మనుషుల్లో అంతరాలని పెంచే కుల భావన ..నానాటికి మితిమీరిపోతుందని అనిపిస్తుంది.
ఇవాళ సమాజంలో కులం పేరుతొ.. తిట్టుకోవడం తరచూ కనబడుతుంది. అన్ని కులాలను తిట్టుకోవడం అంత పట్టింపు కాదేమోకాని ..కొన్ని కులాల పేర్లు ఉదహరించి కించపరిచే రీతిని నిరోదించేందుకు..కొన్ని చట్టాలు కూడా ఏర్పడ్డాయి
ఈ మధ్యనే .. అంటే ఓ..మూడు నెలల క్రితం జరిగిన యదార్ధ సంఘటన..ఒకటి.
విజయ్ అనే ఒక యువకుడు అగ్ర కులానికి చెందినవాడు. అతను వారి ఇంటికి సమీపంలో రోడ్డుపై నిలబడి ఉన్నాడు. అంతలో.. బుల్ హారన్ మ్రోగించుకుంటూ..ఓ..మోటార్ వెహికల్ పై (బుల్లెట్)ముగ్గురు కలసి వెళుతూ వారి ఇంటి సమీపంలోకి వెళ్ళినప్పుడు పదే పదే హారన్ మ్రోగిస్తూ మితిమీరిన వేగంతో వెళ్ళారు. విజయ్ కి ఆ ముగ్గురు పరిచయమే!వారు ఓ..వాడకి చెందిన పిల్లలు.(తప్పని సరి అయి ఉదహరించాల్సి వస్తుంది) వారు పని గట్టుకుని చేసే విపరీతమైన శబ్దం వల్ల..ఇంట్లో అనారోగ్యం గా ఉండి పడుకున్న విజయ్ తాత గారికి చాలా విసుగు కల్గుతుంది అనే ఉద్దేశ్యం తో.. "మీరు ఇటువైపు రాకండి. ఏమిటి ఆ మోత? అని కోపంగా అన్నాడు.
వెంటనే.. ఆ ముగ్గురు ..వారు వెళుతున్న బైక్ ని సడన్గా ఆపి వెనక్కి తిరిగి వచ్చి విజయ్ తో వాదనకి దిగారు. ఏం..రోడ్డు ఏమన్నా మీ బాబుదా!? నీకేనా బుల్లెట్ లు ఉండేది.మా దగ్గర డబ్బుంది.మేము కొనుక్కుని తిరుగుతాము. ఇక్కడ తిరగవద్దని చెప్పడానికి నీకేమైనా అధికారం ఉందా అని .. అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే.. దానికి వాదనగా అన్నట్టు ఇతను మీరసలు ఈ ఊర్లోకి రావద్దు. మీ హరిజనవాడకి వేరే దారి ఉంది..అటువైపు వెళ్ళండి ..అని అన్నాడు విజయ్. ఇక అక్కడ మాట మాట పెరిగి..అమ్మలు,అక్కలని, ఆలిని ఇష్టం వచ్చినంతసేపు ఆరేసి..ఇరువైపులవారు కొట్టుకునే అంత స్థాయికి వెళ్ళిందీ విషయం.
నలుగురొవచ్చి విడదీసాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
బైక్ పై తిరిగిన ముగ్గురు వ్యక్తులు అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. "విజయ్ అనే వ్యక్తి..మమ్మల్ని కులం పేరున దూషించాడు.ఆ రోడ్డు పైన సంచరించ వద్దని ఆర్డర్ లు వేసాడు. వాళ్ళ కులం వారి సపోర్ట్ తో మమ్మల్ని అవమానించి మా ఇంటివాళ్ళని కూడా అవమానంగా మాట్లాడారు" అని రిపోర్ట్ ఇచ్చారు.
అంతే.. అర్ధరాత్రి సమయంలో.. నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ తో పోలీసులు విజయ్ ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అది గమనించినతను..వేరే దారిన బయటపడి..తప్పించుకున్నాడు. అతనెళ్ళి ..మూడు రోజులు ఎక్కడో రహస్యంగా దాక్కుని ఉంటే..కేస్ లేకుండా చేయడానికి ..రాజీ మార్గాలు మొదలై.. కేస్ విత్ డ్రా..చేసుకోవడానికి దాదాపు మూడు లక్షలు రూపాయలు డిమాండ్ చేసారని ..తెలిసిన వారి ద్వారా బోగట్టా. ఆ రాజీ ప్రక్రియలు జరిగింది..సాక్షాత్ ఊరి మాజీ ప్రెసిడెంట్ సమక్షంలో .
బేరసారాలు కుదరక ..విజయ్ రహస్యంగా వెళ్లి పోలీసు స్టేషన్లో కాకుండా కోర్టులో లొంగిపోయాడు.
ఇక్కడ జరిగినదానికి చట్టం తన పని తానూ చేయడానికి మధ్య ఆర్ధిక లావాదేవీలా అవసరం ఏం వచ్చింది? నిజంగా కుల దూషణ వల్ల అవమానం, మానసిక హింస అనుభవిస్తే.. వారు శిక్ష పడాలని కోరుకోవాలి. అలా కాకుండా డబ్బు డిమాండ్ చేసి అడిగినంత ఇవ్వనందువల్ల కేస్ నడచి తమని తిట్టిన వ్యక్తికి శిక్ష పడాలనుకోవడంలో ఏ మాత్రమైనా పారదర్శకత కనబడుతుందా!?
యెంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి ..ఇష్టం వచ్చినట్లు తిట్టవచ్చా? అప్పుడు అవమానం అనిపించదా!?
అసలు కులం పేర తిట్టారో లేదో.. అన్న నిరూపణ కూడా లేకుండా ఒక కంప్లైంట్ ఆధారంగా.. వ్యక్తులని శిక్షించాలని అనుకోవడం కూడా సబబేనా!?
ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని అగ్ర కులస్తులని పని గట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఉన్నట్లు తోస్తుంది.
అగ్ర కులాల వారు అహంకారంగా ప్రవర్తిస్తూ , తిడుతూ వివక్ష చూపించే కాలం మారింది. ఇప్పుడు అందరూ సమానంగానే ఉంటున్నారు. ఉండాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల కొంత వివక్ష ఉండవచ్చు కూడా ! కాదనడం లేదు
కానీ చట్టం అండ ఉంది కదా ... అని అన్యాయంగా కేసులని మోపి.. వేధించడం కూడా బాధాకరమే కదా!
వ్యక్తిగతముగా కోప,ద్వేషాలు ఉంటే.. ఆ వ్యక్తి వరకే పరిమితం చేసుకుని ప్రదర్శించుకోవాలి. వారి వారి అభిప్రాయాలకి పరిమితం చేసుకోవాలి. కుటుంబంలోని స్త్రీలనందరిని తిట్టే సంస్కారం,కులం పేర తిట్టే సంస్కారం ..మరి వారికి ఉండవచ్చా!?
అవమానం అన్నాక, హింస అన్నాక అందరికి ఉంటుంది కదా! కులం పేరు ఎత్తకుండా.. అభిప్రాయ బేధాలు వస్తే..వివరణతో చర్చించుకోవడం జరగాలి కాని..కులం పేరు ఎందుకు ? అన్యాయంగా కేసులు పెట్టుకోవడం ఎందుకు ..అనిపించింది నాకు.
విజయ్ .. పదిహేను రోజులు రిమాండ్ ఖైదీగా ఉండి వచ్చి విచారణ కోసం ఎన్నోసార్లు కోర్ట్లు చుట్టూ తిరుగుతూ ఉంటే.. అగ్రకులలవారికి భయం పట్టుకుంది.
కొంత మందిని చూస్తే..గాలి సోక నంత దూరంగా మెలగాలిసి వస్తుందేమో! అంటున్నారు కూడా!
ఇది ఒక అంటరానితనమే కదా! కాకపొతే.. ఇక్కడ ఇప్పుడు అగ్రవర్ణ వాడలకి..అనాలేమో!
(కుల వివక్ష,మత వివక్ష ,లింగ వివక్ష లేని సమసమాజం అన్నది సుదూర తీరం గానే తోస్తుంది.. అంటరానితనం - ఒంటరితనం అనాదిగా ఈ జాతికి అదే మూలధనం ..!? అన్న బాధతో..ఈ పోస్ట్.)
ఇవాళ సమాజంలో కులం పేరుతొ.. తిట్టుకోవడం తరచూ కనబడుతుంది. అన్ని కులాలను తిట్టుకోవడం అంత పట్టింపు కాదేమోకాని ..కొన్ని కులాల పేర్లు ఉదహరించి కించపరిచే రీతిని నిరోదించేందుకు..కొన్ని చట్టాలు కూడా ఏర్పడ్డాయి
Prevention of attrocities act 1989
ఆ చట్టం రావడం వలన ఎస్ టి / ఎస్.సి వారి పై, దూషణ అవమాన కర వ్యాఖ్యలు తగ్గుతాయని ఆశించడం జరిగి ఉంటుంది. .కొన్ని చట్టాలు ఏర్పాటు చేసినప్పుడు..కొన్ని కేసులలో పారదర్శకత లోపించి.. అన్యాయంగా శిక్ష నెదుర్కుంటూ ఉన్నారు. ఒకవిధంగా కొన్ని కులాల వారితో మాట్లాడక పోవడమే మంచిదనిపించేలా ఉంది. atrocity కేసులు పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్ట్లు కూడా ఏర్పాటు కాబడ్డాయి అంటే.. ఎంతగా కులపరంగా అవమానం జరుగుతుందో కదా అననిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి ఆరోపణలతో నమోదు కాబడ్డ కేసులు అన్నీ నిజాలు కావన్నదానికి నిదర్శనంగా ..ఈ మధ్యనే .. అంటే ఓ..మూడు నెలల క్రితం జరిగిన యదార్ధ సంఘటన..ఒకటి.
విజయ్ అనే ఒక యువకుడు అగ్ర కులానికి చెందినవాడు. అతను వారి ఇంటికి సమీపంలో రోడ్డుపై నిలబడి ఉన్నాడు. అంతలో.. బుల్ హారన్ మ్రోగించుకుంటూ..ఓ..మోటార్ వెహికల్ పై (బుల్లెట్)ముగ్గురు కలసి వెళుతూ వారి ఇంటి సమీపంలోకి వెళ్ళినప్పుడు పదే పదే హారన్ మ్రోగిస్తూ మితిమీరిన వేగంతో వెళ్ళారు. విజయ్ కి ఆ ముగ్గురు పరిచయమే!వారు ఓ..వాడకి చెందిన పిల్లలు.(తప్పని సరి అయి ఉదహరించాల్సి వస్తుంది) వారు పని గట్టుకుని చేసే విపరీతమైన శబ్దం వల్ల..ఇంట్లో అనారోగ్యం గా ఉండి పడుకున్న విజయ్ తాత గారికి చాలా విసుగు కల్గుతుంది అనే ఉద్దేశ్యం తో.. "మీరు ఇటువైపు రాకండి. ఏమిటి ఆ మోత? అని కోపంగా అన్నాడు.
వెంటనే.. ఆ ముగ్గురు ..వారు వెళుతున్న బైక్ ని సడన్గా ఆపి వెనక్కి తిరిగి వచ్చి విజయ్ తో వాదనకి దిగారు. ఏం..రోడ్డు ఏమన్నా మీ బాబుదా!? నీకేనా బుల్లెట్ లు ఉండేది.మా దగ్గర డబ్బుంది.మేము కొనుక్కుని తిరుగుతాము. ఇక్కడ తిరగవద్దని చెప్పడానికి నీకేమైనా అధికారం ఉందా అని .. అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే.. దానికి వాదనగా అన్నట్టు ఇతను మీరసలు ఈ ఊర్లోకి రావద్దు. మీ హరిజనవాడకి వేరే దారి ఉంది..అటువైపు వెళ్ళండి ..అని అన్నాడు విజయ్. ఇక అక్కడ మాట మాట పెరిగి..అమ్మలు,అక్కలని, ఆలిని ఇష్టం వచ్చినంతసేపు ఆరేసి..ఇరువైపులవారు కొట్టుకునే అంత స్థాయికి వెళ్ళిందీ విషయం.
నలుగురొవచ్చి విడదీసాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
బైక్ పై తిరిగిన ముగ్గురు వ్యక్తులు అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. "విజయ్ అనే వ్యక్తి..మమ్మల్ని కులం పేరున దూషించాడు.ఆ రోడ్డు పైన సంచరించ వద్దని ఆర్డర్ లు వేసాడు. వాళ్ళ కులం వారి సపోర్ట్ తో మమ్మల్ని అవమానించి మా ఇంటివాళ్ళని కూడా అవమానంగా మాట్లాడారు" అని రిపోర్ట్ ఇచ్చారు.
అంతే.. అర్ధరాత్రి సమయంలో.. నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ తో పోలీసులు విజయ్ ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అది గమనించినతను..వేరే దారిన బయటపడి..తప్పించుకున్నాడు. అతనెళ్ళి ..మూడు రోజులు ఎక్కడో రహస్యంగా దాక్కుని ఉంటే..కేస్ లేకుండా చేయడానికి ..రాజీ మార్గాలు మొదలై.. కేస్ విత్ డ్రా..చేసుకోవడానికి దాదాపు మూడు లక్షలు రూపాయలు డిమాండ్ చేసారని ..తెలిసిన వారి ద్వారా బోగట్టా. ఆ రాజీ ప్రక్రియలు జరిగింది..సాక్షాత్ ఊరి మాజీ ప్రెసిడెంట్ సమక్షంలో .
బేరసారాలు కుదరక ..విజయ్ రహస్యంగా వెళ్లి పోలీసు స్టేషన్లో కాకుండా కోర్టులో లొంగిపోయాడు.
ఇక్కడ జరిగినదానికి చట్టం తన పని తానూ చేయడానికి మధ్య ఆర్ధిక లావాదేవీలా అవసరం ఏం వచ్చింది? నిజంగా కుల దూషణ వల్ల అవమానం, మానసిక హింస అనుభవిస్తే.. వారు శిక్ష పడాలని కోరుకోవాలి. అలా కాకుండా డబ్బు డిమాండ్ చేసి అడిగినంత ఇవ్వనందువల్ల కేస్ నడచి తమని తిట్టిన వ్యక్తికి శిక్ష పడాలనుకోవడంలో ఏ మాత్రమైనా పారదర్శకత కనబడుతుందా!?
యెంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి ..ఇష్టం వచ్చినట్లు తిట్టవచ్చా? అప్పుడు అవమానం అనిపించదా!?
అసలు కులం పేర తిట్టారో లేదో.. అన్న నిరూపణ కూడా లేకుండా ఒక కంప్లైంట్ ఆధారంగా.. వ్యక్తులని శిక్షించాలని అనుకోవడం కూడా సబబేనా!?
ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని అగ్ర కులస్తులని పని గట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఉన్నట్లు తోస్తుంది.
అగ్ర కులాల వారు అహంకారంగా ప్రవర్తిస్తూ , తిడుతూ వివక్ష చూపించే కాలం మారింది. ఇప్పుడు అందరూ సమానంగానే ఉంటున్నారు. ఉండాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల కొంత వివక్ష ఉండవచ్చు కూడా ! కాదనడం లేదు
కానీ చట్టం అండ ఉంది కదా ... అని అన్యాయంగా కేసులని మోపి.. వేధించడం కూడా బాధాకరమే కదా!
వ్యక్తిగతముగా కోప,ద్వేషాలు ఉంటే.. ఆ వ్యక్తి వరకే పరిమితం చేసుకుని ప్రదర్శించుకోవాలి. వారి వారి అభిప్రాయాలకి పరిమితం చేసుకోవాలి. కుటుంబంలోని స్త్రీలనందరిని తిట్టే సంస్కారం,కులం పేర తిట్టే సంస్కారం ..మరి వారికి ఉండవచ్చా!?
అవమానం అన్నాక, హింస అన్నాక అందరికి ఉంటుంది కదా! కులం పేరు ఎత్తకుండా.. అభిప్రాయ బేధాలు వస్తే..వివరణతో చర్చించుకోవడం జరగాలి కాని..కులం పేరు ఎందుకు ? అన్యాయంగా కేసులు పెట్టుకోవడం ఎందుకు ..అనిపించింది నాకు.
విజయ్ .. పదిహేను రోజులు రిమాండ్ ఖైదీగా ఉండి వచ్చి విచారణ కోసం ఎన్నోసార్లు కోర్ట్లు చుట్టూ తిరుగుతూ ఉంటే.. అగ్రకులలవారికి భయం పట్టుకుంది.
కొంత మందిని చూస్తే..గాలి సోక నంత దూరంగా మెలగాలిసి వస్తుందేమో! అంటున్నారు కూడా!
ఇది ఒక అంటరానితనమే కదా! కాకపొతే.. ఇక్కడ ఇప్పుడు అగ్రవర్ణ వాడలకి..అనాలేమో!
(కుల వివక్ష,మత వివక్ష ,లింగ వివక్ష లేని సమసమాజం అన్నది సుదూర తీరం గానే తోస్తుంది.. అంటరానితనం - ఒంటరితనం అనాదిగా ఈ జాతికి అదే మూలధనం ..!? అన్న బాధతో..ఈ పోస్ట్.)