24, జనవరి 2020, శుక్రవారం

సాక్షాత్కారం

సాక్షాత్కారం కథ చదవండి .. సత్యం శంకరమంచి అమరావతి కథలు నుండి ... సేకరణ . 
కాపీరైట్స్ విషయమై    అభ్యంతరం ఉంటే తెలియజేయండి తొలగించగలను . 




అమరావతీ... ఊపిరి పీల్చుకో..


ద్వేషం మంచి నీరుగా చేసుకుని తాగేవారికి మంచిమాటలు తలకెక్కవు . 
 కమ్మ రాజధాని అమరావతి
కమ్మ పరిపాలన
కమ్మోళ్ల రాజ్యం మాకొద్దు  కమ్మ  లం... లు
ఏమిటిరా ..బాబూ ఈ శిక్ష మాకు ..  ఎందుకు మా మీద ఇంత ద్వేషం ? 
ఎందుకు మా మీద ఇంత శిక్ష ? 
యూ  ట్యూబ్ లో ఛానల్స్ చూడాలంటే భయం న్యూస్  చూడాలంటే చాట్ వైపు దృష్టి వెళ్లకుండా కట్టడి చేసుకోవాలి 
పేస్ బుక్ తెరవాలంటే భయం  మెసెంజర్ లో నోటిఫికేషన్ చూస్తే జంకు 
ఒక్కటి మాత్రం చెప్పగలను మీలా మాకు PayTM బ్యాచ్ లేరు మీ అంత ద్వేషం సంస్కారం ఉన్నవాళ్ళం కాదు 
కానీ ఎల్లకాలం చూస్తూ ఊరుకోము ... ఊరుకోము  ఊరుకోము అంటున్నారు ముఖ్యంగా  స్త్రీలు. అమరావతి స్త్రీలు మాత్రమే కాదు అంతర్జాతీయంగా స్త్రీలందరి గొంతులు ఈ అవమానకర వ్యాఖ్యలకు స్పందిస్తున్నారు. ఎన్నాళ్ళు ఊరుకుంటారు చెప్పండి ?  

మనుషులు మరీ కుసంస్కారులుగా మారిపోతున్నారు. చదువుకున్నవాళ్ళు మరీనూ .. ఇలాంటి స్థితి నేనెప్పుడూ చూడలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవేదన కల్గుతుంది . ప్రజల మధ్య కుల పిచ్చిని రగిలించాడు ..మతాన్ని చాప క్రింద నీరులా ప్రవహింపజేస్తున్నాడు. ప్రాంతీయ ద్వేషాన్ని పెంపొందిస్తున్నాడు ఈ ఆర్ధిక ఉగ్రవాది. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది . తెలంగాణా ముఖ్యమంత్రి చేతిలో రిమోట్ పెట్టి .. మన ఆంధ్రుల అభిమానాన్ని తాకట్టు పెడుతున్నాడు. భావితరాలకు  భవిష్యత్ లేకుండా వలస కూలీలుగా మిగిలిపొమ్మని యువత నుదిటి రాత లిఖిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి . 
ఎవరి ప్రయోజనాల కోసం ..ఈ ముఖ్యమంత్రి .. !? 
ఇకపై రాజ "కీ " యాలు తాళం చెవితో ప్రజల మనసును తెరవగలరా ? గెలవగలరా ?
రాష్ట్రంలో ప్రస్తుతం చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు సున్నా . ఇతర రాష్ట్రాలకు ఇతరదేశాలకు చీమలబారులా దారి కడుతున్నారు . ముందు ముందు అమ్మఒడి ద్వారా బడికి వెళ్లి ఇంగ్లీష్ మీడియం ద్వారా చదువుకునే పిల్లలకు మాత్రం భవిష్యత్ లో ఉపాధికల్పన దొరుకుతుందా ? పరిశ్రమలు సాఫ్ట్ వేర్ మన రాష్ట్రాన్ని నమ్మి వచ్చే పరిస్థితి ఉందా ?
రాజధానిని మార్చితే అభివృద్ధి ఎలా వస్తుంది ? 
ఈ పిచ్చి రాజకీయాలు మాని రాష్ట్ర ప్రగతిపై దృష్టి పెడితే బాగుంటుంది. కేసులు కోర్టులు విచారణలు వీటితోనే కాలం గడిచిపోతుంది. ఏమిటీ ఈ అనిశ్చితి ? 
ధరలు చుక్కలు తాకుతున్నాయి . పన్నులు నడ్డి విరుస్తున్నాయి . 
మీ మీ ధనాపేక్షలకు పదవీ వ్యామోహాలకు ప్రజలను బాధితులను చేస్తున్నారు. 
ప్రజలకు సులభంగా పనులు జరిగే "మీ సేవ" లు లేవు. గ్రామ సచివాలయాలు నోటు ఇస్తే తప్ప పనిచేయడం లేదు. వాలెంటీర్స్ ఎందుకు పనిచేస్తున్నారో ఏమి పనిచేస్తున్నారో తెలియదు . సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఇంకేమి అవసరం లేదా ? ప్రజలకు ఉచిత పధకాలు ఎర వేసి ఓట్లు దండుకునే పనులు తప్ప ..ఇంకేమి అభివృద్ధి అవసరంలేదా ? 
ఏం ఖర్మ రా ..బాబూ .. పని లేని(చేయని ) ప్రభుత్వాలకు పనిలేని సోమరి ప్రజలు.   
ఎట్టకేలకు అమరావతిని ధ్వంసం  చేయాలనుకునేవారికి అడ్డుకట్ట పడింది. కానీ వారి పుర్రెలలో పుట్టిన ఆలోచన మరిన్నిసరికొత్త  వికృత ఆలోచనలకు తెరతీస్తోంది. తప్పులపై తప్పులు చేస్తూ వారినివారు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు. సామాన్యుడికి కూడా వారేమిటో తెలిసిపోయి ..ఇలాంటి వారినా తాము యెన్నుకున్నదని చెప్పులతో కొట్టుకుంటున్నారు. 
మూడు రాజధానుల ప్రతిపాదన, సి ఆర్ డి ఏ రద్దు బిల్లులు రెండూ మండలి పరిశీలనకు వెళ్లి అక్కడ సెలెక్ట్ కమిటీకి వెళ్లాలని సిఫారసు చేయడం వల్ల మూడు రాజధానుల ప్రసక్తికి తెర దించినట్లే అనుకోకపోయినా  చట్టపరంగా మూడురాజధానులు విషయం సాధ్యం కాదని రాజ్యాంగ నిపుణులు చెప్పడంవల్ల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పవచ్చు. 
ముఖ్యంగా అమరావతి భూములిచ్చిన రైతులు , విదేశాల్లో ఉన్న అమరావతి ప్రజలు   అమరావతి చుట్టూ ఇన్వెస్ట్ చేసిన మధ్యతరగతి ప్రజలు  ...ఊపిరి   పీల్చుకున్నారు. విదేశాలలో ఉన్న వారు క్రెడిట్ కార్డులు తీసుకుని దాచుకున్న ప్రతి పైసాను తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యమైతే వారూ  లబ్ది పొందవచ్చు అనుకుని పెట్టుబడి పెట్టారు . ఇప్పుడిక్కడ  పరిస్థితులు చూసి వేదన చెందుతూ గుబులు గుబులుగా చూస్తున్నారు . వారికి చెప్పేది ఒకటే ! మీ మీ నమ్మకాలు నిలబడతాయి . నిలబెట్టబడతాయి. గ్రీన్ కార్డు ల కోసం కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూడకుండా ..మీరు అమరావతికి వచ్చే రోజు వస్తుంది. ఏముంది అక్కడ అని నిసృహ వద్దు . ఓపికగా ఎదురుచూసినవారిదే నూరేళ్ళ జీవితం .. సహనమే మన ధర్మం . 
అమరావతీ... ఊపిరి పీల్చుకో...
ప్రజలు నీ నీడలో చల్లగా వుండాలని ఆకాంక్షించారు.
దేవుడు చూస్తున్నాడు.. నిబ్బరంగా నమ్మకంగా వేచిచూడటమే!
ధర్మ ఏవహతో హంతి
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత - వాల్మీకి.

జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ !! జయహో ..ప్రజాస్వామ్యం !!