మోకాలులో ఉంటుందని అమ్మ లాంటి వాళ్ళని చూసే అని ఉంటారు .  విసుగ్గా అన్నాడు అబ్బాయి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్రెండ్స్ తో చాట్ చేయడమెలా !? అమ్మాయి అసంతృప్తితో ఆలోచనలో పడింది.
ఏమిటో ఈ ఆడవాళ్ళు . కాసిని డబ్బులు సంపాదించడం మొదలు పెట్టగానే అంతా తామే కరక్ట్  గా మాట్లాడుతున్నట్టు, కరక్ట్ గా చేస్తున్నట్లూ బిల్డప్ ఇస్తారు. టీవీ చూడక,మొబైల్  వాడకపోతే  అవి  ఉండటమెందుకు ?  ఇంట్లో అలంకారినికి తప్ప ?  స్వగతంలో అనుకున్నానుకుని పైకే అనేసాడు నాన్న.

అమ్మ వంటింట్లో నుండి కోపంగా బయటకి వచ్చి ... నేను..  మరి దాని గురించే అడుగుతున్నాను . ప్రతి సంవత్సరం మా విజయవాడలో పండగ పండగ అంటూ వెళ్లి మోయలేక మోయలేక మోసుకొచ్చి మరీ షో కేస్ లో అలంకరిస్తున్నారు అవేంటో అలంకరణ సామాగ్రిలా ! అవలా పడి  ఉంటునప్పుడు ... ఆ పడి ఉండేదేదో ... పెట్టెలో పడుండే నగో ..బీరువాలొ వరసల్లో అమిరిపోయే చీరైతే మాత్రమేమిటీ ? మేక్ ఇన్ ఇండియా కూడా   చేయవలసిన తీరులో చేసుకుంటూ పోతేనే సాధ్యం. టీవీ ముందు కూర్చుంటేనో,  కంప్యూటర్  ముందు కూర్చుంటేనో, మొబైల్ లో చాట్ చేస్తూంటూ కూర్చుంటే తయారవదు. మన PM లాగా విదేశాలు చుట్టేస్తున్నంత మాత్రానే రాదు.  కుళ్ళు జోక్స్ మీకు మాత్రమే వచ్చనుకోకండి .. కచ్చగా అనేసి వచ్చినంత స్పీడ్ గా వెళ్ళిపోయింది  వంటింట్లోకి.




పిన్ డ్రాప్ సైలెన్స్.  ముగ్గురూ  ... ఆలోచనలో పడ్డారు. కాసేపటికి  నాన్న డిష్  డిస్ కనెక్ట్ చేసేసాడు . అబ్బాయి, అమ్మాయి కొంత అసంతృప్తి తోనే మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి .. షో కేస్ లోపల పెట్టేసి మధ్యాహ్నానికల్లా పండగ కి వెళ్ళడానికి  రెడీ అయిపోయారు. అమ్మ అందరికి సంతోషంగా వడ్డించింది. అందరూ కలసి PWD గ్రౌండ్స్  (స్వరాజ్య మైదానం ) దగ్గర బస్ దిగి తల పైకెత్తి కనబడుతున్న హోర్డింగ్ వొంక చూసారు . 
                      ఇదిగో ఇలా ..  కనబడింది ఆ  నలుగురికి. ఇదే  మా విజయవాడ కి వచ్చే అసలైన పండగ .


 రాత్రయ్యేవరకూ ... ఇలా జనాల్లో కలసి తిరుగుతూ ... ఉన్నారు.
అన్ని పండుగల కంటే ఇదే అసలైన పండగని ఇక్కడ ఖర్చైన ప్రతి రూపాయిని సద్వినియాగం చేసుకుంటే .. బావుంటుందనే ఆలోచనతోనే...  ఈ పోస్ట్ .
(ఈ పండగ గురించి మళ్ళీ ఇంకో పోస్ట్ లో ... )

1 కామెంట్‌:

అజయ్ చిన్ని చెప్పారు...

mee post chala bagundi vanajavanamaali garu.. kani future lo pillalu asalu pusthakale chadavremo anipisthu vutundi ee kalapu pillalni choosthunte...