31, మే 2012, గురువారం

"మై స్పేస్ " అమ్మలక్కల కబుర్లు 2



రండి రండి.. మళ్ళీ ..అమ్మలక్కల కబుర్లు మోసుకుని వచ్చాను.

ఈ రోజు ..మా కిట్టీ పార్టీ మెంబెర్స్ అందరం కలుసుకున్నాం.

నెల ఆఖరి రోజు కూడా పొదుపు చేయడం ద్వారా ఉన్న డబ్బుతో..ఎవరో ఒకరికి అవసరానికి  ఉపయోగ పడుతుందని.. ఇలా నేలాఖరి  రోజుకి ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఇదీ  గొప్ప విషయమే అనుకుంటాను నేను.

సరే ..నాలుగు కొప్పులు ఒక చోట చేరితే కబుర్లే...  కబుర్లు కదా!

మొదటగా .. ఏం కూరలు చేసావు లలితా .!?.అడిగాను.

మావారు వూరు వెళ్ళారు. వెళ్ళిన వారు వచ్చేవరకు ఇంట్లో మనదే ఇష్టా రాజ్యం.
వారు ఉంటే అన్నీ వారికిష్టమైన కూరలే చేయాలి.వారానికి ఒక్క రోజయినా సరే నాకు ఇష్టమైన కూరలు చేసే వీలు లేదు అంది.

అదేమిటి..ఇంట్లో అందరికి ఇష్టమైనవి చేయాలి కదా!

మా ఇంట్లో అలా లేదు, వారికి అన్నీ వేపుడు కూరలు,రక రకాల ప్లేవర్స్ తో..రసం,చారులు కావాలి. నాకైతే కలగలుపు కూరలు,రోటి పచ్చడులు ఇష్టం. మా అత్తగారు మా పెళ్ళైన క్రొత్తలలో చెప్పారు." పోద్దస్తమాను కష్టపడే మగవాడికి వాళ్లకి ఇష్టమైన పదార్ధాలు వండి.. తృప్తిగా వడ్డించడం ఆడవారి ధర్మం " అని నేను అప్పటినుండి తు.చ తప్పకుండా పాటిస్తాను. పాటించకపోతే  నట్టింట్లో వినబడే సణుగుడు,గొణుగుడు ..లు వినలేక చావాలి... ఒకింత కసిగా చెప్పింది

నేను నవ్వి మీ అత్తగారు చెప్పిన మాట విన్నావు సరే ! మీ అమ్మ గారు చెప్పిన మాట గుర్తుకు రాలేదా !? అన్నాను. లలిత ముఖంలో ఆశ్చర్యం.

నేను నవ్వుతూ.. "భయపడకు.. భర్త,కుటుంబ సభ్యులు అందరు భుజించిన తరవాతే భుజించు.వాళ్ళు తిన్నతర్వాత ఏమి మిగిలి ఉండక పోయినా సరే అర్ధ ఆకలితో అయినా పడుకోవాలి కాని ..అందరికన్నముందుగా భుజించకూడదు అని చెప్పలేదా ? " అన్నాను.

"అవును ఇలాగే చెప్పింది. మీ అమ్మగారు ఇలాగే చెప్పారా?" అని బోలెడంత ఆశ్చర్యం ప్రకటించింది.

"అందులో ఆశ్చర్యం ఏముంది? అందరు చెప్పేది అదే కదా!,," అంది రమ ..ఆ టాపిక్ లోకి ఎంటర్ అవుతూ..

"నిజమే అందరు అలాగే చెపుతారు. కానీ.ఆమెకీ   కొన్ని ఇష్టమైనవి ఉంటాయి. ఆ వంటలు చేయడం వల్ల ఇంట్లో అందరు కూడా ఆ వంటలని అలవాటు చేసుకోవచ్చు అని కూడా అనుకోవాలి కదా! అలా అనుకోకపోవడం వల్ల 
మహిళలకి ఇష్టమైన తిండి సంగతి పెళ్లి తర్వాత మర్చి పోవడమే అన్నమాట!

నేను అయితే.. ఎవరికీ ఏ ఐటమ్స్ ఇష్టం అని చూడకుండా అన్ని రకాలు కలిపి వండి అక్కడ పడేస్తాను. ఇష్టమైతే తింటారు లేకపోతే.. నాలుగు తిట్లు. కాస్సేపు చిరాకులు పరాకులు,ఆరోపణలు ఉంటాయి అనుకోండి వాటిని లెక్క చేయను. రెండు మూడు కూరగాయలు కలిపి వండటం వల్ల వచ్చే రుచి..ఆ డీప్ ప్రయ్ లలో వస్తుందా చెప్పండి? అసలు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇంట్లో భోజనాల బల్ల దగ్గరే కనబడాలి.ఏక పక్ష నిర్ణయాలు అమలు జరగనివ్వడం ఎందుకు? కలసి బ్రతుకు తున్నప్పుడు ఒకరికి నచ్చినవి ఇంకొకరు తినడం కూడా అలవాటు చేసుకోవాలనుకోవడంలో తప్పు ఏముంది? ఆలోచించి చూడండి..అన్నాను

"అలా రుచులు,అభిరుచులు కలుపుకోవకపోతే చాలా ఇబ్బంది. ఒక ఇంట్లో ఎవరి టీవి వారికి ,ఎవరి ప్రిజ్ద్ వారికి,  ఎవరి వంట వారికి ఏర్పాటు చేసుకోవాలి అనేమో  .. పాపం! ఆడవాళ్లే వాళ్ళ వాళ్ళ  ఇష్టాలని చంపేసుకుని ఇంట్లో భర్త, పిల్లల  కోసం త్యాగాలు చేస్తారు. అందుకనే  వాళ్ళు ఇంటికి దూరంగా వెళ్ళినప్పుడు  ఆడవాళ్ళు ఇష్టంగా తమకి కావలసినట్లు ఉంటారనేది  సత్యం " అంది రమ.

"ఏమిటో జీవితంలో ఇంకొకరి ప్రవేశం కాగానే అన్నీ మారిపోతాయి.అనుకుంటే దిగులు వచ్చేస్తుంది."అంది సుజాత .ఆమెకి ఇంకా వివాహం కాలేదు. జాబ్ చేస్తుంది

"అలా భయపడాల్సిన అవసరం లేదు.ఇప్పుడు మగవాళ్ళు అంతా నేను మోనార్క్ ని అనడం లేదులే! వచ్చినా విడ అభిప్రాయాలని, అభిరుచులని కొంత  గౌరవిస్తున్నారు "చెప్పాను.

స్వర్ణ గారు అనే ఆవిడ ఇలా అన్నారు. "మార్కెట్ కి వెళ్లి కూరలు తేవడం అంటేనే ఎలర్జీగా చూసే మగవాళ్ళు కంచం ముందు కూర్చుంటే మాత్రం.. నాలుగైదు రకాలు కనబడాలి.ఇంట్లో వుండి వండి పెట్టడానికి కూడా ఏడ్చి చస్తారు..అని మాటలు పడాలి అదేంటో మరి . వంట చేయడం అంటే ఈజీ అయినట్టు .. చెప్పేస్తారు .

ఇంతలో లత గారు తాటి ముంజె లతో విచ్చేసి .."అందరూ  ఒక పట్టు పట్టండి.." అని మధ్యలో పెట్టేసారు. ఉదయమే తీసుకుని ప్రిజ్ద్ లో ఉంచడం చల్లగా ఉన్నాయి. అందరు తింటూ ఉండగా.. "ఏం టాపిక్ మొదలెట్టారేవిటి ఈ వేళ ? " అని అడిగారు.

ఆమె తూ.గో.జి. ఇక ఎవరైనా  ఆ జిల్లా వాళ్ళు కనబడ్డారంటే  గుంపులో నుండి విడివడి పోయి వాళ్ళ కబుర్లు వేరుగా ఉంటాయి. మా కృష్ణా జిల్లా వాళ్లకేమో మమ్మల్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నట్లు ఉంటుందనుకోండి. అయినా మనసులో శాంతం, శాంతం అనుకుని. ఏమండీ..తూ.గో & ప.గో వారు.. మేము వినవచ్చా అండీ మీ కబుర్లు అని  అంటాం.అలా సుజాత గారిని, లత గారిని విడగొట్టి మాలో కలిపేసుకుని మా కడుపు మంట చల్లార్చుకుంటాం...

"ఏముంటాయి వంటల కబుర్లు, కష్టాలు, మగవారిని ఆడిపోసుకోవడాలు ..మాత్రమే అయ్యాయి మీరు చెప్పండి క్రొత్త కబుర్లు ..అన్నాను.

"వంటలు సంగతి ఏముంది లెండి.. భార్య ఏ చీర కట్టుకోవాలి,ఎలాటి రంగు చీర చీర కట్టుకుంటే బాగుంటుందో..అనేది కూడా మా ఇంట్లో మా భర్త గారి ఇష్టమే! ఇదిగో..ఈ చీర నీకు బాగుంటుంది ఇలాటివే కట్టుకో..అని ఆర్డర్స్.

నాకు అలాటి రంగు చీరలి ష్టం లేదని అంటే.. " నా కోసం నాకిష్టమైన చీరలే కట్టుకోవాలి కాని..నీకు ఇష్టమైన చీరల్లో నిన్ను చూడటం నావల్ల కాదు, అదసలు నాకు నచ్చదు"  అని చెప్పేవారు.  మా అత్తగారేమో.. అబ్బాయికి ఇష్టమైనట్లు ఉండమ్మా!మగవాళ్ళు ఏదిష్టపడితే అందులోనే ఇమిడి పోవాలి లేకపోతే మనం చీర మార్చినట్లు..వాళ్ళు భార్యలని మారుస్తారు..అనేది" అని చెప్పారు ఆవిడ.

"యెంత అన్యాయం".. ఇది ఆడవారి కి చాలా అవమాన కరం .తినే తిండి,కట్టుకునే బట్ట గురించి కూడా భర్త  ఇష్టం ఏమిటి? స్త్రీలకి వాళ్ళకంటూ ఇష్టా ఇష్టాలు ఉండావా!?

ఒకవేళ ఇష్టాలు ఉన్నా పెళ్లి అవడం తోనే వాటిని భర్త కోసం మార్చేసుకోవాలా?

భర్త కోరిక మన్నిస్తే ఎప్పుడైనా ఒకసారి అతనికి నచ్చినట్లు ఉండటం పర్వాలేదు.జీవిత కాలం అతనికి మాత్రమే నచ్చేటట్లు ఉండాలనుకోవడం అహంకారం గా అనిపించడం లేదు...అంది రమ .
.
మంచి భర్త అంటే భార్య ఇష్టా ఇష్టాలని కూడా గమనించి..ఆమెకి నచ్చినట్లు ఉండే స్వేచ్చని కొంతైనా ఇవ్వకపోతే ఎలా!?

మనమందరం ఈ విషయంలో..మగవారికి వ్యతిరేకంగా మన నిరసనని తెలియజేద్దాం...అంటూ..ముక్త కంఠం..తో నిరసన తెలిపారు.
.
 అప్పుడు నేనొక విషయం  చెప్పాను . అసలు నా పెళ్లి అప్పుడు మా అత్తగారు పెట్టిన పట్టు చీరే నాకు నచ్చలేదు.లావెండర్ కలర్ పట్టు చీర. అది నా ఒంటికి  ఏ మాత్రం.. నప్పదు అలాటిది నాకామె ఆ చీరే కొన్నారు. నాకు నచ్చలేదని చెప్పేస్తాను అంటే.. మా వాళ్ళంతా..తప్పు అలా చెప్పకూడదు..వాళ్ళు పెట్టిన చీర కట్టుకోవడం ఆనవాయితీ ని నా నోరు నోక్కేసారు.నాకు నచ్చని ఆ చీర కట్టుకుని ..ఆ అసంతృప్తిని వెళ్ళ గ్రక్కుతూ సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చున్నాను. అప్పుడు తీసిన ఫోటోలలో ఆ అసంతృప్తి స్పష్టంగా కనబడుతుంది. అపుడు తప్ప ఆ చీరని నేను ఎప్పుడు కట్టనే లేదు.  వేలకి వేలు పోసి కొన్న చీర .కనీసం కట్టు కునేదాన్ని ఒక మాట అయినా అడిగి కొనాలి అన్న ఆలోచన రాకపోడం దురదృష్టం అని చెప్పాను నేను.

"పూలు పెట్టుకోవడం అంటేనే నాకు చాలా ఇబ్బంది. ఆ పూలు ఎక్కడ నలిగి పోతాయో అన్నంత జాగ్రత్తగా ఉండాలి. ఇదేమీ విడ్డూరమో!పూలు పెట్టుకోవడం ఇష్టం లేదన్న దానిని నిన్నే చూసాను అని అన్నా నేను పెద్దగా లెక్క చేసేదాన్ని కాదు." అని చెప్పారు దుర్గ అనే ఇంకొకరు.

మావారికి ఏఎన్నార్ లా ఇంత పొడుగు సైడ్ బార్క్స్ పెంచడం అలవాటు.అది ఆయనకీ ఇష్టం. నాకు అలా ఉండటం ఇష్టం లేదంటే ఆయన మార్చుకున్నారా? మార్చుకోలేదు. వాళ్ళు ఎలా ఉండాలనేది  మాత్రం వాళ్ళిష్టమనుకుంటారు. అది అహంకారం కాదు.అంది

భార్య ఇలానే ఉండాలి అని శాసించినట్లు ఉండడం తప్పు అంటాను. భర్త అంతరంగాన్ని గ్రహిస్తే భార్యే అతని కోరిక ననుసరించి.. మనస్పూర్తిగా ఉండటం వేరు బలవంతం చేయడం వేరు .

మా ప్రక్కింట్లో ఉండే ఒక జంట గురించి చెబుతాను వినండి భర్త కిష్టం అయినట్లు ఉండలేదని.. భార్యని తెగ తిట్టిపోయడం చేసేవాడాయన. ఆయనకీష్టమయిన చీర కట్టుకుంటేనే..ఆయనతో బైక్ పై ఎక్కిన్చుకునేవాడు.లేకపోతే..ఏమిటి సర్కస్ దానిలా తయారయ్యావు..సినిమాలో తైతక్కలాడే హీరోయిన్లా ఉన్నావు..అని మాట్లాడే వాడు. పాపం ఆమె కళ్ళనీళ్ళు కారుకుంటూ లొపలకి వెళ్ళిపోయేది.తర్వాత ఆమె ఎప్పుడు ఆయనతో బయటకి వెళ్ళడం మానేసింది. అని చెప్పింది..

ఆమ్మాయిలు..! మీరు అంతా ఒక విషయం మర్చిపోతున్నారు. మా కాలం లో ఇవన్నీ మాకు తెలిసేవా ఏమిటి..? ముతక చీరలు,జరీ చీరలు,పట్టు చీరలు అన్నీ కలిపి ..నాలుగైదు చీరలు తప్ప ఎవరికీ  అన్న్తకన్నా ఎక్కువుండేవి కావు. మీ కాలం వచ్చేసరికి మొగుళ్ళు స్వయంగా షాపులకి తీసుకెళ్ళి రక రకాలు కొని పెట్టి ఆ చీరలే కట్టుకోమంటే బాధపడి పోయి అవే బోలెడు కష్టాలు అయినట్టు చెప్పుకుంటున్నారు.మా కాలం లో అలా ఉండేదా!? పుట్టింటి వాళ్ళు కొని పెడితేనో, లేదా అత్తముండ దయ తలచి కొనిపెడితేనో. కట్టేవాళ్ళం. మా మీద మీరు నయం కదూ.. అన్నారు భానుమతి అనే మామ్మగారు.

అవును మామ్మ గారు..మీరు చెప్పినది నిజమే!  మీకు, మాకు ఒక తరం తేడా ఉంది. జనరేషన్ గ్యాప్ అంటారే  అదన్నమాట.

ఇక ఇప్పుడు మాకోచ్చే కోడళ్ళు,మా కూతుళ్ళు..ఉన్నారు చూడండి వాళ్ళు ఎలా కట్టినా నోరు మూసుకుని కూర్చునే కాలం వచ్చింది. "ఐ డోన్ట్ లైక్ ఇట్.".అంటే..మేము " యాజ్ యూ లైక్ !"అంటూఅడిగినంత డబ్బు ఇచ్చేసి నోరు మూసుకుని ప్రక్కకు వెళ్ళిపోయే రోజులు వచ్చేసాయి. ఏం చేస్తాం చెప్పండి? ఈ తరం వాళ్ళు ఇష్టాలు,ఆలోచనలు ఎలా ఉంటాయో! నని  చూచాయగా చెప్పి అక్కడ నుండి బయట పడటానికి రెడీ అయి లేచి నుంచున్నాను.

మొత్తానికి మేము తినే తిండి మీద, మేము కట్టుకునే బట్ట మీద మీ మగవాళ్ళ ఆధిపత్యం ఏమిటి.. అని అడిగేటట్లు.. జరిగిందన్నమాట ఈ రోజు టాపిక్.. అంది పద్మ...

అప్పుడేనా..వెళ్ళడం కాసేపు కూర్చోండి. అంటూ బలవంతం చేసారు.

నేను వింటేగా.. నా కాళ్ళకి రధ చక్రాలు ఉంటాయని.. వెనుక నుండి..మా రమ జోక్.. వాళ్ళ బుజ్జిపండు గాడి.. అలక అరుపులు.. వెహికల్ శబ్దంలో కలసి పోయి..ఇంటికి వచ్చి పడి...  ఇలా ఇక్కడ అక్షరాలలో .. ఆ కబుర్లు వెలిసాయి.

(మిత్రులకో చిన్న మాట . ఎప్పుడు పది మంది ఉండే మా కిట్టీ లో ఈ రోజు ముగ్గురు గైరు హాజరు.ఆ కబుర్లే ఇవి.ఆడవాళ్ళ కాలక్షేపపు కబుర్లలో ఏముంటాయనుకోవద్దు. బోలెడు విషయాలుంటాయి సిల్లీగా అనిపించే సీరియస్ విషయాలు వాళ్ళ రోజువారి కబుర్లలో కలబోసుకుని ఉంటాయి.వాటి గురించి చెప్పడమే..మై స్పేస్ ..ఉద్దేశ్యం.పురుషుల ఆలోచనలని వైఖరిని చెప్పడం మాత్రమే కాని వారిని దుయ్యబట్టం కాదు అని మనవి. 


(ఈ పోస్ట్ చదివి.. కొంత మందయినా కొంచెమయినా  ఆలోచించగల్గితే అదే పదివేలు అనుకుంటాను.)

ఓపికగా ఈ కబుర్లు చదివిన అందరికి ధన్యవాదములు.

30, మే 2012, బుధవారం

- Plz think about thiss.-

1. We live in a nation where Rice is Rs.40/- per kg and Sim Card is free.
2. Pizza reaches home faster than Ambulance and Police.
3. Car loan @ 5% but education loan @ 12%.
4. Students with 35% get in elite institutions thru quota system and those with 90% get out because of merit.

5. Where a millionaire can buy a cricket team instead of donating the money to any charity. 2 IPL teams are auctioned at 3300 crores and we are still a poor country where people starve for 2 square meals per day.

6. Where the footwear, we wear, are sold in AC showrooms, but vegetables, that we eat, are sold on the footpath.
7. Where everybody wants to be famous but nobody wants to follow the path to be famous.
8. Assembly complex buildings are getting ready within one year while public transport bridges alone take several years to be completed.
9. Where we make lemon juices with artificial flavours and dish wash liquids with real lemon.
Think about it!

If you cross the The North Korean border illegally, you get . . .12 years hard labour in an isolated prison .....

If you cross the Iranian border illegally, you get . . . detained indefinitely ....
If you cross the Afghan border illegally, you get . . . shot . . .
If you cross the Saudi Arabian border illegally, you get ..... jailed ....
If you cross the Chinese border illegally, you get .....kidnapped and may be never heard of - again ....
If you cross the Venezuelan border illegally, you get ..... branded as a spy and your fate sealed .....
If you cross the Cuban border illegally, you get ..... thrown into a political prison to rot .....
If you cross the British border illegally, you get ..... arrested, prosecuted, sent to prison and be deported after serving your sentence .....
Now ...
if you were to cross the Indian border illegally, you get .....
1. A ration card
2. A passport ( even more than one - if you please ! )
3. A driver's license
4. A voter identity card
5. Credit cards
6. A Haj subsidy
7. Job reservation
8. Special privileges for minorities
9. Government housing on subsidized rent
10. Loan to buy a house
11. Free education
12. Free health care
13. A lobbyist in New Delhi , with a bunch of media morons and a bigger bunch of human rights activists promoting your cause
14. The right to talk about secularism, which you have not heard about in your own country !
15. And of-course ..... voting rights to elect corrupt politicians who will promote your community for their selfish interest in securing your votes !!!
16. and right to fight election for MLA or MP
Hats off ..... to the .....

A. Corrupt and communal Indian politicians
B. The inefficient and corrupt Indian police force
C. The silly pseudo-secularists in India , who promote traitors staying here
D. The amazingly lenient Indian courts and legal system. That's why people like Afzal Guru are still alive, same will happen with Kasab.
E. WE self centered Indian citizens, who are not bothered about the dangers to our own country.
F. The illogically brainless human-rights activists, who think that terrorists deserve to be dealt with by archaic laws meant for an era, when human beings were human beings.

THE MINIMUM U CAN DO IS FORWARD THIS TO ALL


29, మే 2012, మంగళవారం

ధియేటర్ ఆర్టిస్ట్లు


ధియేటర్ ఆర్టిస్ట్లు

వారు నిత్యం తిరుగుతూనే ఉంటారు
పగలు అలుపెరుగని సూర్యుడిలా
రాత్రి సగం రోజులకి పోరాడే చంద్రుడిలా
రేపు గురించి చింతే లేదు
మార్కెట్ ధరలతో అస్సలు పనే లేదు
ఏది లబిస్తే అదేపరమాన్నం
నిత్యం మూన్ లైట్ డిన్నర్లే

పైరగాలులని శబ్ధవేదనని 
దోమకాటులని సమంగా అనుభూతిస్తారు..
వారి ఉనికి మారదు
వూరు మారుతుంది అంతే

వాళ్ళ బ్రతుకులలో నిశ్చలత్వం
వాళ్ళ కన్నులలో నిర్భయత్వం
వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు.

మాటల గారడీలు చేస్తారు..
పాటలకి పేరడీలు కడుతుంటారు..
ఎదుటివారిని బురిడీలు కొట్టిస్తారు..
కానీ.. అరచేతిలోమహాలక్ష్మి ని చూపి
అరక్షణంలో మాయమయ్యే
బోగస్ చిట్ ఫండ్ కంపెనీ వాడిలా కాదు

వాళ్ళు పగటి వేష గాళ్ళే !
డాబు,దర్పం, హంగు-ఆర్భాటం అన్నికధలికల్లోనే !
మాయలు మంత్రాలు చూపుతారు
మాటల మంత్రదండాలు ప్రయోగిస్తారు
జోలె నింపుకుంటారు
తప్ప పైలా - పచ్చీస్సు వాళ్ళు కాదు

మన కళ్ళకి కనికట్టు కట్టి
నిలువెల్లా ముంచేయరు
అందమైన ప్యాకింగ్ మాయాజాలం
మన మీద విసరరు
ఎవరినైనా అమ్మ, అక్క, తల్లి చెల్లి అంటూ
నాలుగు కాలాలు నల్గురు నోళ్ళ నానుతుంటారు
అదే వారి కమ్యూనికేషన్ స్కిల్ 

ఆశల వర్తక వాణిజ్యంలో
మన చేత గంగిరెద్దులా తల ఆడింపచేయరు 
రాములోరికి దణ్ణం పెట్టిస్తారు..
ఇల్లాలు.. సీతమ్మకి దీవెనలిప్పిస్తారు
విశ్వసిస్తాం కనుక మన గోత్రాలు చెబుతారు

మన మద్య ఉన్న మనుషులని దేవుళ్ళ ని చేయరు
ఒళ్ళు మరచి ఇల్లు గుల్ల చేయించే
మూఢ భక్తికి నిధర్శకులు కారు
మతాల రంగు మార్చే ప్రచారకులు కారు
భవిష్యత్ ని జోస్యంతో చెప్పి
ఆశ కల్గిస్తారు తప్ప 5 ఏళ్ళ కాలాన్ని
వాగ్దానాలతో పూరింపని వారు.

వాళ్ళ పెరఫార్మేన్స్ కి 
వేదికలు అక్కరలేదు
ప్రచారం పని అసలే లేదు
వాళ్ళు స్వతహాగా ధియేటర్ ఆర్టిస్ట్లు
సహజం గా రాణిస్తారు
ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఉండదు
వారు జీవితాన్నిజీవిస్తారు
జీవనంలో మరణిస్తారు

27, మే 2012, ఆదివారం

సరస్సు


నేను సరస్సుని

నేనొక.. నిశ్చలమైన అందమైన సరస్సుని..
నింగినుండి కురిసిన చినుకులో చినుకునై ,
వరధనై..పరవళ్ళు..తొక్కాలని.. సందళ్ళు.చేయాలని.
నా..మది గదినిండా..ఎన్నో ఆశలు..ఆకాంక్షలు..

మన్ను మిన్నై నలుచెరుగులనుండి బాహుబందాలలో.. బంధించితే..
మరి నాకు ఏది గతి... ?
సఫలం కాలేని నా..కలలభారంతో ....విఫల మనస్కనై..
నే.. కార్చే.కన్నీరు నాలోనే ఇంకిపోయే నాకే సొంతమైన.. దుర్గతి
నాలో నేనే .. ఎన్నటికి నాలో నేనే..

నాలో నన్నే అంటిపెట్టుకున్న జీవరాశులు ఎప్పటికి..
తల్లి.. గర్భం నుండి బయట పడని బిడ్డల్లా.
వాటి చిరుకధలికలకి.. ఎంతో..పులకింత
నా ఒడ్డున పెరిగే గడ్డిపూవును, చెట్టుమానును..
ఒకేలా.. ప్రేమ పంచేస్తూ..ఒకే పరికింత

దారినపోయే ఏ కొంటెకోనంగి విసిరిన రాయితో..
అలజడి మొదలైతే కోపం ఇసుమంత

అద్దం లాంటి మనసుతో..
అద్దంలా.. భాసించే నాలో.. నేను
తొంగి చూసుకుంటుంటే సంతసం మరింత..

దాహార్తి తో .. వచ్చి దోసిళ్ళతో నింపుకుని తృప్తిపడి వెళుతుంటే..
తల్లినై.. స్తన్యాన్ని.. అందించిన సంతృప్తి కొండంత

నేను నేనే.. ఎన్నటికి నేను నేనే!

(పత్రిక 2008 మార్చి సంచికలో ప్రచురింపబడ్డ కవిత)

26, మే 2012, శనివారం

బిచ్చటపు ఎద













తండ్రీ..
ప్రేమ రాహిత్యంలో కొట్టుకుని పోతూ
నన్నే ఊతగా చేసుకుందామని వచ్చిన వారికి
రిక్త హస్తాలతో పంపుతున్న
నావద్ద బిచ్చటపు ఎద మాత్రమే ఉందని నీకు తెలుసు..
వారికి నేనేమివ్వగలను

ప్రేమ-శరీర ద్వంద్వాలు
ప్రకృతి-పురుషులు
మనిషి మనిషికి మధ్య
అత్యంత సన్నిహిత సంబంధపు వంతెన
 ప్రేమ అనే భావన.

స్త్రీ-పురుష స్నేహబంధాన్ని
కేవలం శరీరాల పరిబాషలో చూసే ఈ లోకాన
నీ స్వభావాన్ని
నీవు ఇచ్చినంత గొప్పగా
పంచినంత తీయగా
మేమెలా ఇవ్వగలం

ఎన్నెన్ని అనుమానాలు
ఎన్నెన్ని సంశయాలు

నీ అదృశ్య హస్తంతో..
ప్రేమరాహిత్యంలో కొట్టుకుని పోతున్నవారిని
సేద తీర్చు తండ్రీ

ప్రేమ అనే రెండక్షరాలకున్న
అనంతమైన అర్ధాన్ని
భావ దారిద్ర్యంతో
కొట్టుమిట్టాడుతున్న వారికి
అణు మాత్రమైనా తెలిసేలా
నీ అంశని  ట్రాన్స్ ప్లాంటేషన్ చేయగల వైధ్యుడివి
నీకు సాధ్యం కానిదేముంది

ప్రేమించడం మాత్రమే మాకు తెలిసిన విద్యగా
ప్రేమని బదులు ఇవ్వడమే ఎదుటి వారి  నైజంగా
అద్భుతమైన  ప్రేమ రాగాలని సృష్టించగల
వైణికుడివి నీవే కదా

విశ్వాన్ని కంటి రెప్పలా కాచేది
ఎల్లెడలా సాంత్వన చేకూర్చేది
విశ్వమంత రహస్యం .
విశ్వరహస్యం ప్రేమే కదా

నీ సహజగుణాన్ని
జీవన పర్యంతం మాకు
అరువుగా ఇవ్వు తండ్రీ
అసలు, వడ్డీ ఇక్కడే. చెల్లించి వస్తాను
అదే కదా  ప్రేమ నైజం.

25, మే 2012, శుక్రవారం

మొబైల్ ముచ్చట్లు - ఇక్కట్లు




మహిళలు మీ మొబైల్ నంబర్లు ని ఇతరులకి ఇచ్చేముందు కాస్త ఆలోచించండి. మధ్య నా ఫ్రెండ్ ఒకరు వాళ్ళ అమ్మాయిని ..కార్పోరేట్ కాలేజ్ లో జాయిన్ చేయడానికి అమ్మాయితో కలసి వెళ్ళారు అక్కడ అవసరం అయిన చోట పోన్ నంబర్స్ ఇవ్వవలసి రావడం అవసరం కదా! అలాగే నంబర్ ఇచ్చి వచ్చిన తర్వాత నుండి మొదలయ్యాయి తల్లికి ఇబ్బందులు.
హాయ్
..అన్న పలకరింపులు ఎస్.ఎమ్.ఎస్ రూపంలో ప్రత్యక్షం.ఆన్సర్ ఇవ్వకపోయినా సందేశాల ప్రవాహం తగ్గలేదు సరి కదా పోన్ కాల్స్ రావడం మొదలయింది.
"
అసలు నువ్వెవరు..ఎందుకు ఎస్ ఎమ్ ఎస్ లు పంపుతున్నావ్? మా యోగ క్షేమాలతో..నీకేమిటి అవసరం? అసలు నా నంబర్ ఎలా వచ్చింది?ఇలా ఇబ్బంది పెడితే.. నీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది" అని గట్టిగా మాట్లాడే సరికి ..ఆంటీ!.. నంబర్ నా పోన్ లో ఉంది..ఎవరో నాకు తెలిసినవారు అనుకుని చేసాను అని చెప్పాడు.కానీ నంబర్ ఎవరిదో.. అని కాస్త కష్ట పడి సేకరిస్తే తెలిసిన విషయం ఏమిటంటే.. కాలేజ్ అడ్మిషన్ అప్పుడు రాసి ఇచ్చిన వివరాలలోని మొబైల్ నంబర్ తీసుకుని..అలా ప్రవర్తించినది.. "డీన్" స్థానం లో ఉన్న  ఒక లెక్చరర్ అని తెలుసుకుని.. వీళ్ళకి ఏం వచ్చిందే ! ఇలా ప్రవర్తిస్తున్నారు ..వీళ్ళు అసలు గురువులు స్థానంలో ఉండాల్సిన వారేనా!?  వీళ్ళు పిల్లలతో  ఎలా ప్రవర్తిస్తారో తలుచుకుంటే భయం వేస్తుంది" అని చెప్పింది నా ఫ్రెండ్.
ఇక
వాళ్ళ అమ్మాయి ఇంకొక స్టన్నింగ్ న్యూస్ చెప్పింది. తను పదవ తరగతి చదువుతున్నప్పుడు.. కో-ఆర్డినేటర్ సార్ మా క్లాస్ మేట్ అమ్మాయి అంటే ఇంటరెస్ట్ చూపించేవాడు. స్టడీ అవర్స్ లో అమ్మాయి తో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. అమ్మాయి మాట్లాడక పొతే కోపాన్ని అకారణంగా మిగతా ఆడపిల్లల పై ప్రదర్శించి తన అక్కసు తీర్చుకునేవాడు.ఆడపిల్లలపై కంప్లైంట్స్ రాసి  తన కసి తీర్చుకునేవాడట.
ఇక నా ఫ్రెండ్ ఒకామె భర్త యాక్సిడెంట్ లో చనిపోయి ఇద్దరు మగ పిల్లలతో ఒంటరి పోరాటం చేస్తూ..ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం కోర్ట్లు చుట్టూ తిరుగుతూ..ఒక సారి తన కేసు వాదించే లాయర్ కి కాల్ చేయాల్సి వచ్చింది  pపొరబాటుగా ఒక నంబర్ తప్పుతో వేరొక నంబర్ కి కాల్ చేయడం తో..ఆమెకి వచ్చి పడింది..పెద్ద ముప్పు.కాల్ చేయగానే లాయర్ కాకుండా వేరొకరు మాట్లాడటం తో..పొరబాటు తెలుసుకుని  "సారీచెప్పి లైన్ కట్ చేసిందట .
ఇక
ఆరోజు నుండి  ఆమె  పొరబాటుగా కాల్ చేసిన నంబరు నుండి అర్ధరాత్రుల్లు పోన్ చేసి ఆమెని ఎవరు మీరు ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నలు వేయడం మొదలయింది. పిల్లల ముందు రాంగ్ కాలర్ తో మాట్లాడాల్సి రావడం తో పాపం! ఆమె ఎన్ని అవస్థలు పడిందో!ఆఖరికి రాత్రుళ్ళు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. అతను పగలు కూడా  పోన్ చేయడం మొదలు పెట్టాడు. ఇబ్బంది భరించలేక నాకు కాల్ చేసి విషయం చెప్పింది.
ఇక
నేను చూసుకుంటాను నువ్వు దిగులు పడకు అని చెప్పి.. నంబర్ కి కాల్ చేసి మా బంధువుల నంబర్ అన్నట్లు మాట్లాడి..సారీ చెప్పి పెట్టేయడం మరలా మర్నాడు చేయడం ..మళ్ళీ సారీ అనడం ఇలా వారం రోజులు టిట్ ఫర్ టాట్ రుచి చూపించినా అతను ..ఆమెకి పోన్ చేసి విసిగించడం మానలేదు. రోజుకి ఆరోజు పోన్స్ ద్వారా ఏం జరుగుతుందో.. తెలుసుకుంటూ.. రాంగ్ కాలర్ కి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుని. అర్ధ రాత్రి అతని నంబర్ కి కాల్ చేయడం ..అతను భార్య ముందు పోన్ లిఫ్ట్ చేయలేక, లిఫ్ట్ చేయకుండా ఉండటం ఎందుకో భార్యకి చెప్పలేక తెగ ఇబ్బంది పడిపోయాడు.  గడ్డి పరక అని భావించిన ఆడవాళ్ళు , నానారకాలుగా ఇబ్బందులకి గురి అయిన ఆడవాళ్ళు తలచుకుంటే ఎలా ఉంటుందో ..తెలుసుకుని.. బుద్ధి వచ్చింది తల్లుల్లారా! అని దణ్ణం పెట్టేసాడు. భయ పడితే,కాస్త మెత్తగా కనబడితే అలాగే ఇబ్బంది పెడతారు. భయపడటం ఎందుకు ? అంటాను నేను.
ఇంకో
రకం వాళ్ళు ఉంటారు లెండి. మిస్ కాల్ ఇస్తారో,లేదా కాల్ చేసి అబ్బే మేము అసలు మీ నంబర్ కి కాల్ చేయలేదు అంటారు.మొబైల్ పోన్ లో మిస్ కాల్స్ లిస్టు చూసి సంస్కారంతో తిరిగి ఆ  నంబర్ కి కాల్ చేసేవాళ్ళు విషయంలో బాగా ఇబ్బంది పడతారు అని నా అనుభవం కూడా  .

ఒకోసారి
బిజీ టైములో కాల్స్ అటెండ్ అవడం వీలవక మిస్ కాల్స్ చూసి నంబర్ కి కాల్ చేస్తే మీకు మేము  అసలు కాల్ చేయలేదు అంటారు. అప్పుడు ఒళ్ళు మండి పోతుంది చూడండి.!?

ఒక సారి నాకు అలాగే జరిగింది ఒక ల్యాండ్ లైన్ నంబర్ నుండి మిస్ కాల్ వచ్చింది నేను వెంటనే నంబర్ కి కాల్ చేసాను. అబ్బే! అసలు మేము చేయలేదండి. మీ నంబర్ అసలు మాకు తెలియదు అంటాడు. లేదండి ఇప్పుడే కదా కాల్ వచ్చింది అన్నాను. ఆడవాళ్ళకి కావాలని ఇలా చేయడం ఇదొక అలవాటు అయిపొయింది..అని పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకుంటూ..ఏదో అంటున్నాడు. పోన్ ఆఫ్ చేసి నంబర్ వివరం చూస్తే మా లోకల్ నంబరే ఎక్సేంజ్ కి వెళ్లి గారిని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నంబర్ ఉన్న ఇంటి  అడ్రస్స్ ఇచ్చారు .
అడ్రెస్స్ కి వెళ్లి .. పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకున్న ఆ ఇంటాయనని,ఆయన భార్యని కూడా బయటకి పిలిచి ..కాల్ రిజిస్టర్ లో ఉన్న వారి నంబర్ ని చూపించాను. ఆమెకి నీ భర్త ఇలా మాట్లాడుతున్నాడు.అది సంస్కారమేనా అని గట్టిగా అడిగి వచ్చాను. అతను చెట్టులా నిలబడ్డాడు కానీ కనీసం సారీ కూడా చెప్పలేదు. అతని బదులు ఆమె చేతులు పట్టుకుని సారీ చెప్పింది.

మహిళల్లో కొంత మంది అతను చెప్పినట్లు చేసేవారు ఉండవచ్చు. అలాంటి వారి ప్రవర్తన వల్ల ఇతరులని కూడా అలా అనుకుంటే ఎలా!? ఏమిటో కొందరి చెడు ప్రవర్తన కల్గిన ఆడవారి వల్ల అందరు ఆడవాళ్ళకి కల్గుతున్న ఇబ్బందులు ఇవి.
అయినా ఏదో పొరబాటున ఒక కాల్ వెళితే జరిగిన పొరబాటు గుర్తించి ఓ..సారి క్షమించ మని అడగడం నామోషి అనిపించుకుంటుందో,లేకపోతే ఇంకో విధంగా కావాలని వేదించడం ,పనిగా పెట్టుకుంటారో..కాని ఇలాంటి విషయాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి.

వీలైనంత వరకు అవసరమైన చోట ఇంట్లో ఉన్న మగవారి నంబర్స్ ఇవ్వడం శ్రేయస్కరం అనిపిస్తుంది. అప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పుతాయి. అలా అని ఇబ్బందులు వస్తున్నాయని భయపడటం కూడదు.
నా ప్రెండ్ విషయం లో చూస్తే ఎక్కడో దూర ప్రాంతం లో ఉన్న ఆమె భర్త నంబర్ ఇవ్వడం కన్న కాలేజ్ తో అనుసంధానం కోసం ఆమె మొబైల్ నంబర్ ఇవ్వడం తప్పు కాదు. కానీ ఆ నంబర్ చూసి తీసుకుని కావాలని పరిచయం పెంచుకోవాలని,,ఇబ్బంది పెట్టాలని చూసిన "డీన్" స్థాయి వ్యక్తీ దగ్గర నుంచి.. అనాలోచితంగానో,లేక అహంకారం వల్లో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకునే వారి వరకు మన మధ్యనే ఉన్నారు.

పోన్ కాల్స్ తో వేధించే వారి సంఖ్యా విపరీతం గా పెరిగిపోతుంది.వేదింపులని ఎదుర్కునేవారు దైర్యంగా ముందుకు వచ్చి తమకి కల్గిన ఇబ్బందిని చెపుతూ కంప్లైంట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల గౌరవం దెబ్బ తింటుందని దాచి పెట్టుకుంటే అనేక సమస్యలు వస్తాయి.

అలాగే అవసరం అయినప్పుడు బయట వ్యక్తులకి నంబర్ ఇవ్వాల్సి వస్తే ల్యాండ్ లైన్ నంబర్ ఉంటే ఆ నంబర్ ఇవ్వడం శ్రేయస్కరం. ఎందు కంటే ల్యాండ్ లైన్ కి ఎస్ ఏం ఎస్ లు గట్రా అవకాశం ఉండదు కదా!
లేదా అసలు పోనే వద్దనుకుంటే మరీ మంచిది.ఈ నవీన యుగంలో పోన్ ల వల్ల కలిగే ఇబ్బందికి భయపడటమా?
సమస్యలకి భయపడటం గురించి మీరు చెపుతున్నారా !? అని అనుకోవద్దు.

పోన్ లేకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.అవసరం అనుకుంటే ముఖ్యమైన వారికి మాత్రమే మన నంబర్ తెలిసి ఉండటం కొత్తవారికి మొబైల్ నంబర్ ఇవ్వకుండా ఉండటం మంచిదని నా అభిప్రాయం.. ఎందుకంటే మొబైల్ హెల్ అంటే మాటలు కాదు. నానా రకాల పైత్యాలని చూడాలి .
నా అనుభవం ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యం తో ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదములు.

24, మే 2012, గురువారం

మై స్పేస్ ..అమ్మలక్కల కబుర్లు



అయ్య బాబోయ్! ఏమి ఎండలండీ!? రోళ్ళు పగిలే ఎండలు..అంటారు కదా ! అలా.. అన్నమాట.
ఓ..వెచ్చని సాయంత్రం పవర్ కట్ అయిన సమయాన ..మా వరండా సాక్షిగా అమ్మలక్కల ముచ్చట్లు మొదలేట్టాము.ఇలా ముచ్చట్లు మొదలయ్యాయి.

వేసవి తాపం తీర్చే పానీయాలు ఉండగా, గంగా శీతల పవనాలు ఇలాటివేవేమో ఉండగా వేసవి అంటే భయం ఏల అనుకునే అమాకపు రోజులు కి కాలం చెల్లిపోయింది.

రోజుకి ఓ..మూడు సార్లు స్నానాదులు, ఓ..ఆరు సార్లు చెమట స్నానాలు..ఉష్..లు, అబ్బ బ్బ ఏమి కరంటు కోత..చంపుతున్నాడు దొంగ సచ్చినాడు.. అని తిట్లు..

అంతేనా!? రాత్రి సమయాలలో ఎప్పుడు టప్ మని పోతుందో తెలియని అనిశ్చితి. వెదవది జీవితానికి ఒక సెక్యూర్డ్ లేకుండా పోయింది. కరంటు పోయిందా కాస్తంత గాలి పోసు కుందామని ఇంటి బయటకి వస్తామా!?
దోమలు వీర విహారం చేస్తుంటాయి. కాస్త వాటికి రక్త దానం చేస్తూ ..ఎలాగోలా ప్రాణాలు ఉగ్గబట్టి ఒక రోజు బ్రతికాం అనిపించుకుని ..భూపాల రాగం ని నీరసంగా ఆస్వాదిస్తూ సూర్యోదయం కోసం ఎదురు చూసి ఓ..రోజు గడిపేసి ..సూర్య నారాయణా ! ఏమిటయ్యా నీ ప్రతాపం!? చచ్చి పోతున్నాం కాస్త కరుణించి..మబ్బుల మాటున దాక్కో కూడదా!అని వేడుకుంటూన్నాం.

అమ్మాయ్ ! అలా చీరలు కట్టుకుని గాలి పోసుకోక ఏమి బాధ పడి పోతావ్?? నాకు లాగా నైటీ వేసుకోరాదు..అని నా వైపు ఓ..జాలి చూపు విసిరి ఉచిత ..సలహా పడేసింది మా వీధిలో డెబ్బై ఏళ్ళ మామ్మగారు..

అబ్బే! నైటీ,నైట్ డ్రెస్ లు లాంటివి నాకు అసలు అలవాటు లేదండీ ! నా ఒంటికి అలాటివి అసలు సరిపడవు. అన్నాను.

"మాకు మాత్రం అలవాటు ఉందా ఏమిటీ! చీరల బరువు మొయ్యలేక వీటి అలవాటు పడ్డాం" గాని అంది.
'
అవును మరి..ఒళ్ళు బరువుని మోసుకోవడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఇంకొక బరువు అనిపించే అయిదున్నర మీటర్ల చీర ,ఆరు గజాల చీర నిజంగా బరువే కదండీ!

అందుకే నోట్ల కట్టంత బరువుతో చేనేత చీరలు కొనుక్కుని "ఉప్పాడ చీర" లని ఎక్కడో చిటారు కొమ్మన తగిలించాం కదా అన్నాను.

అవునమ్మాయి! ఏముంది..ఆ ఉప్పాడ చీరలో ..? అన్ని వేలకి వేలు పోసి కొంటున్నారు అంది .

ఏముంది అంటే? నాజూకు తనం,పనితనం,మానవ శ్రమ,సహజ మైన రంగులు ..అంతేనూ.అన్నాను దీర్ఘం తీసి.

బంగారం చూస్తే చుక్కలు చూపిస్తుంది.మెడలో గొలుసు వేసుకోవాలన్న భయం వేస్తుంది. ఈ కరంటు కోతల్లో..బయటకి, లొపలకి మారుతూ ఉంటే.. ఏ దొంగోడు జొరబడి దోచేస్తాడో..లేకపోతె. మెడలో నుండి పుట్టుక్కున్న లాక్కు పోతాడో అన్న భయం పట్టుకుంది అంది.

అవును నిజం నిజం అన్నాను.

అసలు ఇప్పుడు బంగారం ఎవరు వేసుకుంటున్నారు లెండి ? వన్ గ్రామ బంగారు నగలు అసలు వాటికన్నా ధగ ధగలాడుతూ మురిపిస్తున్నాయి. అవి చాలు. అయినా ఆ ధరలు చూస్తే మన మధ్య తరగతి వాళ్ళు కొనగలిగే టట్లు ఉందా ..ఏమిటీ? అంది.. ఇంకొక ఆవిడ.

అవును .. మీరు చెప్పినట్లు అసలు ఆభరణాలు ఎవరు వేసుకుంటున్నారు అండీ! మెడలో ఒక్క నగయినా లేకుండా ఆఖరికి పుస్తెల తాడు కూడా లేకుండా సింపుల్ గా నేక్లేస్స్ లతో కనువిందు చేసిన మన మహిళా మణులు ఇప్పుడు చేతులు నిండా గాజులు వేసుకుని చెవులకి భారీగా వేలాడే పోగులు పెట్టుకుని, మెడలో ఏమి వేసుకోకుండా..శంఖం లాంటి మెడ అందాన్ని నగ్నంగా చూపుతున్నారు. మీరు గమనించ లేదా ఏమిటీ!? పైగా పోద్దస్తమాను తెలుగు,హిందీ సీరియల్స్ ని మిక్స్ చేసి మరీ చూస్తుంటారు అని అడిగాను.

"చూస్తున్నాను. అదేమీ దిక్కుమాలిన ప్యాషనో..మెడలో తాళి లేకుండ తిరుగుతారు.పెళ్ళయిన వాళ్ళో తెలియదు,కాని వాళ్ళో తెలియదు అయినా ఆడవాళ్ళకి పతి భక్తీ తగ్గి పోయింది. అదివరకు మెడలో తాళి తీసేవారా? అంది ఆవిడ.

తాళి తీసి పడేసినా పాపిటలో సింధూరం చెపుతుంది కదా!పెళ్లి అయినట్లు ఇంకా అర్ధం కానిది ఏముంది ?అడిగాను.

ఏమోనండీ! ఈ ఎండల చిరాకు కి మెడలో గొలుసు తీసి లోపల పెడతానా..!అప్పుడే మా ఆయన అడుగుతుంటారు.

"ఏమే !కాస్త నేను బతికి ఉన్నాను అన్న గుర్తుకైనా ఆ మెడలో గొలుసు ఉంచవే.. మన బంధువుల్లో ఎవరైనా వచ్చి ఇప్పుడు ఇలా కొత్తగా నిన్ను చూస్తే నేను కాలం చేసాను అనుకుంటారు. లేదా నువ్వేడైనా కొత్త మతం పుచ్చుకున్నావని అయినా అనుకోగలరు అంటారు.

అయ్యో! నేను పుణ్య స్త్రీనండి. చేతుల నిండా గాజులు,ముఖాన ఇంత కుంకుమ బొట్టు తో ఇలా సింగారంతో కనబడుతుంటే అలా ఎలా అనుకోగలరు?

ఏమిటో..ఈ సంప్రదాయాలు, గుర్తులు విసుగుపుట్టిస్తారు. ఇవన్నీ అలంకరణలో భాగాలు అని తెలుసుకోరు ఏమిటో!అంది మరొక ఆవిడ. అయినా మంగళ సూత్రాలు,నల్ల పూసలు ,కాలికి మెట్లు,నుదుట కుంకుమ ఇవి పెట్టుకుంటేనే స్త్రీ మూర్తులు లేకుంటే కాదా ఏమిటీ?
చీర కట్టుకోవడం లేదు,ఫేంట్ ,షార్ట్ ,షర్ట్ వేసుకుని కూడా మంగళ సూత్రం వేసుకోవడం లేదని అంటే ఏం చెపుతాం చెప్పండి?అలంకారమో,బరువో, బరువులా అనిపించే బాధో..ఏమని చెప్పడం? ఇష్టం లేకపోయినా మోయక తప్పదు. అది మంగళ సూత్రమైనా, కుటుంబ బరువైనా కూడా! అని నిట్టూర్చడం చూస్తే ..
ప్చ్..ఏం బాధలు? అనిపించక మానదు.

ఏదో విసుగుతో మీరు ఇలా అంటున్నారు కాని మీ వారు.. ఏదైనా నగ కొనిస్తాను అనగానే వెంటనే షాపింగ్ కి పరుగులు తీయరు.!. ఆభరణాలు,నగలు ఎవరికి చేదు చెప్పండి? అందుకే మగవారు ఓ..చీరో,లేదా ఓ..నగో కొని ఇచ్చి అయిస్ చేసేస్తారు. అన్నారు మరొకరు..

ఆడవాళ్ళకి ఆభరణాలు అందునా బంగారు ఆభరణాలు ఒంటి మీద ఉండటం అంటే.. అది వారి ఆస్తిగా భావించే వాళ్ళు అంట. పూర్వపు రోజుల్లో ఆడవాళ్ళకి ఆస్తి హక్కు,వారసత్వపు హక్కు లేక పోవడం వల్ల ఒంటిమీద ఉన్న ఆభరణాలే ఆస్తిగా పరిగణించే వారట. స్త్రీ కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు,అత్యవసర సమయాల లోను ఆమెకి ఆధారంగా ఉంటాయని బంగారు ఆభరణాలు పెట్టేవారట.ఇప్పుడు అయితే ఆభరణాలు వద్దు..చదువే అసలైన ఆభరణం అని తెలుసుకుంటున్నారు. అది చాలు కదండీ! అన్నాను నేను.

అవునండీ! అమ్మాయిలూ ఉంటే నగలు,చీరలు అని కొనకుండా ఆ డబ్బుతో చదువులు చెప్పిస్తే అంతే చాలు. తర్వాత జీవితాంతం భర్త కొని పెట్టేదాకా ఎదురు చూడ కుండా వాళ్ళే ఏం కావాలంటే అవి కొనుక్కుంటారు అంది

అయ్యో.. ! అని నెత్తి కొట్టుకున్నాను. ఇది మహిళల ఆలోచనా తీరు . ఈ నాటి మా వెచ్చని సాయంత్రపు కబుర్లు.
ఇలా ఉబుసు పోక కబుర్లుతో.. ఉహూ ..కాదు కాదు.. ఎవరి ఆలోచనా పరిధి ఏమిటో..తెలిపే కబుర్లుతో..ఈ సాయంత్రం గడచి పోయింది.

అచ్చు ఇలాంటి కబుర్లు చెప్పుకోవాలంటే.. పురుష ప్రపంచం వినకుండా అచ్చు ఆడాళ్ళ కబుర్లే చెప్పు కోవాలంటే,మగ వాళ్ళని తిట్టు కోవాలంటే ఆడువారికి . ఓ..స్పేస్ ఉండాలి..కదా!

అలాంటి స్పేస్ ఒకటి సృష్టించుకున్న అమ్మలక్కల కబుర్లు అప్పుడప్పుడు చెపుతూ ఉంటాను ..సరేనా..అండీ! ఇప్పటికి ఉంటాను మరి.

22, మే 2012, మంగళవారం

రాజ సూయ యాగము


నా స్నేహితురాలి కూతురు మొన్న ఆదివారం "శ్రీరామరాజ్యం " చిత్రం ని ఆసాంతం ఓపికగా కూర్చుని చూసిందట.

"విశేషమే!అవసరమే కూడా "అన్నాను. అశ్వమేధ యాగం గురించి చెప్పమని అడిగింది అట వాళ్ళ అమ్మని.

ఇప్పుడు చూసావు కదా!ఇంకా నేను చెప్పడం ఏమిటీ!? అంతకన్నా నాకు తెలియదు..వనజ ఆంటీని అడుగు ..అని చెప్పిందట.

ఆ పిల్ల పోన్ చేసి ఆంటీ..అశ్వమేధ యాగం గురించి చెప్పండి.

"చచ్చాను బాబోయి" అనుకున్నాను. ఎందుకంటే నాకు కూడా ఏమీ తెలియదు "రామాయణం" ఇంట్లో లేదు.. భారతం లో దాని గురించిన వివరాలు ఉంటాయి. చూసి చెపుతాను ..అన్నాను.

మెయిల్ చేయండి..ఆంటీ !అని చెప్పింది.

పర్లేదు..విని వదిలేయక కాస్త తలకి ఎక్కించుకుంటుంది అన్నమాట అనుకుని .. ఇంకా ఏమిటీ విశేషాలు? అన్నాను.

మామూలు యూత్ లాగా సినిమా కబుర్లు చెప్పకుండా .. జగన్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాం అంది.

నాకు ఒక షాక్!..ఏమిటీ? ఏమి పట్టనట్టు ఉండే పిల్లలు ఇలా కూడా వేచి చూస్తున్నారా?అని.

సరే... తను అడిగిన విషయం చెప్పడానికి భారతంలో అశ్వ మేధ యాగం తో పాటు..రాజ సూయ యాగం గురించి చూసి తెలుసుకున్నాను.

నేను చదివిన విషయము ఇక్కడ....

ఒకానొక రోజు నారదుడు.. భూలోకమునకి వేంచేసి...యదిష్టురునితో లోక పాలక -బ్రహ్మ-స్వభావ సవ్రూపముల గూర్చిప్రస్తావించుతూ..

యదిష్టురిని కోరిక పై.. సత్య హరిశ్చంద్రుడు గూర్చియు,పాండు రాజు గురించియు చెబుతూ.. "నీ తండ్రి పాండు రాజు హరిశ్చంద్రుడు వైభవాన్ని చూసి ఆశ్చర్య పడి భూలోకానికి వచ్చు చున్న నాకు నమస్కరించి నన్ను ఆపి ..ధర్మజునితో..ఈ మాటలు చెప్పమని కోరినాడు.

నీవు సమర్దుడవు భూలోకమును జయించుట కునూ ,నీ సోదరులునూ సమర్ధులు వారందరూ నీ వశంలో ఉన్నారు. రాజ సూయ యాగం నను స్టింపుమని చెప్పుము. వారు రాజ సూయ యాగం చేసిన యెడల నేను నీ తండ్రినగు నేనును దేవేంద్రుని సభలో చిరకాలము ఉందును అని పాండు రాజు సందేశాన్ని వినిపించి రాజ సూయ యాగం చేయుటకు ప్రోత్సహించినాడు

ఆ యాగము గురించి చెపుతూ.. ఈ యజ్ఞం చాలా విఘ్నములతో గూడి యుండును.యజ్ణ విఘాతకులగు బ్రహ్మ రాక్షసులు యాగంలో జరుగు లోపాలను వెదుకుదురు. .క్షాత్ర వినాశన మగు యుద్ధం కూడా దీని వలన కలుగును.ఇదంతా ఆలోచించి క్షేమమనిపిస్తేనే రాజ సూయ యాగము నాచరింపుము..అని చెప్పెను.

అటు పిమ్మట ధర్మజుడు రాజ సూయ యాగము తలపెట్టేను.

అంతకు ముందు ఆ యాగము ఎవరు చేయగలరో కూడా శ్రీ కృష్ణుడు చెప్పెను.

ఎవడు తలచినదంతా సిద్దిన్చునో..,ఎవడు అన్ని విషయములందు నూ పూజింప బడునో,ఏ రాజు సర్వమునకు అధిపతి యగునో..అట్టి వాడు రాజ సూయ యాగం చేయగలను. ఈ విషయములు ఎరింగి నీవు రాజ సూయ యాగం చేయగలవు అని ఆ పరమాత్ముడు చెప్పగా..

నీవు చేయ మంటే నేను చేయ గలను.వలదు అంటే..చేయలేను అని ధర్మజుడు అనెను.

అప్పుడు పరమాత్మ నీవు రాజసూయ యాగము చేయుటకు అన్నివిధాల అర్హుడవు. ఇంతకూ ముందే సమరాట్ అనిపించు కుంటివి. అయిననూ జరాసంధుని చంపి నటు పిమ్మటనే యాగం చేయ సంకల్పింపు మని జెప్పి జరాసంధుడని చంపుటకు ఉపాయం చెప్పినాడు.

"రాజా రాజ సూయేనా స్వారాజ్య కామోయజేత" అనునది రాజ సూయ విధి వాక్యం.

ఈ యాగమును క్షత్రియ వంశీయుడు -రాజుగా పరిపాలము నందు ఉన్నవాడు ,ఆహితాగ్ని అయినవాడు ఆచరించాలి.

రాజ సూయ యాగం యజ్ణ కాలం మూడు నుండి నాలుగు సంవత్సరముల మధ్య కాలం పట్టును అని చెప్పుట జరిగినది.

ఇక ఈ యజ్ఞం ని ఎవేరెవరు చేసి ఉంటిరి అనగా..

1 చంద్రుడు రాజ సూయ యాగం చేసెను. అది పూర్తి కాగానే "తారాకా మయం "అను పేరున దేవదానవ సంగ్రామము జరిగినది.

2 .వరుణుడు రాజ సూయ యాగం చేయగా సర్వ భూత వినాశాకమగు దేవదానవ మహా సంగ్రామము జరిగినది.

3 హరిశ్చంద్రుడు రాజ సూయ యాగం చేయగా "ఆడీ బకం "అనేపేరు కల క్షత్రీయ నాశనం అయిన యుద్ధం జరిగినది. .

ఇవి అన్నియు తెలిసిన "వ్యాసుడు " ధర్మజుడు రాజ సూయ యాగం చేయ తలపెట్టినప్పుడు ఎందుకు వారింపలేదని "జనమేజయుడు" అడుగుతాడు.

ఆ యాగము చేయుట పరమాత్మ ప్రేరేపితం . యాగము జరిగిన పిమ్మట యోదులందరూ మరణించుట తధ్యమని వారికి తెలియును కదా అంటాడు.

నారద వాచ్చా ప్రేరితుడు అయిన ధర్మజుడు కూడా ధర్మా చరణ నినిష్ట బుద్ది గనుక రాజ సూయ యాగం ఆచరింప తలపెట్టినాడు పైగా తండ్రి యొక్క సందేశం అది కదా!అంటాడు.

రాజ సూయ యాగము జరిగినతీరు..తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ భారతం చదివినవారి కి అన్నీ తెలుసు కదా!

అశ్వమేధ యాగం గురించి చెప్పమంటే.. రాజ సూయ యాగం చెపుతున్నాను అని అనుకుంటున్నారా!?

ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు . చెపుతున్నాను అంటే!.నా స్నేహితురాలి కూతురు.. జగన్ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పింది కదా!

అందుకు నాకు ఒక పోలిక ఇందులో కనబడింది.

తండ్రి రాజశేఖరుడి కోరిక మేరకు జగన్ యువరాజు గారు అవినీతి యజ్ఞం చేసాడు.దేశంలో ఎవరు చేయనంత గొప్పగా అన్నమాట. అవినీతి యజ్ఞం చేయమని ప్రోత్సహించినది.సాక్షాత్తు తండ్రి గారే.

చూసి చూడనట్టు ఊరుకుంది.. "సోనియా అమ్మవారే"

అవినీతి యజ్ఞం చేస్తే వచ్చే ఫలితాలు గురించి తెలిసి చెప్పని వారు శ్రేయాభి లాషులు చాలా మంది ఉన్నారు. అయినా హెచ్చరించలేదు.అంటే. జగన్ పతనాన్ని కోరుకున్నారన్నమాట.

ఇక రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో అసువులు బాసేవారు..ఎందరెందరో!అని నాకు అనిపించింది.
ఈ ఆలోచనలో.. నాకు కనబడిన కోణం ఇది.

జగన్ ని తెగిడి..వేరేవారిని పొగడ లేదు.. గమనించి నాపై యుద్ధం చేయవలదని బ్లాగ్మిత్రులకి మనవి..

పనిలో పనిగా ప్రతి ఇంటా.. కొన్ని పుస్తకాలు ఉండాలి.

ఓ..రామాయణ కావ్యం ని,మహా భారతం గ్రంధాన్నికొని పిల్ల చేత చదివించు తల్లీ! అని ..నా స్నేహితురాలికి చెప్పాను.