ఒక పాటలో ఎన్నో.. స్పూర్తికర అంశాలు.. ఉంటే ఆ పాట చూసిన ప్రేక్షకుడికి.. గుండెల్లో వేయి ఆలోచనా శతఘ్నులు బ్రద్దలైతే.. ఆ..పాట విన్నప్పుడు.. కొన్ని రోజుల వరకు.. ఆవేదన ఆక్రోశం నిండిన ఆ గళం.. వెంటాడి..మనని..వేదనలో.ముంచేస్తే .. అవమానిన్పబడిన స్త్రీ మూర్తి..ఆక్రోశం ప్రశ్నగా ఉత్పన్నమై సమాధానం చెప్పలేని..మానవజాతి..కి తప్పు దిద్దుకోలేని సిగ్గు లేని చర్యగా అనిపిస్తే.. ఈ సమాజంలో.. ఈ నాడు మహిళలపై ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటాయా?
విన్నప్పుడు మాత్రమె.. నిజం అని అనుకుంటూనే..మార్పురాని ఈ పురుషజాతి ఆగడాలకి.. భాదపడుతూ.. ఈ..పాటని గుర్తు చేసుకుంటూ.... ఇకనైనా మారి స్త్రీ జాతిని అవమానించ కుండా ఉండాలని కోరుకుంటూ... ఈ పాట.
1986 వ సంవత్సరం గాయని ఎస్.జానకి నంది అవార్డ్ ని అందించిన పాట... ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.. పాట. "ప్రతిఘటన"చిత్రం తలుచుకోగానే..విజయశాంతి ని చూడగానే అందరికి.. గుర్తుకు వచ్చే పాట. ఈ..చిత్రంలో.. ముందుగా అనుకోని పాట. ఆ చిత్రం నిర్మించేటప్పుడు..కళాశాల తరగతి గదిలో..ఆ లెక్చరర్ నగ్న చిత్రం గీసి..అంగాంగ కొలతతో... వర్ణించి అవమానిస్తే..ఆ సన్నివేశంలో.. అప్పటికప్పుడు.. ఒక పాట రూపంలో..ఆ స్త్రీ హృదయం ఆక్రోశం, ఆవేదన.. తో.. ఆ విద్యార్ధుల్ని ప్రశ్నించడమే కాదు..అడుగడుగునా అవమానిన్చబడే..స్త్రీ ఆక్రోశం ప్రతిబింబించే విధంగా.. ఉండాలని దర్శకుడు టి .కృష్ణ గారు అడగగానే ఈ పాట అప్పటికప్పుడు అనుకుని కేవలం ఐదే ఐదు నిమిషములలో.. ఒక చెట్టు క్రింద కూర్చుని "వేటూరి"గారు..వ్రాసారంటే..ఆయన.. పాదాలకి.. మ్రొక్కి తీరవలసిందే!!!
ఈ దుర్యోధన దుశ్వాసన దుర్వినీత లోకంలో
రక్తాశ్రులు చిన్దిస్తూ రాస్తున్నా శోకంతో...
మరో మహా భారతం ఆరవ వేదం ...
మానభంగపర్వంలో .....మాతృ హృదయ నిర్వేదం నిర్వేదం
మాతృహృదయ నిర్వేదం నిర్వేదం.
మనకి వేదాలు నాలుగు.. అవి కాకుండా పంచమ వేదంగా.. భావింపబడే.. మహా భారతం లో.. సభాపర్వంలో.. దుర్యోధనుడు.. దుశ్శాసనుడు..శ్హకుని,కర్ణ మొదలగు వారు కురువంశ మహామహుల సమక్షంలో..ద్రౌపదిని అవమానించిన..సందర్భంతో.. పోల్చి.. మరో మహాభారతం ని.. రక్తాశ్రువులు చిందిస్తూ.. వ్రాసిన ఆరవ వేదం గా వర్ణిస్తూ .. వ్రాసిన శైలి..వేటూరికి.. కావ్య రచనల పై ఉన్నఆసక్తి..ని.. సాహిత్యపు లోతుల్ని చవిచూసిన అనుభవాన్ని చెప్పకనే చెపుతాయి.మాన భంగపర్వంలో..మాతృ హృదయ నిర్వేదం..అని ఎందుకు అన్నారంటే.. అక్కడ ఆమె స్థానం గురుతుల్యం. గురువు మాతృమూర్తితో..సమానం. అయినా.. ఆ.. విద్యార్ధులు..ఆమెని అలా అవమానిస్తే.. ఆ మాతృ హృదయం నిర్వేదంగా మారడంలో..ఆశ్చర్యం ఏముంది...!?
పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాల కేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిల కామ నీచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే..
పుట్టి పుట్టగానే పాల కోసం ఎడ్వగానే.. ఆ తల్లి స్తన్యం అందించి..ఆ బిడ్డ ఆకలి తీరుస్తుంది..తర్వాత ఆ గుండెలపై..ఆడుకుంటారు..పెరిగి పెద్దకాగానే..ముద్దు మురిపాలు..కి..ఏడ్చి..తనువంతా.. దోచుకున్న తనయులు.. మగ సిరితో..బ్రతకలేక (ఇక్కడ మగ సిరి అంటే.. సంస్కారంతో..మంచి నడవడిక అనేదే..అసలైన మగ సిరి) కీచకుడిలా మరి.. కుటిలనీతితో.. కామ నీచకులై స్త్రీ జాతి ని అవమానిస్తుంటే..
మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం
మరో మహా భారతం ఆరవ వేదం
మానభంగ పర్వంలో ....
మాతృ హృదయ నిర్వేదం నిర్వేదం..
మీ అమ్మల స్తన్యంతో ..మీ అక్కల రక్తంతో..అమ్మ చనుబాలని..అక్కల రక్తాన్ని రంగరించి.. ఈనాడు వ్రాస్తున్న మరో..మహాభారతం.. అని..ఎంత వేదన.. అ.. వేదన వర్ణించ లేక.. అది పదునెనిమిది..పర్వాలు కల మరో.. మహాభారతం..గా వర్ణించి అందులో.. మానభంగ పర్వంలో.. ఒక మాతృ హృదయ నిర్వేదం...కి..అక్షర రూపం ఇచ్చి.. భావశక్తికి..ప్రాణం పోశారు వేటూరి.
కన్న మహా పాపానికి ఆడది తల్లిగా మరి
నీ కండలు పెంచినది గుండెలతో కాదా?
యెర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి
పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా?
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర..
నవమాసాలు మోసి..తన రక్తం తోనే ఊపిరి పోసి తన రక్తాన్నే.. పాలగా మార్చి..బిడ్డని పెంచినది.. ఈ..గుండెలు కాదా? బిడ్డలకి..పాలు ఇచ్చే రెండు అమృత భాండాగారాలు..స్తన్యాలు..అని సమస్త మానవాళికి పాపలుగా ఉన్నప్పుడు .. లభించిన ఆహార సంపద...అలాటి ఆ గుండెల్ని.. కాముక ప్రవృత్తితో.. చూసే..ఈ..నీచ సంస్కృతిలో..కనబడలేదా?అక్కడ పాపలుగా..మీ చరిత్ర... అప్పుడెప్పుడో.. మీరు ఉంచిన లేత పెదవి ముద్ర..అని..అడుగుతూ.. ప్రతి స్త్రీ మూర్తిలోను.. మీ తల్లి ని..చూడమని.. ఎలుగెత్తి అడిగిన స్త్రీ అంతరంగ వేదన ..ఇది..
ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగల్యం
మర్మస్థానం కాదది నీ జన్మ స్థానం
మానవతకి మోక్షమిచు పుణ్యక్షేత్రం...
ప్రతి భారతీయ సతి మానం ఇక్కడ మానం అంటే..అభిమానం,గౌరవం (సతి అంటే..కేవలం స్త్రీ కాదు..ఆది శక్తి కూడా ) చంద్రమతి మాంగల్యం...సత్య హరిచంద్రుని భార్య చంద్రమతి.. ఆమె మాంగల్యం ఒక్క హరిచంద్రునికి తప్ప మరెవరికి.. కనిపించేది కాదట..అలా టి.. మానం.. కేవలం మర్మస్థానం మాత్రమె కాదు.. నీ జన్మ స్థానం కూడా.. అని చెప్పడం.. ఎంతటి బలవత్తర భావం. మానవజాతి మొత్తంకి.. ఈ..ప్రపంచమని..చూపించేందుకు..తెరువబడిన,మోక్షం చూపించబడే.. పుణ్య క్షేత్రం ..గా కీర్తించిన వేటూరి.. మహనీయునికి.. శతకోటి వందనాలు ..నిత్యం.. సమర్పించ వలసిందే !!
మానవ రూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే..
శిశువులుగా..మీరు పుట్టి పశువులుగా మారి..మానవ రూపంలో.. రాక్షసులుగా పెరిగి..సభ్యతకి ..సంస్కృతికి..సమాధి కట్టేసి ..
కన్నులుండి చూడలేని దృతరాస్త్రుల పాలనలో
భర్త లుండి విధవ ఐన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువ శక్తులు నిర్వీర్యం అవుతుంటే
ఏమైపోతుంది సభ్యసమాజం ఏమైపోతుంది సభ్యసమాజం
ఏమైపోతుంది మానవ ధర్మం
ఏమైపోతుంది ఈ భారత దేశం
మన భారతదేశం మన భారత దేశం..
భర్త లుండి విధవ ఐన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువ శక్తులు నిర్వీర్యం అవుతుంటే
ఏమైపోతుంది సభ్యసమాజం ఏమైపోతుంది సభ్యసమాజం
ఏమైపోతుంది మానవ ధర్మం
ఏమైపోతుంది ఈ భారత దేశం
మన భారతదేశం మన భారత దేశం..
కన్నులుండి చూడలేని ఏమి పట్టించుకోని ఈ.. సమాజంలో..
![]() |
ఉత్కృష్ట నటనకి పరాకాష్ట |
ఈ..పాటకి.. నంది అవార్డ్ ని అందుకున్నారు.. వేటూరి..ఆ పాట సాహిత్యమే... తెలుగు చిత్ర గీతాలలో..కలికితురాయి. ఇక జానకమ్మ గళంలో.. ఒలికిన భావాలు.. విజయశాంతి..నటన కి పరాకాష్ట.. టి.కృష్ణ గారి కధ, దర్శకత్వ ప్రతిభ.. ఇన్ని మేళవింపులు కల ఈ పాట.. మరపురాని..స్ఫూర్తి గీతం. కొంత మంది ఆలోచనా విధానంలో.. అయినా మార్పు తీసుకురావడానికి..
ఈ.. పాటని.. పదే పదే..ప్లే చేయడం ..ఈ కాలానికి..అవసరం కూడా..!!!