29, మే 2011, ఆదివారం

ఐ యాం ఎ కామన్ వుమెన్


ఇదిగో... పొద్దు ప్రొద్దునే కొంచెం బద్ధకం వదిలించుకుని ఇలా ఈ  ప్రపంచం యెలా వుందో  చూద్దామని అంతర్జాలం లోకి తొంగి చూసాను.

చాలా రోజులయింది. కొంచెం విభిన్నంగా ఆలోచించి  మనసులో విషయం వ్రాసి కూడా ! అయినా నేనమంత గొప్పదాన్ని!? అని.

విభిన్నంగా ఆలోచించడానికి వ్రాయడానికి ఒకరికి చెప్పడానికి !?

 "ఐ యాం ఎ కామన్  వుమెన్"

 ఏదో చేద్దామని మొదలెట్టినా ఆరంభ శూరత్వంగా మిగిలిపోతుందేమోనని అంతర్లీనంగా  భయం కూడా. పట్టుకుంటుంది. ఎవరిని నమ్మే  వీలు లేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాం. ఛీ! వెధవ జీవితం అనుకున్నది. చేయగలగడం కుదిరి  చావడం లేదు పైగా అడగక పోయినా  జాగ్రత్తలు చెప్పేవాళ్ళు తయారుగానే ఉంటారు. విన్నట్లు నటించాలి తప్పదు.లేకపోతే పొగరు, అహంకారం ఇలాటి ముద్రలు వేసి ఒంటరి లని చేసేస్తారు అయినా ఒంటరి ప్రపంచంలో  ఎంతో  ఆనందం అనుకుంటూ.. "ఒంటరి" లం అయిపోయి  మనం  ఇలా బ్రతికేస్తున్నాం.

 మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న వాటిల్లో  కొన్నింటిని  కూడా మనం మార్చలేం.


 అవి ఏమిటో మీరే చూడండి.

అంధ విశ్వాసాలకు అడ్డుకట్ట వేయలేం.
అజ్ఞాన  తిమిరాన్ని పారద్రోలలేం
అవకాశ వాద  ఉద్యమాలకి చేయూత ఇవ్వలేం.     
పదవీ దాహ దావానలం ని చల్లార్చలేం.   
అపరిపక్వత ఆలోచనలకి బలం చేకూర్చలేం.
అవినీతి చక్రాలకి ఇరుసు కాలేం.  

కానీ.. వీటన్నిటి  ప్రక్కన మనం బ్రతికేస్తున్నాం.   మనలో కూడా అవి ఉండవచ్చొమో కూడా. 

ఏదేదో.. చేద్దామనుకుని ఏమి చేయలేక దుఃఖం కల్గుతుంది.  ఆశనిహతి వల్ల దుఃఖం కల్గుతుంది అంట.

కొన్ని చేయటానికి మనస్కరించక,  కొన్ని చేయటానికి  దైర్యం చేయలేక  ఇదిగో ఇలా బ్రతికేస్తున్నాను. 

 "ఎస్"

 ఐ యాం ఎ కామన్ వుమెన్.

 ఇప్పుడే పోన్ చేసి మా చెల్లి అక్కా ! లంచ్ మీ ఇంట్లోనే అంది. "వంట" వెంటబడి  రుచికరం ని సాధించాలి.
మా అన్నయ్య నాగాలాండ్ కి ప్రయాణం కొంచెం  కాదు బాగానే దిగులు రైల్వే స్టేషన్ కి వెళ్లి అన్నయ్యకి మమకారంతో జాగ్రత్తలు చెప్పి రావాలి.  మా అబ్బాయి వీడియో కాల్ చేస్తే ఎలాగబ్బా! రిసీవ్ చేసుకోలేనే!?  దిగులుగా అనుకుంటూ  ఇదిగో ఇలా మాత్రం బ్రతికేస్తాను.

   

22, మే 2011, ఆదివారం

నీరాజనం

శివుని శిరస్సున ఉంది గంగ
విష్ణువు పాదమున ఉన్నదీ గంగ
బ్రహ్మ గారి ఉదక మండలమున ఉన్నదీ గంగ
నీ కంటిలో భాష్ప గంగ
నా కలమున కావ్య గంగ
హలం పట్టుకున్న రైతన్న పొలాన పొంగాలి గంగ
వారి కస్టాలు కడ గంగ ....
అంటూ.. హృదయంతో.. భాష్పించి.. వ్రాసిన గీత మిది.
కావ్య గంగని తన భావ జుటలో.. ధరించిన హరుడాయన. .
పాటల తోటమాలి "వేటూరి" కావ్య గంగ ని .. జాతికి అందించి..
తన భావ సంపదను గంగా ప్రవాహంలో.. పరవళ్ళు త్రోక్కిస్తూ..
పాటల ప్రవాహంలో..పరమ పవిత్ర గంగమ్మ లా.. భాసిస్తూ.. తెలుగు తల్లి ముద్దు బిడ్డడు..
కావ్య సంద్రంలో.. తనొక పాయ అయి
మనలని నిత్యం ఆయన పాటలో.. స్నానించమని
తను మాత్రం.. హరిహరదులని.. కీర్తిస్తూ.. కావ్య రచనలు.. చేయడానికి..
కావ్య బ్రహ్మ గా.. సత్య లోకం వెళ్లి..
మనలని అనంత దుఃఖంలో ముంచి వెళ్ళిన పాటల తోట మాలి..
నీ పాట పువ్వు పరిమళించని నేల మౌనంగా .. భాస్పాంజలి ఘటిస్తుంది.
మిమ్ము.. స్మరణం చేసుకుంటూ.. మీ పాటని మనం చేసుకుంటూ..
మీ.. ఈ గీతం. గంగమ్మ లా మా కనులు ప్రవహింతలతో..
ఓం ఓం
జీవన వాహిని ... పావని
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయము తీర్చి శుభము కోర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి
గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి
మంచు కొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసను అలకనందమై
సగర కులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి
గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి
జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లుపూలుపసుపుల పారాణి రాణిగా
శివుని జటలనే తన నాట్యజతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రి
గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

20, మే 2011, శుక్రవారం

తుమ్మెద ఝుంకార శబ్దం

జ్ఞాన దాన మొనర్చి ,యజ్ఞాన మెపుడున్
బాపి ,ముక్తి పదమ్మును జూపి ,మేలు
కలుగజేయు సద్గుండు డొకండె  భువిని
అతని మనసారా ద్యానింతు నవవరతము ... 

ఇది మా అమ్మ నేర్పిన  తేటగీతి పద్యం.. 

శ్రీశైల శృంగే విభుదాతిసంగే 
తులాద్రితుంగే..పి ముదావసంతం
తమర్జునం మల్లికపూర్వమేకం 
నమామి సంసారసముద్రసేతుం ... 

ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో  .. శ్రీశైల క్షేత్రంలో.. మల్లికార్జుని  దర్శనం..  యొక్క ప్రాశ్తస్యం చెపుతుంది. 
మా ఇంటిల్లపాదికి ఇష్టదైవం.. "మల్లికార్జున స్వామి "  ఆయన ని దర్శించుకోవడం.స్మరించుకోవడం .. మాకు..చాలా..చాలా  ఇష్టం.

  మా ఇంటిల్లపాదికి చాలా ముఖ్యమైన ఘట్టాలలో.. స్వామి ఆశీస్సులు   మాకు లభించాలని మేము  తరచు శ్రీశైలం స్వామి దర్శనం కొరకు వెళుతూ ఉంటాము.  అలా వెళ్ళినప్పుడల్లా.. స్వామికి ప్రాతః కాలంలో   అభిషేకం చేయించుకోవడం   చాలా ఇష్టం కూడా..  ఈ రోజు న  ప్రాతః కాలమున అభిషేకం చేయించుకోవాలంటే.. ముందుగా.. ఆర్జిత సేవల టికెట్  ముందు రోజున తీసుకోవాలి.  'గంగా సదన్ " లో.. మల్లికార్జున స్వామి  దేవస్థానం వారి కౌంటర్ రాత్రి ఏడు గంటలకి తెరువబడుతుంది. అక్కడ స్వామి వారి అభిషేకం టికెట్ వెల 1000 రూపాయలు.. భ్రమరాంబిక అమ్మవారి కుంకుమ పూజ టికెట్ వెల 350 .. రూపాయలు. పూజా సామాగ్రి టికెట్ తో పాటు దేవస్థానం  వారే ఇస్తారు.మనకు లభించిన టికెట్ల వరుస క్రమం ప్రకారం మనకి స్వామి సన్నిధికి స్వయంగా అభిషేకం చేయటానికి.. ప్రవేశం కల్పిస్తారు. దంపతులకి..మాత్రమే ప్రవేశం లేదా  సింగిల్  కి..ప్రవేశం ..ఉంటుంది.పురుషులు  పంచె  లేదా ఫేంట్  ధరించవచ్చు పైన మాత్రం  కండువా మాత్రమే కప్పుకోవాలి..అది నియమం. స్వామి ఆలయానికి  దగ్గరలో.. సాధారణ కౌంటర్ లో.. అభిషేకానికి.. టిక్కెట్లు సమయం ప్రకారం లభిస్తాయి కాని.. 600 వెల కల ఆ ఆర్జిత సేవలు..ఉద్యయం 08.30 తర్వాత జరుగుతాయి.. అప్పుడు సాధారణ భక్తులు దర్శనం కొరకు రావడంతో  చాలా వత్తిడి ఉంటుంది.. స్వామి దర్శనానికి .. వచ్చేవారి మద్య అభిషేకాలు ..అంత బాగా జరగవు.. అనే కంటే..మనకి..అసంతృప్తి ఉంటుంది. అంత దూరం వెళ్ళేది స్వామికి అభిషేకం  చేయించుకోవడానికే కదా! 

   ఇక పోతే.. మనం అభిషేకానికి..పన్నీరు, తేనె,గంధం,త్రయంబకం,జలం..వగైరా  తీసుకు వెళ్ళవచ్చు.. కానీ మనకి.. అవి స్వామివారికి సమర్పించే సమయం లభించదు. ఒక్కొక్క సారికి నాలుగైదు జంటలని లోపలకి..పంపుతారు. అక్కడ బలవంతులదే..ఒడుపుగా ఉన్నవారిదే పై చేయి. స్వామిని స్పర్శ  దర్శనం  చేసుకోనిస్తారు. .. "శివ శివేతి శివేతి  శివేతివా .. భవ భవేతి భవేతి వా.. హర హరేతి హరేతి హరేతి వా .".అంటూ.. మల్లన్న స్పర్శ దర్శనం తర్వాత అభిషేక జలాన్ని .. శిరస్సున  జల్లుకుని.. అమ్మ దర్శనానికి.. వెళతాము.అక్కడ అమ్మకి.. కుంకుమార్చన చేయించుకుని.. అమ్మ కరుణాశీస్సులు  అందుకుని .. భ్రమరాంబిక   ఆలయం  వెనుకకి వెళ్లి.. అమ్మ వెనుక దేవాలయ గోడకి..ఖచ్చితంగా .. అమ్మవారి విగ్రహం తిన్నగా చెవి ఆనించి  వినండి.. తుమ్మెద  ఝుంకార శబ్దం వినవస్తుంది.

 మా చిన్నప్పుడు..విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆ ఝుంకార  శబ్దాన్ని రికార్డ్  చేయించుకుని వచ్చి  భక్తిరంజనిలో వినిపించేవారట,. నేను..ఆ విషయాన్ని.. మా అబ్బాయికి చెపితే.." ఊరుకోమ్మా! నాకు చెపితే చెప్పావు..ఇంకెవరికి చెప్పకు.. భక్తి ముదిరి.. ..ఇంకా ఏదో అంటారు" అన్నాడు. కానీ నాకు.. ఒక నమ్మకం.   చాలా..నిశ్శబ్దంలో.. వింటే.. తప్పక  ఆ ఝుంకారం వినబడుతుంది... కానీ అక్కడ నిశ్శబ్దమే ఉండదు. అమ్మవారి గుడిలో..సేవలు జరిపే భూసురులు మాత్రం నిజమే తల్లి.. ఝుంకార ధ్వనం వినిపిస్తుంది. "యద్భావం తద్భవతి" అని చెప్పారు.


    అన్నట్టు అమ్మ వారికి కుడిప్రక్కన దేవగన్నేరు చెట్టు ఉంది.. ఎన్ని శతాబ్దాల నాటిదోనట. దేవ గన్నేరు పుష్పాల  సౌరభం మరపురాని..ఆఘ్రాణం. నేను అలాటి సౌరభం ఎక్కడా ఆస్వాదించలేదు. కానీ..అక్కడ అమ్మకి..స్వామి సేవకే పూచిన పూలు అవి. ప్రసాదంగా లభిస్తే భక్తి తో..కళ్ళకద్దుకుని  వాసన   చూడండి..మీకే తెలుస్తుంది.  వృద్ద మల్లికార్జున స్వామి ఆలయం, నాలుగు వందల ఏళ్ళనాటి..జువ్వి,అశ్వద్ధ ,వేప వృక్షం  ప్రసిద్ధి. అక్కడ ప్రదక్షణలు చేయడం ..చాలా మంచిది.    

శ్రీశైలం దర్శనం రెండు విధాల మేలు. ఒకటి భక్తి.. రెండోది.. ఆహ్లాదకరం. నాకు..చాల ఇష్టమైన ప్రదేశం ఇది.. ఎప్పుడైనా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను. "మల్లన్న" దర్శనం నాకు కొండంత బలం ఉత్సాహం .. మానసికంగా అలసి పోయినపుడు నన్ను నేను రీచార్జి  చేసుకోవడానికి  శ్రీశైలం వెళ్ళిపోతాను. సాక్షి గణపతి ,పాలధార,పంచదార.శిఖరధర్శనం ,ఘటకేశ్వర స్వామి ఆలయం.పాతాళ గంగ స్నానం.. అన్ని మామూలే! కానీ.. అక్క మహాదేవి తపస్సు  చేసిన స్థలం,ఇష్ట కామేశ్వరి టెంపుల్.. చాలా కష్ట  తరం. ఈ రెండింటి గురించి    .. మరొకసారి చెపుతాను..  ఇప్పుడు.. ఈ దృశ్యాలు చూడండి.        
.   
వెనుకనుండి.. మల్లన్న ఆలయ  శిఖరం  

కృష్ణమ్మ పరవళ్ళకి ఆన కట్ట .. మన జల సంపద 

నదీ విహారానికి నౌకలు సిద్దం 
అంతా శివమయం.. పాతాళ గంగ కెళ్ళే దారిలో.. నా  కెమెరా  కళ్ళకి.. ఎంత అదృష్టం 
రోప్ వే .. ఎంత సుందర దృశ్యం   

ఆలయ ముఖ ద్వారం.. ఇలా నాలుగు ప్రక్కల గోపురాలు 

శిఖర దర్శనం ఇక్కడినుండే.. 


జలవిహారానికి వెళుతూ...


.
అమ్మ సన్నిధికి .. ముఖ మండపం.. ఆలయ గోపురం   

స్వామి ఆలయ దర్శనమే.. ప్రశాంత..తీరం   మబ్బులు ఆడుకుంటున్నాయి  స్వామి సన్నిధి చెంత      

చత్రపతికి.. అమ్మ బహుకరణ ..

శ్రీశైలం  డాం వ్యూ ..   ..
స్వామి ..ని దర్శించి .. ఆహ్లాద కర దృశ్యాలు చూసారు  కదా!! .. శివ నామాని.. యః  పటేన్నియతః సకృత్  నాస్తి మృత్యు భయం తస్య పాప రోగాది  కించన..."ఓం నమః శివాయ "  తప్పకుండా "శ్రీశైల క్షేత్రం " దర్శించండి.. స్వామి ఆశీస్సులు..మీకు లభించాలని కోరుకుంటూ..  అక్షర దోషాలు ఉంటే మన్నించండి.

19, మే 2011, గురువారం

ధూమపానం సరే మద్యపానం

నేను నిన్న రాత్రి పదకొండు గంటల సమయం అవుతుండగా ..సరాగమాల ..తో.. రేడియోకి..గుడ్ నైట్ చెప్పేసి బయట గేటు కి.. తాళం పెట్టేసి రోడ్డువైపు యధాలాపంగా చూసాను.. ఒక మందు బాబు.. మాకు రెండిళ్ళ అవతల ఉంటారు. తూలుతూ..పడుతూ..లేస్తూ.. నడుస్తూ.. తిట్టుకుంటూ..వస్తున్నాడు..నేను టక్కున లోపలి వచ్చేసి ..తలుపు వేసుకున్నాను. నాకు..అసలు.. ఆ మందు   బాబులని చూస్తేనే భయం. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ .. తిట్టు కుంటూనో,తిడుతూనో....ఆడజన్మలు ..సిగ్గుతో..తలదించుకునేటట్లు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళని కన్నందుకు..అమ్మ ,కట్టుకున్నందుకు..భార్య ..అలాంటి తండ్రి ఉన్నందుకు పిల్లలు.. లోకం మొహం  చూడలేక తాము తప్పు చేసినట్లు తలదించుకు వెళతారు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళుతూ..ఉంటారా.. ఇరుగుపొరుగు ఊరుకోరు.. "ఏమిటి రాత్రి మళ్ళీ ..మీ ఇంట్లో.. వీరంగం మొదలయింది" అంటూ సానుభూతి వాక్యాలు కురిపిస్తూనే.. లోపల లోపల నవ్వుకుంటారు. అయినా ఆ నోటికి హద్దు -అదుపు లేదు.. ఇరుగు పొరుగు..వినలేక చస్తున్నాం..కాస్త ఒక గదిలో  పెట్టి తలుపులన్న వేయండి.అంటూ..ఉచిత సలహాలు ఇస్తారు. గదిలో..పెడితే ఉంటారా? సృహలో..లేనట్లు నటిస్తూనే .. నిజజీవనంలో.. మాట్లాడలేని మాటలన్నిటిని  గుర్తుపెట్టుకుని మరీ తిడుతూ..మాట్లాడతారు. 

అడ జన్మలకి..ఎంత కష్టమో..పాపం....  పూటుగా తాగి నోరు పట్టకుండా..కూస్తున్నా.. గుడ్ల నీరు కుక్కుకుని ..వాళ్ళకి.. తిండి తినిపించడానికి..తాపత్రయపడతారు.. నాశనం అవుతున్న వాళ్ళ ఆరోగ్యం పట్ల దిగులు పడతారు...ఎంత అవమానంగా మాట్లాడినా ..సహించి ..ఏదోలే తాగి మాట్లాడాడు.. అనుకుని సర్దుకుపోతారు.  అయితే.. మా ..పక్కింటి ఆవిడ అలాటి బాపతు కాదు..  భర్త తాగి వచ్చాడో.. పొరపాటున కూడా..తలుపు తీయదు.. పిల్లలిద్దరిని ఏ.సి గదిలో పెట్టి డోర్స్ క్లోజ్ చేసి.. బయట గదిలో..తను పడుకుని .. ప్రహరి గేటుకి మాత్రం తాళం వెయ్యకుండా వదిలేస్తుంది.  భర్త రోజు తాగి   రావడం మాములే!. వచ్చి నానా యాగి చేసి.. అర్ధరాత్రి ..అందరిని లేపి.. పంచాయితి పెట్టింప చూస్తాడు.. అలా నాలుగైదు సార్లు.. అతని భార్యని .. ఇరుగుపొరుగు... "నువ్వు చేస్తుంది.. తప్పమ్మా.." అని హిత బోధలు చేసి.. అతనికి..పరోక్షంగా సపోర్ట్ చేస్తారు. .  ఇవ్వన్నీ  చూసి ఒకింత కటినత్వం అలవర్చుకుని.. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా  పట్టించుకోకుండా  ఉంటుంది.. అలాగే  దోమలు  కుడుతూ..ఆకలికి  మాడి .... ఆరుబయట పడి .. పోర్లుతుంటే పాపం చూసే వాళ్ళకి..జాలి. కానీ..ఆ ఇల్లాలు .. ఇద్దరు బిడ్డలతో.. అతని  తెచ్చిచ్చే అరకొర జీతంతో....అతని.. వ్యసనాన్ని,నిర్లక్ష్యాన్ని,భాద్యతరహిత్యాన్ని భరిస్తూ..అతని అసభ్య పదజాలాని భరిస్తూ.. ఎన్నాళ్ళు  అలా ఉంటుంది.. చెప్పండి... అలా ఉండక తప్పదు..అప్పుడైనా బుద్ధి వస్తుందేమో.. అనుకుంటాను.
   
 ఒక పది సంవత్సరాల కాలంలో.. ఎక్కడ చూసినా.. మద్యం ఏరులై  పారుతుంది అంటారు.. నేను.. స్త్రీల  దుఖం .. సముద్రంలో.. ఇంకుతుంది అంటాను నేను.  చాలీ  చాలని బతుకుల్లో.. ఎక్కువ నష్టపోయేది.. కుటుంబమే..!   .. మనని పాలించే  వారికి..బంగారు..ఖనిలు.. ఈ..త్రాగుబోతులు..గత సంవత్సరం ..సంక్షేమ కార్యక్రమాలకి  ..ప్రభుత్వం కేటాయించినది  పన్నెండువందల కోట్లు అయితే ..మద్యం అమ్మకాల షాపుల వేలం ద్వారా.. కూడబెట్టుకుంది.. పదిహేను వందల కోట్లు... సిగ్గు లేదు..ఈ..ప్రభుత్వానికి.  

అడుగడుగునా..మద్యం షాప్ లే.. ఆడవాళ్ళు..పట్టపగలే  రోడ్డు ప్రక్కన నడవటానికి.. బయపడుతున్నారు.. అలాగే రాత్రి సమయాలలో.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల వాహనాలలో..కూడా.. త్రాగి.. ప్రయాణిస్తూ.. ఉండేవారు తక్కువేమీ కాదు.. వాళ్ళు వచ్చి ఆడవారి మద్య నిలబడతారు..వాసన భరించడమే కాకుండా.. వాడు ఎలా బిహేవ్  చేసిన భరించడం..ఆడవాళ్ళ వంతు అయింది...అదేం అంటే.. తాగి ఉన్నాడులే ! పోనీయండి అంటారు. అయినా  బహిరంగ ప్రదేశాల్లో.. ధూమపానం  చేయకూడదు అని..  హెచ్చరికలు వింటూ ఉంటాము. మద్యపానం చేసి.. బస్ లు ఎక్క  వచ్చా? కూడదని..రూల్ పెట్ట కూడదా ?..అన్నాను నేను.. నా వంక వింతగా చూసారు.. నిజమే లెండి...ఆర్ టి.సి. కి..ఆదాయం  తగ్గుతుందేమో..కదా.. !? టీ.వి సీరియల్స్  లో.. తప్ప మద్యపానం ,ధూమపానం తప్పని  ఎక్కడా అంతగా.. కనపడదు.. మా అబ్బాయి ..అ హెచ్చరికలు చూసి తెగ నవ్వేవాడు.. మిలీనియం  జోక్..అనేవాడు.

ఏమైనా.. మద్యపాన నిషేధం అవసరం ఎంతైనా  ఉంది. .యువతరం  కూడా.. మద్యం మత్తులో.. తూగుతుంది.  ప్రపంచ కప్..క్రికెట్ ..పోటీలలో.. సెమి ఫైనల్స్ ,పైనల్స్ జరిగినప్పుడు.. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినాయి.. అవి కొన్నది కూడా..యువతే ..అంటే  ..నమ్మి తీరాలి...మనం . ఎక్కడ చూసినా బెట్టింగులు.. మందు పార్టీలు.. తండ్రుల తరం కన్నా కూడా పిల్లలు ఇంకా.. ఎక్కువ మత్తులోకి జోగటానికి.. అలవాటు పడుతున్నారు...  మా ప్రక్కింటి ఆవిడ  లాటి కోడలు..కావాలనుకుంటారో.. లేదా..  మాయదారి మద్యం బారిన  పడకుండా.. పిల్లలని ..కాపాడుకుంటారో!?తల్లిదండ్రుల విచక్షణకి  కి..పెద్ద పరీక్ష. 

అలాగే.. స్త్రీలందరు  కలసి.. దూబగుంట ఉద్యమాలకి..తెర తీయాలి... కదా!..అయినా.. ఊరు కి ఊరు మారిపోవడానికి ..ఇదేమన్నా.. " బాలచందర్".. సామాజికసృహాతో..తీసిన .రుద్రవీణ  సినిమా..నా? ఉద్యమాలని పట్టించుకునే.. మహానుభావులు ఎవరు?   పట్టించుకుంటే.. దానికి.. హంగులు,  రంగులు పులిమి సినిమాలు తీయడానికి.. మన టాలీవుడ్  లో..నిర్మాతలకి,దర్శకులకి..కొదవ ఏంలేదు కదా!ఒక ఉద్యమం వంద ఉద్యమాలై .. చైతన్య పరుస్తుంది..  అనుకుంటూ  .. నిద్రపోయానండీ.. కలలో..అంతా.. మద్యపానం నిషేధం జరిగినట్లు.. అందరు.. సంతోషం గా  ఉన్నట్లు.... కలలు.  ఆ కలలు  నెమరవేసుకుంటూ.. వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతున్నాను.. మా ఇంటి ఎదురుగా గ్రూప్ హవుస్  కట్టారు కొత్తగా .. అందులో.. రెండు కార్లు ఉన్న ఒకరు అద్దెకి..దిగారు.. అ కారాయనేమో.. తూలుతూ.. పడుతూ.. కారు దిగి లోపలి వెళ్ళారు.. అలా.. వెళ్ళారో..లేదో..  కింగ్ ఫిషర్ ..లేబిల్  బాక్స్ ..డోర్ డెలివరీ కి.. వచ్చి డెలివరీ బాయ్  నన్ను అడ్రస్  అడిగాడు.. నేను చెపుతున్నాను.. వాళ్ళ అబ్బాయి వచ్చి.. సంతకం చేసి బాక్స్ లోపలికి   పట్టుకుని  వెళ్ళాడు.  హతవిధీ!!  నా  కలలు  కల్ల్లలేనా?..    

ఈ పోస్ట్  కనుక  వాళ్ళలో..ఎవరైనా  చూసారా..! ఉంది..నా పని..!!!అని భయపడుతూ... భాధ పడుతూ.. "సురాపానం సదా జగతి."

15, మే 2011, ఆదివారం

అసలే వేణువు

కొన్నిపాటలు వినడానికి బాగుంటాయి .. కొన్ని పాటలు చూడటానికి బాగుంటాయి.. వినడానికి చూడటానికి కూడా.. బాగుండే పాట "రావోయి చందమామ " చిత్రంలో.."స్వప్న వేణువేదోసంగీత మాలపించే"..పాట. నాకు చాలా ఇష్టమైన పాట..నా కాలర్ ట్యూన్ గా ఊరేగిన పాట.. పాటల పల్లకిలో.. ఊరేగిన పాట. అందరికి సర్వసాధారణంగా నచ్చడానికి..కావాల్సిన అర్హతులున్న పాట. .

ఈ పాటకి..గీత రచన వేటూరి. ఆ పాట సాహిత్యం .. చాలా బాగుంటుంది. విని విని.. పాట మొత్తం.. కలలో కూడా మర్చిపోను..అంత గాడంగా నాటుకుని పోయింది..పాట సాహిత్యం పై మమకారం అది. అందులో.. ఈ చిత్రం ..నా అభిమాన చిత్రం కూడా....ఈ పాట వింటుంటే.. మదిలో..యేవో..భావాలు.. మేల్కొలేపే.. నాలో...

స్వప్న వేణువేదో .. సంగీతమాలపించే
సుప్రభాత వేళ ... శుభమస్తు గాలివీచే..
జోడైనా రెండుగుండెల ఏక తాళమో..
జోరైన యవ్వనాలలో..ప్రేమ గీతమో...
లేలేత పూలబాసలు .. కాలేవా చేతిరాతలు (స్వ)

నీవీ ప్రాణం,నీవే సర్వం
నీకై చేశా వెన్నెల జాగారం (బాలు జాగారం అన్నది ఎంత బాగుంటుందో!)
ప్రేమ నేను రేయి పగలు ( భావన వ్యక్తి, రోజు లో..ఆ రెండు సగాలు)
హారాలల్లే మల్లెలు నీకోసం ( పరాకాష్ట భావం)
కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచువేళ
నిండు ఆశలు రెండు కన్నులై చూస్తే .. నే రానా ..
కాలాలే ఆగిపోయునా గానాలే మూగబోవునా... ( కలసిన రెండు హృదయాల గానాలు మూగాపోతాయా) (స్వ).

నాలో మొహం రేగే దాహం
దాచేదేప్పుడో .పిలిచే కన్నులలో..(రసజ్ఞత )
ఓడె పందెం గెలిచే బంధం ( ప్రేమికులలో..ఎవరు ఓడినా రెండో వారు గెలిచినా )
రెండు ఒకటే కలిసే జంటల్లో..
మనిషి నిండుగా మనసు తోడుగా ( మానసికమైన తోడు)
మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలి తీరం (నిజం కదా!)
వారేవా ..ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం (ఎక్సలెంట్ ఎక్స్ ప్రెషన్ )

స్వప్న వేణువేదో.. సంగీత మాలపించే .. అసలే వేణువు.. వినడమంటే తీపి కోత.. రాత మనసు దోచే మధుర గీత.
వేటూరి కలం ఒలికించిన ప్రేమ గీతం.. ఎస్ పి.బాలు,చిత్ర గళ మాదుర్యం .. తోడై ..మన కోసం
నాయికా నాయికలు.. వారి ఇద్దరి మద్య ఉన్నదీ ప్రేమ లేక ఆకర్షణ అన్నది తేల్చుకోవడానికి..పరీక్ష పెట్టుకుని.. దూరం జరిగి.. ఒకరి ఊహలలో...ఒకరు జీవిస్తూ.. పాటలో..జీవిస్తూ..అతను.. పాటతో ప్రాణం లేచొచ్చి..ఆమె..ని చుట్టేసిన భావ తరంగం ఈ పాట...

కధకి..అనుగుణమైన పాట. వేటూరి సాహిత్య సొబగులతో.. మణి శర్మ అందించిన స్వరాలూ.. ఘాడ సుప్తావస్థలో ఉన్నా మేలుకొలిపే..పాట. మణిశర్మకి..శాక్సోఫోన్ తో స్వరాలూ అందించిన (అజ్ఞాత)ఆ కళాకారుడికి.. హాట్స్అఫ్ఫ్..అన్నమాట. నాకు చాలా ఇష్టమైన ఈ పాటని.. మెమరి కార్డ్లో..నింపుకుని..వచ్చి మా అబ్బాయి చిరంజీవి .. నిఖిల్ చంద్ర నాకు.. పుట్టిన రోజు కానుకగా ఇస్తూ.. వినిపించిన రోజు.. నా మది పుటలలో.. మరపురాని జ్ఞాపకం. ఇక పాట చిత్రీకరణ అత్యద్భుతం ... ఈ.. పాట నాకిష్టమైన పది పాటల్లో..క్రమం...నంబర్ నాలుగు..
పాట మాత్రం ..అయిదు నక్షత్రాల మార్క్ పాట. ఈ.. పాట ఇనుస్త్రుమేంట్ మ్యూజిక్ కూడా మనసు దోచేస్తుంది. పాట చూసే ఓపిక లేకుంటే ..వినేయండీ.. ఇక్కడ ...

14, మే 2011, శనివారం

మాతృ దేవోభవ


అసలు నేను ఈ పోస్ట్ మొన్న మాతృ దినోత్సవం.. అప్పుడు పెట్టాల్సింది.

కానీ ఈ రోజుకి.. పోస్ట్ పోన్ చేసాను. కారణం ఏమంటే.. ఈ రోజు కి ఆమెకి నాకు..సంబంధం ఉంది.. 26 సంవత్సరాల క్రితం నేను.. మా ఇంట ఆమెకి కోడలిని అయ్యాను. ఆమె మా "అత్తమ్మ". 26 సంవత్సరాలలో.. నేను.. ఆమెలో.. తల్లినే చూసాను.

భిన్న సందర్భాలలో.. విభిన్న సమయాల్లో..ఆమె.. నాకు అమ్మ గానే తెలుసు. ఎప్పుడూ.. అత్త గారిలా.. ఉండటం నేను చూడలేదు. అందుకే.. మా ఈ పెళ్లిరోజు.. మా అత్తమ్మ గురించి..మీతో..పంచుకోవాలనిపిస్తుంది

కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో.. 1943 వ సంవత్సరంలో.. "పోలవరపు" వారింట పుట్టి..అపురూపం గా పెరుగుతూ.. ఆ వూరిలో..ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ లో.. ఏడవ తరగతి చదువుకుంటూ.. తన పద్నాలుగేళ్ళ వయసులోనే.. పక్క ఊరిలోని "తాతినేని" వారింట పెద్ద కోడలిగా అడుగు పెట్టి.. ముగ్గురు బిడ్దల తల్లి అయి అప్పటికి..ఎప్పటికి.. అందరికి "పాపమ్మ" అయి.. అందరికి తలలోనాలుకై, ప్రేమపాత్రురాలై .. పాడిపంటలతో.. సిరిసంపదలతో...ఆనంద జీవనం సాగించిన సాగిస్తున్నస్త్రీ మూర్తి .. మా "అత్తమ్మ."

నా పద్దేనిమిదోయేట ఆ ఇంట కోడలిగా అడుగు పెట్టిన నాకు.. వంటావార్పు..మంచి చెడు అన్నీ.. ఆవిడ నుండే నేర్చుకున్నాను.

అసలు ఒక్క పని కూడా చేతకాని నాకు.. అన్నీ ఆవిడే నేర్పించారు. పద్నాలుగు సంవత్సరాల ఉమ్మడి కుటుంబ జీవనంలో.. ఆవిడకి నాకు ఉన్న అనుబందం అంతా ఇంతా కాదు.

వనజా..ఏం కూర వండుకుందాం ? అని ఆవిడ అడగటం...నుండి.. మా ఇద్దరికి కుదిరినంత సఖ్యత ..ఆమె కున్నమరో.. ఇద్దరి కోడళ్ళతో..ఉండదు ఎందుకో..నాకు అర్ధం కాదు. షాపింగ్ కి వెళ్ళడం.. కావాల్సినవి కొనుక్కోవడం ..మంచి చెడు మాట్లాడుకోవడం.. అన్ని విషయాలు.. ఆమె తో..నిరభ్యతరంగా మాట్లాడుతుంటాను.

వ్యవసాయ ప్రధాన వృత్తి గా కల మా కుటుంబాలలో.. పని పాట ఎప్పుడు ఎక్కువే! ఉమ్మడి కుటుంబంలో ఆమె ఎప్పుడూ..పని పాటలు.. అత్తగారి ఆరళ్ళు.. అన్నీ అనుభవించినా.. కోడళ్ళని ఎప్పుడూ.. ఏమి అనడం ఇప్పటికి ఆవిడకి రాదు. మగ పిల్లల తల్లిగా కోడళ్ళు అవి తేలేదు ఇవి తేలేదు..మంచి మర్యాదలు జరుపలేదు..అని అనడం అసలు ఆమెకి తెలియదు.. చక్కగా ముగ్గురు కొడుకులకి పైసా కట్నం ఇంటి క్రిందకి ఆశించడం ఆమె ఎరుగదు. ఆడ పిల్లలు లేని ఆవిడ...కోడళ్ళు.. చక్కగా ఉంటే  చాలు అని తలపోసేవారు. ఆవిడలో..గొప్ప సుగుణం. ఎవరిని ఏమి అనరు.గుంభనంగా ఉంటారు.

మా మామయ్యగారు..పది వరకు చదివి బాగా వ్యవసాయం చేసేవారు. ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయాక వారికి వచ్చిన వాటా పొలం తో పాటు.. కౌలుకి తీసుకుని పసుపు,చెరకు,అరటి తోటలు,కూరగాయలు తోటలు వేసేవారు.. విపరీతంగా శ్రమించడం.. పంట చేతికోచ్చేసరికి.. ఏ తుఫాను లో రావడం అరటి తోటలు పడిపోవడం,మిగతా పంటలకి గిట్టుబాటు ధర లభించపోవడం.. అన్నీ ఆర్ధిక నష్టాలే! విసిగిపోయి కృష్ణా జిల్లా "తాడిగడప'' లో.. భూములని అమ్ముకుని.. నెల్లూరు జిల్లా లో.. కోవూరు కి సమీపంలో.. వ్యవసాయ భూములు కొని పెద్ద ఎత్తున ఆధునిక వ్యవసాయం ప్రారంభించారు.

ముప్పై ఏళ్ళ క్రితం ప్రారంభమైన ఆ దశ ఆరేళ్ళ క్రితం వరకు కొనసాగింది. ఇరవై రెండు ఎకరాల ఒకే క్షేత్రంలో..ఎన్ని రకాల పంటలు పండిచేవారో! అన్నీ వాణిజ్య పంటలే! అధిక దిగుబడులు..తో.. నాయుడు గారి కుటుంబం అంటే మారుమ్రోగిపోయేది.. (అక్కడ కమ్మ కులస్తులని నాయుడు లని ఉదహరిస్తారు) పంటలు ఎలా పండిస్తున్నారో..చూడటానికి.. ఆ జిల్లా లోని చుట్టుప్రక్కల ఊర్ల వాళ్ళు పదే పదే వచ్చేవారు. వాళ్ళకి ఆతిధ్యాలు ఇవ్వడం మా వంతు.

షుగర్ ఫాక్టరీ నుండి ఫీల్డ్ మాన్స్ వచ్చినా, ఎలక్షన్స్ అప్పుడు ప్రిసైడింగ్ అధికారులు వచ్చినా, ఎలక్త్రసిటి డిపార్ట్మెంట్ వాళ్ళు..ఇలా.. ఎవరికైనా ఆతిద్యం మా ఇంటే! విసుక్కోకుండా చక్కగా వండి వడ్డించేవారు. .. మా పొలం లో.. ఎన్ని రకాల ఫల వృక్షాలు,ఎన్ని రకాల పూల మొక్కలు..ఉండేవో..! నేను ఎప్పుడూ..వాటిమద్యే ఉండేదాన్ని. మా అత్తమ్మ మామయ్య పువ్వులు,కాయలు కోసి స్వయంగా పంచేవారు.

బాగా చదువులు చదివిన ముగ్గురు కొడుకులు కూడా మళ్ళీ వ్యవసాయం లో.. మునిగి తేలడం మా అత్తమ్మ కి ఇష్టం ఉండేదు కాదు.. అయినా ముగ్గురు కొడుకులు..అదే వృత్తిలో.. పీకలదాకా మునిగిపోయారు. నా పెళ్లప్పటికి మా వారు జాబ్ చేస్తూ..ఉన్నారు.. నేను ఆవూరిలో కాపురం ఉండనేమో అనుకునే దాన్ని. విచిత్రంగా అక్కడే ఉండిపోయాం. మూడు జతల ఎద్దులతో వ్యవసాయం ,నలుగురైదుగురు పాలేరులు, ట్రాక్టర్ డ్రైవర్లు..ఎప్పుడు.. వండటాలు,కడగటాలు,పెట్టడాలు.. ఎప్పుడూ పనే!మా అత్తమ్మకి తోడు నేను.

ఎంత విచిత్రం అంటే.. అక్కడికి పేపర్ కూడా ఈ రోజు పేపర్ రేపు వచ్చేది. అసలు బయట ప్రపంచం తో సంబంధం ఉండేది కాదు. రేడియో.. తర్వాత తర్వాత టీ.వి. వచ్చింది.. నెల్లూరు సిటీ కి వెళ్ళాలంటే.. కొంచెం దూరం వెళితే కానీ బస్ లు ఎక్కడానికి కుదిరేది. రోగం, నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే.. ఎంత ప్రయాసో! మా మామ గారంటే అందరికి గౌరవం,భయం. ఆయన ముందు ఎవరు మాట్లాడేవారు కాదు. కారు కాకపోయినా.. ఒక మోటార్ సైకిల్ అయినా కొనమని కొడుకులు గొణుక్కునేవారు.. ఆయన అవేమి పట్టించుకునేవాళ్ళు కాదు.వ్యవసాయం ఎంత బాగా చేశామా..ఎంత దిగుబడులు సాధించామా..?అన్నదే ముఖ్యంగా ఉండేది. వారికి.. కొడుకులకి మద్య మా అత్తమ్మ వారధి. ఇవన్నీ ఇష్టం లేని మా బావగారు..అక్కడినుండి మళ్ళీ విజయవాడకి వచ్చేసినా మేము అక్కడే ఉన్నాం.

తెల్లవారు ఝామునే లేచి పాలు పితకడం..నా డ్యూటీ . అల్లాగే మగవారు బయటికి వెళితే.. కరంట్ రాగానే.. పంపులు వదలడం , ట్రాక్టర్ డ్రైవర్ లెక్కలు చెపుతుంటే వ్రాసుకోవడం.. .. ఇలాటి పనుల మధ్య నాకు రోజు ఎలా గడిచిందో.. తెలిసేది కాదు. అలా పద్నాలుగు ఏళ్ళు గడచిపోయాయి

ఆడ పిల్లలు అంటే.. మా అత్తమ్మ కి ఇష్టం. ఒకొక్కరికి ఒక్క సంతానం చాలని ఆవిడే సూచించారు.. మేము పాటించాం కూడా..

దానికి ఒక కారణం ఉంది. మా కుటుంబాలలో.. అప్పటికి మేమే ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబం కావడం వల్ల అలా భావించేవారు. మా బావ గార్కి ఒక అమ్మాయి. తను డాక్టర్ శిరీష..ఇప్పుడు US లో ఉంది .మా మరిది గారికి ఒక అమ్మాయి.'" భవ్య" తను ఇంజినీరింగ్ చదువుకుంటుంది.వీళ్ళిద్దరూ అమ్మాయిలు కావడం .. పైగా ఎందుకో.. నేను అంటే ఆమెకి ఉన్న ఇష్టం కారణంగా మాకు అబ్బాయి పుట్టడం.. వాడిని అపురూపం గా పెంచడం .. తతిమా అందరికన్నా ఆమెకు నా కొడుకంటే పంచప్రాణాలు. కొడుకులకన్న కూడా ..ప్రేమగా.."అయ్యా!బంగారం ..అని పిలుచుకుంటుంది.. చదువు కునేందుకి కుదరడం లేదని మా అబ్బాయికి పదేళ్ళప్పుడు మేము అక్కడి నుండి విజయవాడకి.. తిరిగి వచ్చేసాం. తర్వాత కూడా వ్యవసాయం జరుగుతూ..ఉండేది. సడన్ గా ఆరేళ్ళ క్రితం మా మామగారు వ్యవసాయం పనులు చేయిస్తూ.. మద్యాహ్నం పూట భోజనం చేసి కూలీలని పిలవటానికి వెళ్లి .. వారి రాక ఆలస్యం అయిందని గుడి ముందు కూర్చుని.. ఆ గుడిలోనే .. హార్ట్ ఎటాక్ తో ఒరిగి పోయారు.

ఆయన మరణం మా అత్తమ్మకె కాదు మా అందరికి ఆశా నిఘాతం.

మనుమడి,మనుమరాళ్ళ అభివృద్ధి ,పెళ్ళిళ్ళు చూడకుండానే చనిపోయారని ఇప్పటికి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. అందరి ఆడ వారిలాగా .. ఆమె డబ్బు దాచుకోవడం ఉండేది కాదు.. మా మామ గారు..ఇస్తేనే తీసుకోవడం ఆమె అలవాటు.అలాగే..ఆమెని ఈ డబ్బు ఏం చేసావని అడిగేవారు కాదు.. వారిద్దరిని మించిన ఆదర్శం నాకు..ఎవరిలో..కనపడదు.

మా మామగారు ఎవరితోనూ మాట్లాడే వారు కాదు. ఏదైనా అవసరం వస్తే.. వనజ ని అడుగు.. ఇలా చేస్తే.. బాగుంటుందా అని అనేవారు.. అత్తమ్మ వచ్చి.. ఏమే! ఇలా చేస్తే ఎలా ఉంటుంది..? అనేవారు. వారికి సంబంధించి నేను.. వాళ్లకి.. రెండో..కొడుకుని ..కోడలిని.. కూతురిని కూడా.. చాలా క్లిష్ట సమయాలలో.. నాకు.. అండ దండగా ..నిలిచారు. అలా ప్రతి అత్తా-మామ ఉండగలగడం కూడా అదృష్టమేనేమో!

ఇప్పటికి.. ఆమె చేతి వంట నాకిష్టం. నేను పాలు తీసే సమయానికి కుంపటి వెలిగించి .. కాఫీ డికాషన్ వేయడం .. కూరలకి అన్నీ రెడీ చేయడం చేస్తారు. వద్దన్నా వినరు. పప్పులు విసరడం,వడియాలు పట్టడం.. అన్నీ చేస్తారు.

అలాగే.. మనుమడికి రకరకాల పిండివంటలు చేసిపెట్టడం చాలా ఇష్టం. నాలుగు రోజుల నుండి ముదిమనుమరాలు "శ్రీ" కి జ్వరమని ..ఆ..పాపనే అంటి పెట్టుకుని ఉంది. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం. ఈ మద్య కాశీ క్షేత్రం వెళ్ళారు.అక్కడ మా మామ గారి పేరిట పిండ ప్రదానాలు పెట్టించి.. కాశీ అన్నపూర్ణ ఈశ్వరికి కి..మొక్కి.. ఆమె ముందు..కొంగుచాచి భిక్ష అడిగి తర్వాత అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో.. మా అబ్బాయి పుట్టినరోజు న ప్రతి సంవత్సరం అన్నదానం జరిగేలా డబ్బు కట్టివచ్చి. ఆ రశీదులు నాకు ఇచ్చినప్పుడు కోప్పడ్డాను. మామయ్యగారి పేరున కట్టకుండా.. ఇదేమిటి పాపమ్మా.!.అంటే.. నవ్వి ఊరుకున్నారు. మా అబ్బాయంటే అంత ఇష్టం ఆమెకి.

చుట్టరికాలలో.. శుభ కార్యాలకి,మంచి చెడు కార్యక్రమాలకి నేను వెళ్ళడం అంత కుదరదు అంటే వినరు .. వెళ్లి తీరాల్సిందే! అక్కడ అందరికి నన్ను చూపించి.. మా అశోక్.భార్య..మా రెండో కోడలు అని పరిచయం చేస్తారు. మంచి మంచి చీరలు ధరించడం.. నగలు పెట్టుకోవడం ఎక్కువ ఇష్టం. నేను నలుపు ఎక్కువ ఇష్టపడతానని .." ఏమ్మా..ఇంకేదైనా రంగులు కొనుక్కోరాదూ..!" అంటారు తప్ప ఆజ్ఞా పించడం ఉండదు.

మేము అక్కడ నుండి విజయవాడ వచ్చేసిన తర్వాత కూడా అక్కడే ఉండి ..పొలాలు చూసుకునేవారు. మా మామ గారి మరణం తర్వాత.. కొడుకులు.. ఎవరి కారణాలవల్ల వాళ్ళు.. ఆ భూములు అమ్ముకోవడం ఆమెకి తీరని బాధ. అలాగే.. ఉన్న ఇంటిని పడగొట్టి వాటాలుగా విడకోట్టుకోవడం వల్ల ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండాల్సిరావడం మాకు మరింత బాధ.

సిరి సంపదలతో,పాడిపంటలతో.. వైభవంగా బ్రతికిన ఆమెని .. జీవన చరమాంకంలో..హాయిగా ఉంచాల్సిన భాద్యత మాకుంది. అప్పుడు.. మేము అమ్మిన భూముల వెల కోట్లాను కోట్లు.

ఇప్పుడు అవన్నీ..లేకున్నా.. ఆమెకి బిడ్డలే ఆస్తులు-అంతస్తులు కూడా.. అందుకే..మా అబ్బాయి అంటూ ఉంటాడు.. ఇలా అని.."పాపమ్మా! ఒక రెండు సంవత్సరాలు ఆగితే .. మన వూర్లో.. మంచి ఇల్లు కట్టి.. మల్లికార్జునరావు గారి ఇల్లు చూడు.. ఎంత బాగుందో.. !! అనుకునేలా కట్టి.. నీకు గిఫ్ట్ గా ఇస్తాను అంటే.. ఆమెకు.. ఎంత సంతోషమో! అది నిజం చేయడానికి.. మా కుటుంబం అంతా.. శ్రమిస్తున్నాం. అది నిజం అవుతుంది కూడా..

పద్నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోతే.. మా అమ్మని నేను.. మా అత్తమ్మలో..చూసుకున్నాను.

ఎన్నో.. సమయాలలో.. కొడుకులకన్నా.. నాకే ప్రాముఖ్యత ఇచ్చి.. నన్నే సపోర్ట్ చేసి.. నాకు అండ దండగా నిలిచి.. ..నన్ను కన్న కూతురిగా కన్నా ఎక్కువగా.. చూసుకున్న అత్తమ్మని.. నేను అమ్మగానే భావిస్తాను. అలా ప్రతి ఒక్క అత్తా గారు తమ కోడలిలో.. కూతురిని చూసుకోవాలని, ప్రతి కోడలు.. అత్తమ్మలో.. అమ్మని చూసుకుంటే.. ఎంత బాగుంటుంది అనుకుంటాను.

ఒకే ఒక కారణం చేత ఆవిడని మా దగ్గర ఉండటం కుధరనందుకు.. నాకు ఎంతో..బాధ. తెలిసి తెలియక నేనేమైనా తప్పు చేసినా ఆ  తప్పిదాల్ని క్షమించి..నాకు ఎంతో.. మార్గదర్శకత్వం చూపిన ఆ తల్లి మనసు.. నిజంగా ఆడ మనసు.

ఆమెలో.. నేను తల్లినే..చూసాను.. తప్పు చేస్తే.. దండించే.. తల్లినే చూసాను కాబట్టే..ఈ..రోజుకి వనజా..ఏం కూర వండుకుందాం అని ఆవిడ అడిగితే..నేను.. పాపమ్మా..! భోజనం చేద్దాం రా... అంటూ.. పిలిచేదాకా .. రోజంతా..  ఆ అనుబంధంతో.. గడుస్తూ..ఉంటుంది.

ఇది.. మా .. అ (త్త)మ్మ..తో నాకున్న అనుబంధం. మళ్ళీ జన్మంటూ ఉంటె ఆమెకే.. కోడలిని అయ్యే భాగ్యం ప్రసాదించు.. తండ్రీ.. అని భగవంతుడిని వేడుకుంటాను.

మాతృ దేవోభవ !!!!! ప్రాతఃస్మరామి పాదాభి వందనం..ఆమెకి..ఎప్పుడూ..కూడా..


Posted by Picasa

10, మే 2011, మంగళవారం

గున్న మామిడి కొమ్మ మీద

ఒక జ్ఞాపకం .. 
నేను నా స్నేహితురాలితో.. ఫోన్ లో మాట్లాడుతున్నాను...శుక్రవారం రాత్రి సమయం.. పదిగంటలకి ప్రసారమయ్యే..అభిరుచి కార్యక్రమం వచ్చే సమయమైనది.

ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారం అవుతున్న "అభిరుచి" వస్తుంది..ప్రసారమవుతున్న పాటలకి..అందంగా వాఖ్యానం చెప్పే "రవి కుమార్ రెడ్డి " గారి వాయిస్ తో.. పాటలు వినడం ఒక మంచి అనుభూతి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.. ఒక గూటిలోన రామ చిలుకుంది.. ఒక గూటిలోన కోయిలుందీ!.. పాట మొదలయింది.." వనజా.. మంచి పాట వస్తుంది.. విను "అంటూ.. రేడియో.. వాయిస్ పెంచి వినిపించే ప్రయత్నం చేసింది.. ఇక్కడ కి కూడా వినవస్తుంది..లే! నేను రేడియో పెట్టాను.. అన్నా ఊరుకోదు.. 

తనకి.. పాటలన్నా..స్నేహితులన్నా..ఎంత ఇష్టమో...! ఈ..పాట కూడా అంత ఇష్టం. తనకి..ఇష్టమైనది.. తనకిష్టమైన వారికి.. వినిపించడం ఇంకా ఇష్టం..సడన్ గా ఎప్పుడో ఒకప్పుడు తన నుండి కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేస్తే.. నాకు ఇష్టమైన పాట వినవస్తుంది.. అలా..అపురూపమైన కానుకలు ఇవ్వడం మా.. మొద్ధుకి అలవాటు. నేను తనని.. ముద్దుగా అలా పిలుస్తూ..ఉంటాను..అన్నమాట. "గున్న మామిడి కొమ్మ మీద "పాటలో..కలకూజితం  జానకమ్మ స్వరాన ఆ స్వరాలూ.. ఒకింత విషాదంతో.. మనల్ని.. ఆకట్టుకుంటాయి.. మౌనం గా పాట వినడం కుదరదు..తను గొంతు కలుపుతూ..ఉంటుంది.రెండు స్వరాల మధురిమలు వింటూ..పాటని.. ఆసాంతం ఆస్వాదించాను.

ఎంత చక్కని సాహిత్యం.. ఇద్దరి మిత్రుల ఎడబాటు..ని.". డా.సి .నా.రే.". ఎంత బాగా.. హృదయానికి హత్తుకునేలా వ్రాసారు!!! అప్పట్లో.. ఈ..పాటకి.. వాడ  వాడనా అభినందన మందారమాలలు.. అట.  నా చిన్నప్పటి విషయాలు చెపుతూ.. ఈ విషయం మా అమ్మ చెప్పేవారు. అమ్మ పరిజ్ఞానం కూడా.. రేడియో.. వినడం ద్వారానే మరి. పాటకి పట్టాభిషేకం మా ఇంట్లో..ఎప్పుడూ..ఉంది.  చిన్నారి  స్నేహితుల మద్య కులాల మతాల,ఆర్ధిక పరమైన వ్యత్యాసాలు..వారిని ఎలా విడదీస్తాయో... ఆ పసి మనసుల బాధ ఏమిటో.. ఆ పాటలో.. ఎంత హృద్యంగా ఉంటాయో..కదా!! ఆ పాట తెలియని..వారు ఎవరు ఉండరు..కదా! సత్యం గారి స్వర కల్పనలో.. ఆ పాటకి..ఒక విశేషం ఉంది.. అని నాకు..ఈ మద్యే తెలిసింది.. "పండిట్ హరిప్రసాద్ చౌరాసియా" ..వేణువు.. ఆ పాటలో.. మనలని.. మధుర భావనలో.. ఓలలాడిస్తుంది..అని.. ఆహా.. ఆ.. స్వరం వారిదా ?అనుకుని.. ఇప్పుడు ఇంకా ఇష్టంగా  ఆపాటని వింటున్నాను... 

ఇన్ని మంచి గుణాలున్న ఈ పాటని గుర్తు  చేసుకుంటూ.. . నా నెచ్చెలి "లక్ష్మి" కి  ఈ..పాట .. గుర్తు చేస్తూ.. మా స్నేహవనం లో.. ఇలాటి పాటల పూల పరిమళాలు ఇంకా.. వెధజల్లబడాలని.. మా స్నేహ సుగంధం ఇంకా కాలం కౌగిలి లో.. అరుగుతూ.. సమీర పవనాలుగా.. అందరి ని తాకి తాకి వెళ్లాలని  కోరు కుంటూ.. ఆకాశవాణి.. కడప కేంద్రం  వారికి.. కృతజ్ఞతలతో.. ఎందుకంటే..  ఈ పాట మా ఇద్దరికి.. సంయుక్తంగా ఇష్టం. ఆ పాటల కార్యక్రమమే.. నన్ను తనని కలిపింది.. లైవ్.. ఫోన్ ఇన్  ప్రోగ్రాం..  "అభిరుచి" మమ్మల్ని కలిపింది.. అందుకే.. ఈ కృతజ్ఞతలు... తో.. ఈ స్నేహితుల దిగులైన మాట.. ఆ పాట ..ఈ..పూట.  . గున్న మామిడి కొమ్మ   మీద  (sad)  పాట   .. నా కిష్టమైన నా నెచ్చెలి కోసం.

6, మే 2011, శుక్రవారం

సవాల్ కి జవాబు దాసరి "మేఘసందేశం"

కాలం తో.. పని లేనిదీ  కారణాలతో.. పని లేనిదీ.. ప్రేమ.. 
అవును.. ఈ.. చిన్న వాక్యానికి  అనంతమైన  అర్ధం... ఇమిడి.ఉంది.. 
విజ్ఞులు,గురుతుల్యులు చెప్పినంత వివరంగా ..సోదోహరణంగా..నేను చెప్పక లేక పోవచ్చు.. చెప్పే ప్రయత్నం అయితే మాత్రం  చేస్తున్నాను.   


శతాధిక  చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు..గారి చిత్రం ఇది.  దాసరి గారు ఈ..చిత్రానికి.. సంబంధించి..ఓ..సవాల్  ఎదుర్కున్నారని చెబుతూ..ఉంటారు. శంకరాభరణం చిత్ర విజయం తర్వాత.. కే.విశ్వనాథ్ గారి.. పేరు మారుమ్రోగుతున్న వేళ.. దాసరి గారు.. ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు.. రైల్వే స్టేషన్ లో... వారు వారి అభిమానులతో.. నడచి వెళుతూ..ఉండగా.. జనంలోనుండి...అగ్ర దర్శకుడు అని  పేరు చెప్పుకోవడం కాదు.. మా..విశ్వనాథ్ లా.. ఒక కళాఖండం తీయగలవా? అని సవాల్ విసిరారట. అప్పుడు ఆయనలో.. ఆలోచనలు   మొదలై.. ఒక.. చక్కని, చిక్కని కళాఖండం రూపుదాల్చింది.  అదే .. "మేఘసందేశం "


1983 లో.. జాతీయ స్థాయిలో..  రెండు  అవార్డ్లు  సొంతం చేసుకుంది. "ఆకాశ దేశాన "పాట పాడినందుకు  కే.జే ఏసుదాస్ కి , స్వరాలూ అందించిన రమేష్ నాయుడు  గారికి.. ఇంకా.. ప్లే బ్లాకు ఫిమేల్ సింగర్  గా ..పి.సుశీల గార్కి, దర్శకుడు  దాసరి కి, నిర్మాత గా దాసరి పద్మ గారికి.. ఇలా. ఒక్క  ఈ.. చిత్రానికి.. మొత్తం 27  అవార్డ్ లు గెలుచుకున్న చిత్రం ఇది. 

ఇన్ని అవార్డులు అందుకున్న చిత్రం అని నాకు అసలు తెలియక ముందరే  నేను   ఈ.. చిత్రాన్ని చూసినప్పుడు.. చాలా నచ్చేసింది..ఎందుకో..తెలియదు.ఆలోచనల్లో.. పరిపక్వత వచ్చేసరికి.. ఇంకా.. బాగా నచ్చేసింది. అందుకే..నా కు నచ్చిన సినిమాల్లో..మేఘసందేశం ఒకటి.

చిత్ర  కధ లోకి వెళితే.. కథ లో... ఏ.యెన్.ఆర్.. రవీంద్ర బాబు.. ఒక పల్లెటూరిలో.. గౌరవనీయుడు..మంచి మనిషి. కవి కూడా.  వివాహమై ఒక కూతురు కూడా..ఉంది.. నలుగురికి మంచి చెప్పే ఆదర్స ప్రాయుడైన  వ్యక్తిగా..గుర్తింప 
బడతాడు. అతని భార్య లక్ష్మి..అతనికి తగిన విధంగా నడచుకునే  భార్య.

ఆ ఊరికి.. ఒక దేవదాసి కుటుంబం వలస వచ్చి.. ఊరి చివర నది ఒడ్డున నివాసం ఏర్పరచుకుని తమ నాట్య గానాలతో.. అందరిని అలరిస్తూ..ఉంటారు. ఆ ఊరిలో.. పురుషులందరూ.. ఆ..ఇంటికి వెళుతూ.. తమ కుటుంబాలని,పనులని నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఆ దేవదాసి కుటుంబాన్ని..మందలించి ఆ ఊరినుండి తరిమి వేయమని కొంత మంది గ్రామీణులు  కోరికని  రవీంద్ర బాబుకి చెప్పుకుంటారు .  అతను ఆ.. ఇంటికి వెళ్ళడం అక్కడ "పద్మ "అనే దేవదాసి స్త్రీ ని చూసి  ఆమె నృత్య గానానికి ముగ్దుడవడం.. అంతలోనే తేరుకుని.. ఆమెని ఊరు వదలి వెళ్ళమని మందలించడం ..ఆమె అందుకు.. సమాధానం గా.. మేము..నాలుగు ఊర్లు తిరుగుతూ.. మాకొచ్చిన విద్యలతో..  జనులని అలరించి పొట్టపోసుకునే వాళ్ళం. ఇక్కడకి.. వచ్చి చెడిపోయిన వాళ్ళు.. ఎవరు ఉండరు.. చెడిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు..అంటుంది.

 మాట్లాడకుండా.. వెళ్ళిన అతను.. మళ్ళీ.. ఏదో..అయస్కాంతం లాగినట్లు.. మరుసటి రోజు అక్కడకి వస్తాడు. ఆమెని చూసి ఉత్తేజం చెంది  అతనిలో మరుగున పడిన కవి మేల్కొని కవిత్వం వ్రాయడం మొదలెడతాడు. అతని భార్య.. ఆ..కవిత్వం   చూసి తనని ఊహించుకునే అతను ఆ కవిత్వం వ్రాసుకున్నట్లు భ్రమపడి భద్రంగా.. బట్టల అడుగున ఆ.. కాగితం దాచుకోవడం.. తర్వాత గుడిలో.. వర్షంలో.. తడిచిన పద్మ పరిచయమై.. తమ బండిలో.. తీసుకుని వెళ్లి ఇంటి లోపలకి..  ఆమెని ఆహ్వానించడం వెళ్ళేటప్పుడు ఆమెకి  పసుపు -కుంకుమలు ఇవ్వడం.. ఆమె వెళ్ళిన వెంటనే.. నిజం తెలియడం.. బట్టల అడుగున దాచుకున్న కవిత్వం   కాగితాన్ని చించి ముక్కలు చేసి పారేయడం.. ఇదంతా ..ఒక సగటు ఇల్లాలి..తనం జయసుధ పాత్రలో.. ఎంత  సహజం గా.. ఒదిగిపోయాయో! 

 తర్వాత అన్నగారిని పిలిపించడం  భర్తకి.. సుద్దులు చెప్పించి..కాపురాన్ని దక్కించుకునే  ప్రయత్నం చేయడం.. అది.. వీలు కాదనుకుప్పుడు..  ఆ అన్నయ్య ఊరి పెద్దల సహకారంతో ఆ దేవదాసి కుటుంబాన్ని.. ఆ ఊరినుండే పంపేయడం.. జరుగుతుంది. రవీంద్ర బాబులోని కవి.. ఆ ప్రేయసి ఎడబాటుతో.. ఎప్పుడూ.. ఆలోచిస్తూ.. బాహ్య ప్రపంచాన్ని  మరచి..ఆమె ద్యాస లోనే..బ్రతుకుతూ..ఒక కావ్య రచన చేయడం.. ఆ.. పుస్తకఆవిష్కరణ సమయంలో .. అతనిపై ఉన్న అభిమానంతో..పద్మ కూడా రావడం.. ఆమెని ..రవీంద్ర బాబు చూడటం జరుగుతుంది. రావీద్రబాబు కూడా   ఆమెని పిలుస్తూ జనంలో వెతుక్కుంటూ వెళ్ళిపోవడం .. అతనిని వారించబోయిన అన్నగారిని లక్ష్మి.. వారించి.. " ఆయన మనసంతా.. ఆమె నిండి ఉంది... బాహ్యంగా ఆయన ఇక్కడ ఉండేకన్నా పూర్తిగా ఆమె దగ్గర ఉంటేనే.. మంచిచి..ఆయనని వెళ్ళనీ అన్నయ్యా " అంటుంది. భర్త మనసును అర్ధం చేసుకున్న ఆమె తీరు ప్రేక్షకులని ముగ్ధుల్ని చేస్తుంది .  అతి సాధారణంగా మెలుగుతున్నట్లు కన్పించిన ఆ   స్త్రీ మనసు,ఆమె  ఆలోచనల్లోని..పరిణితి..చాలా హృద్యంగా ఉంటుంది.

 పద్మ ని వెదుకుతూ.. వెళ్ళిన అతను.. ఎక్కడెక్కడో..తిరగడం.. అటు భార్య దగ్గర లేక , ప్రేమించిన ఆమెని చేరుకోలేక .. మతి భ్రమించిన  వాడిలా..తిరుగుతూ ఉంటాడు .  ఆ విషయం తెలుసుకున్న పద్మ ఓ  నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి ఆతన్ని.. రప్పించే యోచన చేయడం .. అనుకున్నట్లుగానే.. అతను  అక్కడికి రావడం.. పద్మకి.. చేరిక అయి ఆమె  ప్రేరణతో  కవిగా  ఎన్నో.. రచనలు చేయడం ఇది కథ .  ఇంతటి కథ వెనుక .. అసలు.. కారణం .." ప్రేమ"  అది..  పెళ్లి అయి భార్య బిడ్డలతో.. గౌరవనీయుడిగా బ్రతుకున్న వ్యక్తి  మదిలో..మెదిలిన ప్రేమ భావన. అది.. ఆకర్షణ లో..పుట్టిన ప్రేమ కాదు. మోహంలో.. పుట్టిన ప్రేమ అంతకంటే  కాదు. ఇద్దరు.. కళాకారులకు సంబంధించిన  హృదయ స్పందన. దానికి.. కాలంతోను.. కారణాలతోను.. పని లేకుండా జనియించిన ప్రేమ . ఎవరికి ఎప్పుడు ఎవరిపై ప్రేమ ఎప్పుడు ఎందుకు కల్గుతుందో చెప్పలేం..కూడా!  అదే..జరిగింది ఆ కధలో.. అల్లా.. జరిగిన ఆ కథలో .. అందరి చేతా చులకన చేయబడిన పాత్ర  పద్మ పాత్ర  ..  జయ ప్రద తప్ప అలా.. ఎవరు చేయగలరు? ఈ.. చిత్రంలో.. ఎవరి పాత్రకు తగినట్లు వారు జీవించారు. పాటలు, చిత్రీకరణ,సంగీతం ..అన్నీ..అద్భుతం.  అందుకే ఈ చిత్రం ఒక కావ్యం అనదగ్గ అర్హతలు  ఉన్నాయనిపిస్తుంది . చిత్రం ఆద్యంతం  ఒక మధురానుభూతితో..చూడవచ్చు. ఎక్కడా ఇసుమంతైన అతిశయం లేకుండా  .. మన మద్య జరుగుతున్నంత ఒక వాస్తవం లా.. సాగుతూ..ఉంటుంది.  .  

ఆఖరిలో..  తన  కూతురి పెళ్ళికి   రవీంద్రబాబు  రావడం అందరికి సంతోషకరం.. పెళ్లి అయిన వెంటనే.. తిరిగి వెళ్ళాలనుకోవడం,అతను త్వరపడటం..మనసంతా పద్మ దగ్గరే.. తారట్లాడినట్లు  ఉండటం.. ఏళ్ళు గడిచినా తరగని వన్నె తగ్గని ఒక సాంగత్యం, అనుబందాన్ని . తప్పక విప్పి చెపుతాయి. అతని భార్య..  లక్ష్మి పాత్రలో.. జయసుధ పాత్ర పోషణకే ...వన్నె తెచ్చేవిధంగా  వ్రాసిన మాటలు.. నాకు.. చాలా.. బాగా నచ్చుతాయి.  తనని వివాహమాడి ఒక బిడ్డ ఉండగా కూడా.. తనని, తన బిడ్డని నిర్లక్ష్యం చేసి..పర స్త్రీ ఆకర్షణలో.. ఇల్లు.. పరువు ప్రతిష్టలు ,ఆస్తులు..అన్నీ వదిలేసి వెళ్ళిన భర్త ని నిందించకుండా అందుకు కూడా.. తనే కారణం అని నిందించు కుంటుంది.ఒక సామాన్య  స్త్రీగా  భావించుకుని  జీవితాన్ని  రాజీ  మార్గంలో నడిపించుకుంటుంది . అందుకే   భర్త ఆమెని  క్షమాపణ కోరినప్పుడు.. " నేను భార్యగా..  మీ మనసు తెలుసుకుని మిమ్మల్ని సుఖ పెట్టలేకపోయాను.అందుకే మీరు.. ఆమెని కోరుకున్నారు  .. తప్పంతా..నాదే.." అంటూ.. నెపం ని తన మీద వేసుకుంటుంది.".. అలా ఎందుకు..ఆమెని ఆమే తక్కువ   చేసుకునే..విధంగా  అలాంటి సంభాషణలు పెట్టారు?  అని దాసరి గారిని అవకాశం లభిస్తే  ఎప్పుడైనా సరే.. అడగాలనుకునే దాన్ని.. అది పాత్ర  ఔచిత్యమని.. క్రమేపి సినిమాని అనేక సార్లు  చూసినప్పుడు అర్ధమైంది .  సహజంగా.. జయసుధ పాత్రని తీర్చి దిద్దిన ..దాసరికి.. హాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేము .



అలాగే జయప్రద  పాత్ర..  అర్ధం కావాలంటే.. ప్లేటోనిక్ లవ్.. గురించి తెలిసి ఉండాలి.  శారీరక సంబంధంయొక్క  ప్రమేయం లేకుండా.. ఒక కళ కో.. అభిరుచి కో.. భావసామీప్యం  ఉన్నందుకో.. ఇద్హరు వ్యక్తులు.. అది స్త్రీ -పురుషులు  కలసి జీవించడాన్ని సమాజం సరిగా అర్ధం చేసుకోదు.   అ..పోకడల్ని గమనించే.. దాసరి అ.. కధ లో.. చక్కని ముగింపు ఇచ్చారు. రవీంద్ర బాబు.. మళ్ళీ ఆమె దగ్గరకు.. వెళ్లి పోవాలనుకోవడం .. ఆమెనే కలవరిస్తూ.. ప్రాణాలు విడువడం.. పద్మకి..ఆ వార్త తెలియజేయడానికి.. వెళ్ళినప్పుడు..  రవీంద్రబాబు బావమరిదీ ఆమెని అమ్మా! ..అని సంభోదిస్తూ ..పిలవడం అ.. పాత్ర పై పెరిగిన గౌరవం అని  మనకి చెపుతుంది   రవీంద్ర బాబు మరణించాక  అది తెలియక ముందే..ఆమె మరణించడం..  శరీరాలు వేరే..కానీ.. ఆత్మ ఒక్కటే..  వారి ఆత్మలు కూడా.. కలిసాయి  అని చెప్పడం...ఎంత సహజాతిసహజంగా  ఒదిగిపోయింది . చివరి వరకు.. జయసుధ  పాత్ర పై ప్రేక్షకుడికి..సానుభూతి ఎక్కువ. ఆ.. సానుభూతి చెరిపేసి .. కళకి.. కళా హృదయాలకి  పట్టం కట్టారు దాసరి.
ఈ  చిత్రంలో.. నా.. అభిమాన పాత్ర.. జయసుధ. .. ఒక వాస్తవాన్ని.. ఎంత హుందాగా.. అంగీకరించి తన జీవితాన్ని కాల్చుకుని మరీ  భర్త మార్గాన్ని  సుగమం  చేసింది. కొన్ని వాస్తవాలని  గ్రహించి.. అందుకు అనుగుణం గా నడుచుకోవడం వల్ల  వేదనలు... ఉన్నా.. ఎవరో ఒకరు.. ఆనందంగా ఉంటె చాలు కదా! అని తలపోసింది. అందుకు తగినట్లుగానే ప్రవర్తించింది. ఈ..సినిమా గురించి.. మా ఫ్రెండ్స్  మద్య ఎప్పుడూ.. చర్చ నడుస్తూ ఉంటుంది . .ఎప్పుడూ.. నేను ఆ విషయమే  చెపుతాను.

ఈ.. చిత్రంలో.. అన్ని పాటలు..  అయిదు స్టార్ ..కోవ లోకే! అయినా.. నా ఫేవరేట్ "ముందు తెలిసినా ప్రభూ, ఆకాశ దేశాన .." అయితే   శీత వేళ కానీయకు కానీయకు..శిశిరానికి చోటీయకు ..అనే పాట మనకి చిత్రం లో..కనబడదు. ఇదండీ .. ఈ.. చిత్ర కధ లో.. నాకు నచ్చిన  అంశాలు. అందరు చూసిన చిత్రమే కావచ్చు .  ఎందుకో.. నాకు ఈ చిత్రం అంటే.. చాలా ఇష్టం. ఇలా.. మీతో..పంచుకోవాలనిపించి.. చెపుతున్నాను. చూసి చాలా కాలం అయింది. కధక్రమం తప్పిందేమో..కూడా! పాత్రలైతే  అలా నిలిచిపోయాయి.  పాత్రల స్వభావం చెప్పాను.. ప్రేమ ఎందుకు.. ఎప్పుడు   పుట్టకూడదో.. ఆలోచిస్తాను  అప్పుడప్పుడు.. ఇలా.. గే.. కాకుండా..   ముందు తెలిసినా  ప్రభూ .. పాటపై అమిత ఇష్టంతో .. దేవులపల్లి ని  గుర్తు చేసుకుంటూ..  కూడా ! ఎవరైనా.. మిత్రులు.. ఈ.. చిత్రం గురించి  చర్చించదల్చుకుంటే .. ఆహ్వానం. 

4, మే 2011, బుధవారం

వినడానికి మీకు దమ్ముందా?

అమ్మో.. ఎండలు.. విజయవాడని ముందు విజయవాటిక అని, బెజవాడ అని.. ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయో.. కానీ ఇప్పుడు మాత్రం.. బ్లేజ్ వాడ..సరి అయిన పదమండీ! సల సల మరిగే నూనెలో..వడల్లా.. వేగిపోతున్నాము.  వైశాఖం వచ్చింది..వేసవి సెలవలకి.. పిల్లలు ఇళ్ళల్లో  ఉండి ఒకటే అల్లరి.. అంతే..సందడి. పెళ్ళిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు.. అన్నీఒకసారే! పిలుపులు అందరివి అందుకుంటూ ఉన్నాం.. ఎవరి ఇళ్ళకి వెళ్లాలబ్బా.! ప్రయాణాలు.. ఎలా చేయాలబ్బా!? అని ఏకధాటిగా మాట్లాడేసిన.. మా పోరుగావిడ మాటలని విని.. స్వయంగా..రోజూ చూస్తూ.. ఈమె కనుక రేడియో..ఎఫ్ ఎమ్ లో తాత్కాలిక ఆర్.జే. ఉద్యోగం కోసం అప్లై చేసిందా!? ..తప్పకుండా సెలెక్ట్ అవుతుంది అనుకుంటూ.. ఉంటాను.

నిమిషానికి కనీసం 160 పదాల నిడివి గల మాటలు మాట్లాడగల్గితే.. చాలట. వీలైతే.. ఎంత వయ్యారంగా  మాట్లాడితే    అంత మంచిదట.  గొంతు ఓ..మోస్తరుగా ఉన్నా.. పర్లేదు.. వీలైనంతగా..మాటలు మింగేసి.. ముక్కలు ముక్కలు చేసేసి.. ఒక వంతు తెలుగు మూడు వంతులు.. ఇంగ్లీషు.. కలిపి మాట్లాడే వారికి మరింత ప్రాధాన్యం  ఏమో!   వింటుంటే.. చెవుల్లో.. సీసం పోసినట్లు ఉంటుంది. మన మాతృ  భాషని  ఖూనీ చేసి  మాట్లాడే..వారికి..  అలామాట్లాడటం రానివారికి  శిక్షణ ఇచ్చి మరీ.. మన చెవిన రుద్దుతున్నారండి. వినలేక చస్తున్నాం.

మా చానల్ ముందు అంటే మా చానల్ ముందు అని..  ఎవరు ఎప్పుడు వస్తే ఎమిటంట.. ఎలా.. ఉన్నాం ఎలా ఇచ్చాం అన్నది లెక్క అని వాళ్ళే లెక్కలు వేసుకుని .. మేమే నెంబర్ వన్ ..  అని సొంత డబ్బాలు కొట్టుకోవడాలు.. ఎక్కువైపోయాయి. అసలు.. ఎప్పుడన్నా పబ్లిక్ లోకి వచ్చి.. మా కార్యక్తమాలు ఎలా ఉన్నాయి అని అడుగుతారేమో.. అని అనుకుంటూ..ఉంటాను..  అబ్బే!.. నేను.. ఏళ్ళ తరబడి. చెవులకి రేడియో కట్టుకుని వింటూ..ఉంటాను. గది గదికి ఒక రేడియో పెట్టుకుని ఎక్కడా మిస్  అవకుండా శ్రద్దగా  వినే నేను ఎప్పుడూ.... కార్యక్తమాలు.. బాగున్న.. బాగోక పోయినా.. ఉత్తరాలు ద్వారా అభిప్రాయం  చెప్పేదాని.. అవన్నీ.. చెత్త బుట్ట దాఖలా అయిన, అవుతున్న విషయం గ్రహించి..ఇక ఇప్పుడు  అభిప్రాయాలు వ్రాసి.. నా సమయం,వ్యయం, శ్రమ వీటన్నిటిని వృధా చేసుకోవడం ఇష్టం లేక ఇష్టమైతే వినడం లేకుంటే ఆఫ్ చేసుకోవడం ..అంతే!

స్థానిక సమాచారం ఎఫ్.ఎమ్ లు వచ్చాక బాగానే లభ్యమవుతుంది.. అంతా.. ఫ్రీ..ఫ్రీ.. ఫుడ్ కూపన్స్,మూవీ టికెట్స్..గిఫ్ట్..లు.. ఎన్నెన్నో! శ్రోతలకి.. వినోదం తో..పాటు..ఇవన్నీ  లభ్యమవుతుంటే.. వినక చస్తారా!?  మూడు రూపాయలు ఖర్చు  పెట్టి మరీ.. పోటీలు పడి మరీ వాళ్ళు వేసే వెర్రి మొర్రి ప్రశ్నలకి.. చాయిస్ ఆన్సర్ లు వినేసి  సమాధానాలు పంపుతూ.. విషెస్ చెపుతూ, సాంగ్స్ డెడికేషన్ చేసుకుంటూ..యువత  పంపే ఎస్ ఎమ్ ఎస్ లు..విలువ? అమ్మో..లెక్క కడితే.. తల్లిదండ్రులకి  నెత్తిమీద తాటికాయ పడినట్లు ఉంటుంది.

పేరు వినబడటం కోసం.. ప్రేమికులకి..సమాచారం అందిచుకోవడం.. ప్రేమలని.. పెంచి పోషించుకోవడం.. అన్ని.. ఎఫ్.ఎమ్ ల లో.. సర్వసాధారణం అయిపోయాయి.  విజ్ఞానమా.. వినోదమా!. కుర్ర ఆర్. జే ల కి.. ఇప్పటి పాటలు తప్ప పాత పాటలు.. తెలియవు.. ఒక వేళ వివరాలు చెప్పి అడిగినా..అబ్బే.. లేదండీ.. నా షో లో..ఇలాటి పాటలా? నా ఇమేజ్  పోతుందండీ..ఇప్పుడంతా..రాక్.. అండీ..మీరు కూడా కాలం తో మారాలి అని మన ఫోన్ బిల్లుతో.. మనకే సుద్దులు చెపుతారు..నిద్ర లేచిన దగ్గర నుండి.. ఉచ్చారణా దోషాలు వినలేక చస్తున్నాం.. ఎప్పుడూ.. వింటూనే ఉన్నాం .. ఉల్లాసంగా..ఉత్సహంగా ఉంటున్నాం (?)  అదరగొట్టేస్తాం అంటారు? వినడానికి మీకు దమ్ముందా? అని సవాల్ విసురుతారు.. పాట ప్లే చేసే దమ్ము వాళ్ళ దగ్గర లేకపోయినా..సరే.!

జీవితం రంగుల మయం ఒక్కటే.. కాస్త బెటర్.. అనుకుంటే.. అక్కడా ముక్కల పాటలు. పదాల విరుగుళ్ళు.. వయ్యారాలు.. గుటకలు.. అమ్మో.. రేడియో.. వినడమా!? మా బెజవాడ ఎండల్లో..నే తిరగడం ఎంత హాయి..ఈ..పగలు.. ఎంత వేడిమి అయినా..ఎఫ్.ఎమ్..  ఆర్ .జే.. నవ్వినా.. మాట్లాడిన దాని కంటే కూడా..ఎంత హాయి.. అని.. పేరడీ..పాట పాడుకుంటూ..( సాయంత్రం  ఏ ఆర్ జే.. నో.. ఈ పోస్ట్ చూసి ఈ.. పాట కి ఒరిజినల్ పాట ఏమిటండీ..అని అడిగినా.. ఆశ్చర్యపోను అని మనవి చేస్తూ..) రోత పుట్టిస్తున్న ఆర్.జే ల మాటల తీరుకి వగచి.. నా.. ఈ.. మాట.  అధికార గణం  కానీ.. యాజమాన్యాలు  కానీ.. ఎప్పుడైనా  ప్రజానీకాన్నిఅడుగుతున్నారా?  సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళని శ్రోతలగా.. మార్చి.. లైవ్ లో.. డబ్బా కొట్టించుకుని  నా బోటి శ్రోతలకి.. మేమే సరిగ్గా వినడం లేదు కాబోలు .. కార్యక్రమాలన్నీ.. బాగుంటున్నాయి అన్న మాట అనుకునేలా.. ఎందుకైనా మంచిది..జాగ్రత్తండీ!  .. చెవిలో.. క్యాబేజీ పెట్టి..బిరడా కొట్టినట్లు..తీరున.. వినిపిస్తున్నారు. అమ్మో!! ఎఫ్.ఎమ్..!!??  వద్దు బాబూ!

3, మే 2011, మంగళవారం

బాలచందర్ కోకిలమ్మ



అభిమానుల మనసులో ఉన్నఅభిమానమే..కళాకారులకి నిజమైన అవార్డులు-రివార్డులు...అని వేరే చెప్పక్కరలేకపోయినా..ఆయా రంగాలలో.. వారి ప్రతిభకి..తగిన విధంగా పురస్కారాన్ని ఇచ్చి..గౌరవించుకోవడం..సముచితం అనిపించుకుంటుంది.. చాలా ఆలస్యంగా.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లభించిన కె.బాలచందర్ గారి..ని అభిమానించని..భారతీయుడు.. ఉండరేమో!
ప్రతిభకి గుర్తింపుగా  పురస్కారాలు లబించగానే.. తాము ఎంతో అభిమానించే..సాటిలేని మేటి వెలుగుల తారలకి  ఇన్నాళ్ళకు లభించిన పురస్కారానికి ..ఆనందం వెల్లువై ప్రవహిస్తూ.. అభిమానులు వారి ప్రతిభాపాటవాలని గుర్తుకు తెచ్చుకుంటారు.
  

బాలచందర్  అనగానే..ఉత్తమ అభిరుచి కల దర్శకుడు,నిర్మాత, రచయిత.. ఇంత మంది గుర్తుకు వస్తారు.. దక్షిణాది రాష్ట్రాలలో దర్శక అగ్రగణ్యుడు. నాకెప్పుడూ ఆయన చిత్రాలలోని ప్రతి ప్రేమ్ కూడా  చిత్రం  చూసిన చాలా ఏళ్ళ  తర్వాత కూడా .. ఆలోచింప జేస్తుంది.

.ఆయన చిత్రాలలోని  చాలా దృశ్యాలు..చాలా సహజంగా.. సాదాసీదాగా ఉంటాయి.. ఒక సందేశాన్ని.. ఆయన చిత్రాలలో.. సూటిగా చెప్పడాన్ని ఆశించలేం.. కేవలం దృశ్యాల  ద్వారానే, ఎక్కువ మాటలు లేకుండా సగటు ప్రేక్షకుడిని ఆలోచింప జేస్తూ కధను.. ముందుకు.. తీసుకు వెళతారు.. చెప్పాల్సింది.. మనకి అర్ధమైపోతుంది.. అలా.. నాకు అనిపించిన  చిత్రం.." కోకిలమ్మ"  ఆ చిత్రం నాకు ఎంత బాగా నచ్చిందో..! 1983  లో    ఆయనకీ  బెస్ట్ స్క్రీన్ ప్లే  చేసినందుకు గాను  ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డ్ ని అందుకున్నారు.


ఈ చిత్రం లో "సరిత" కోకిలమ్మగా.. ఎంత మంచి నటనను ప్రదర్శించారో! ఎవరు తోడు లేని ఒక పేద చెవిటి అమ్మాయి.. పదిళ్ళల్లో..  పనులు చేసుకుంటూ..వినబడకపోయినా.. తనని తిడుతూ ఉంటారని తెలిసి కూడా.. అందరి తిట్లుని.. భరిస్తూ..  అరవ చాకిరి  చేస్తూ.. జీవనం సాగిస్తూ..ఉంటుంది. తమ మధ్యే ఉంటూ బాగా చదువుకుని ఉద్యోగం దొరకక  బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉండే.. రాజీవ్ తో పరిచయం..తో..ఆమె జీవితం మలుపు తిరుగుతుంది.

అతనిపై.. ఆకర్షణ లేదా ప్రేమ కన్నా కూడా..సానుభూతితో.. అతనితో..పరిచయం పెంచుకుంటుంది.  అతనికి సంగీతం పట్ల ఉన్నఆసక్తి గమనించి.. అతని కి..సంగీతం నేర్పించడానికి.. ఎంతో.. శ్రమిస్తుంది. సంగీతం నేర్చుకుని ఒక స్థాయికి చేరుకునేవరకు "కోకిలమ్మ" ని.. ప్రేమగా.. తనపట్ల కరుణ చూపిన దేవతలా భావించిన అతను..కొంత గుర్తింపు రాగానే.. డబ్బు అందం, కీర్తి ప్రతిష్టల మోహంలో..ఆమెను నిర్లక్ష్యం చేయడం..ఆమె తనకి తగినది కాదుగా భావించి..మొహం చాటేయడం.. నిగ్గదీసి అడిగినప్పుడు.. మంచి సంబంధం చూసి వేరొకరితో.. ఆమెకి ..పెళ్లి చేసి.. ఋణం తీర్చుకోవాలనుకోవడం అంతా.. మధ్యతరగతి మనస్తత్వాల అవకాశవాదాన్ని  ఎంత బాగా..సహజంగా.. చూపించారో!


అలాగే పని పాటలు చేసుకునే చదువు కోని . .పేద పిల్ల ఆత్మాభిమానాన్ని..ఎంత గొప్పగా చెప్పారో! ముఖ్యంగా  సంగీతం నేర్పించడానికి గురువు  ఉచితంగా చెప్పడం మాని..ఎక్కువ డబ్బు అడిగాడని మనం  తప్పుగా అనుకుంటాం. కానీ.. సంగీతం నేర్వటానికి  తగిన శ్రద్ధ, అర్హత అతనికి.. ఉన్నాయో..లేదో.. తెలుసుకోవడానికి.. ఒక పరీక్ష అని మనం అనుకోం..కానీ.. అతనిలో.. ఉన్న ఆసక్తిని.. గుర్తించి.. మంచి.. గాయకుడిగా తీర్చి దిద్దటం లో.. గురువు  శిష్యుడులో ఏమి అర్హతలు చూస్తాడో.. అన్నది.. తర్వాతగాని మనకి అవగతమవదు. అలాగే..  డబ్బు అవసరంలో..లారీ డ్రైవర్ దగ్గరకి  పనికి వెళ్ళినప్పుడు.. అతని..అంతరంగం గ్రహించి.. వాడిని ధైర్యంగా కొట్టి బయట పడిన ధైర్యం.. ఈ నాటి అబల లకి  ఏనాటికైనా కావాల్సిన లక్షణం. ఆపదలు ఎదురైనప్పుడు భయంతో.. వణకకుండా..తిరగబడి కొట్టడం  అనేది ఎంత సహజంగా రావాలి.


అలాగే.. ప్రేమించినవాడి  అవకాశవాదం అర్ధం చేసుకున్న  కోకిలమ్మ అతని మాటలు విన్నప్పుడు కల్గిన బాధని  జీర్ణించుకోలేక అతను కొనిచ్చిన వినికిడి యంత్రాన్ని సముద్రంలోకి విసిరివేసిన ఆవేదనా భరితమైన దృశ్యం ఎవరూ మర్చిపోలేరు. తనకి చిన్నపాటి పరిచయం ఉన్న అంగవైకల్యం ఉన్న పేదరాలు భర్త చనిపోయి బిడ్డతో..ఒంటరిగా.. భర్త చేసిన పనినే.. సినిమా వాల్పోస్ట్ లు అంటించడాన్ని  కష్టంగా ఒంటిచేత్తో చేస్తూ  కనబడినప్పుడు ఆమె  చేయి అందుకుని ఆమెకి తోడుగా నిలవడాన్ని ఎంత ఉదాత్తంగా చూపించారో..!

ఊరికి దూరంగా కొండపైన వాల్  పోస్ట్ లు  అంటించడానికి వెళుతున్నప్పుడు..కారు చెడిపోయి అవస్తపడుతున్న అతనికి..సాయం చేయమంటారా అని అడగటంలో ఉన్న అంతర్లీనంని.. అతను చెపుతున్నవేమి.. వినబడటం లేదన్న ఆమె మునుపటి రీతిని.. అర్ధం చేసుకుంటే ఆమెని, ఆమె కష్టాన్ని, ప్రేమని, నమ్మకాన్ని సోఫానాలుగా మార్చుకున్నఅతని తీరు ఎంత సిగ్గుచేటు. చదువుకుని అవకాశవాదంతో ఇతరులని ఉపయోగించుకునే నయవంచకులకన్నా   ఆత్మాభిమానంతో బ్రతుకుతూ పేదరికంలో కూడా ఇతరులకి అండగా నిలిచే దృడచిత్తమైన, ఉదాత్తమైన మనసు కల్గిన స్త్రీ మూర్తిగా.. కోకిలమ్మ పాత్ర  నాకు బాగా నచ్చుతుంది.


అలాగే ఒక సందేశం కూడా ఉంటుంది.. కష్టపడి ఉన్నత విలువతో బ్రతికేవాళ్ళు..ఎప్పుడూ.. ఉన్నతంగానే ఉంటారన్న దానికి సింబాలిక్ గా  కోకిలమ్మ కొండపైన ..వాల్పోస్ట్ లు అతికిస్తూ.. ఉంటుంది. హీరో రాజీవ్ మాత్రం  డబ్బు, అంతస్తు కీర్తిప్రతిష్టలు అన్ని సంపాదించి  కారులో ప్రయాణిస్తూ కిందికి వెళుతూ ఉంటాడు. మనిషిగా పతనమై కిందికి జారిపోతున్నట్లు ఆ..దృశ్యం  ఎంత బాగా గుర్తుకు వస్తుందో నాకు.

ఇక పాటలు విషయానికి వస్తే.. ఎమ్.ఎస్.విశ్వనాథన్ + ఆత్రేయ  మేలుకలయికలో.. బాలచందర్ గారి చిత్రాలలో.. ఎన్నో.. మంచి పాటలు. అంతులేనికధ, ఇది కథ కాదు, అందమైన అనుభవం, గుప్పెడుమనసు, తోలికొడికూసింది.. ఇలా చాలా చిత్రాలు. అన్ని సూపర్ హిట్..సాంగ్స్. ఈ చిత్రం లో..పాటలు అంతే! పల్లవించవా నా గొంతులో,ఎవ్వరో పాడారు భూపాలరాగం, నీలో..వలపుల సుగంధం,కొమ్మ మీద కోయిలమ్మ.. పోతే పోనీ.. అనే పాటలే కాకుండా  ఈ పాట శ్రీ వాణి (మధురం మధురం ) కూడా  చాలా మంచి పాట. సాహిత్యపరంగా.. మంచి పాట. నాకిష్టమైన పాట మీరు.. వినండి..

ఈ..చిత్రం చూసి చాలా ఏళ్ళు గడిచాయి.. అందుకే .. చిత్రంలో.. హీరో.. పేరు గుర్తు లేదు. చంద్రునికి..ఓ.. నూలు పోగులా.. బాలచందర్ గారి పై  అభిమానంతో.. ఈ.. కోకిలమ్మ చిత్రాన్ని..గుర్తుకు తెచ్చుకుని.. నాకు నచ్చిన అంశాన్ని వెల్లడించే ప్రయత్నం చేసాను. ఏదైనా తప్పులు ఉంటే మన్నిచండి.  మరొకసారి.. ఇంకో పాత్ర..గురించి..ముచ్చటించుకుందాం..బై ఫ్రెండ్స్..     

1, మే 2011, ఆదివారం

రోజూ ఈ సమయానికి కరంట్ పోవాలి

ఆదివారం వచ్చిందంటే.. నాకు పండగే..! కొంచెం పనులు లేట్ గా చేసుకోవచ్చు... ఇలా.. నెట్ లో.. తలదూర్చవచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.. lumosity  లో మెదడుకు పదును పెట్టుకుంటూ.. కొంచెం చురుకు పెంచుకునే ప్రయత్నం చెయ్యవచ్చు.. ఇలా.. యోచిస్తూ..ఉంటాను..సమయం మన చేతుల్లో ఉంటుందా ఏమిటి..? మన సమయాన్ని దోచేయడానికి ఎవరో.. దొంగలా.. కాచుకు కూర్చునే  ఉంటారు...అనుకున్నవన్నీ చేయకుండానే ఆదివారం అయిపోయింది. సాయంత్రం  ఒక ముఖ్య మైన కార్యక్రమంని  రద్దు చేసుకుని ఇంట్లో ఉండాల్సి వచ్చింది. కొంచెం నలతగా ఉన్నా నాకిష్టమైన వ్యాపకం + భాద్యత రెండు నేరవేర్చుకోవాలనుకుంటే.. ఒక బంధువు వస్తానని కాల్ చేసి చెప్పి  మరీ.. రాకుండా .. నా పనులని అస్తవ్యస్తం చేసినందులకు కోపం తో..ఉన్నాను. సరే ఒక టపా పడేద్దామని..

 ఇదిగో.. ఇలా.. మొదలెట్టనా..!? పవర్ కట్.. ఇంట్లో ఉండలేక పుట్టలోని పాముల్లా.. బిల్డింగ్లో ఉంటున్న అందరూ.. ఒక్కొక్కరే బయటకి..వస్తున్నారు. నేను నిశ్శబ్దం భరించడం నా వల్లకానట్లు.. బేటరీ రేడియో  పెట్టాను.అందరూ వచ్చేసి మాట మాట కలుపుకుంటున్నారు. మాటలు ఇలాటప్పుడే బాగా కలుస్తాయి..వరండాలో.. కుర్చీలు వేసి కొందరికి.. చల్లగా కింద కొందరికి ఆశీనాలు ఏర్పాటు చేసి .. మాటలు మొదలెట్టాం. ఒకటే నవ్వులపువ్వులు.. ప్రపంచ నవ్వుల దినోత్శవం ..అని కాదులెండి. ఎప్పుడూ..అంతే..! పగలు సమయాలు  అయితే..ఇలాటప్పుడు.. నా కొడుకు.. అందరిని పోగేసి  పెద్దపచ్చీసు గళ్ళు కట్టి  నా ఊపిరి తీసి మరీ ఆట ఆడేవాడు .. గవ్వలతో.. పందేలు వేసి..అందరిని ఓడకోట్టేవాడు. ఆ హంగామా గుర్తుకు వచ్చింది. అప్పుడు  నేను అనుకుంటూ ఉండేదాన్ని..పర్వాలేదు.. ఇంకా మానవ సంబంధాలు ఇక్కడ బాగానే ఉన్నాయి..అని. ..

 నగరం వచ్చి మా పల్లెలో.. కలిసినా.. పల్లె పట్టణ కలబోత  తో.. మా కాలని చాలా బాగుంటుంది.. అనుకుంటాను నేను.. అందరు అలా అనుకునే ఇటు వచ్చేసి బోలెడంత డిమాండ్ వచ్చేసి..అద్దెలు ఆకాశం అంటుతున్నాయి.. అని తిట్టుకుంటూ ఉంటాం లెండి మా హౌస్ ఓనర్  వినకుండా..

అసలు మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో.. నేను చాల బిజీగా ఉండేదాన్ని.. ఎవరితోనూ  పెద్దగా పరిచయం లేక కలవలేక పోయేదాన్ని. ఒక సంవత్సరం వరకు  అసలు.. ఈ బిల్డింగ్లో.. ఎన్ని వాటాలు ఉన్నాయి ఎవరెవరు ఉంటున్నారు.. ఏమిటో ..ఏమి.. తెలిసేది కాదు.. నేను ఎవరితోనో.. ఇలా చెపుతున్నప్పుడు నాకే  సిగ్గేసింది. మనం ఏమిటో.. తెలియాలంటే .. మన ఇరుగు పొరుగు తో.. ఉన్న సంబంధ బాంధవ్యాలు  చెపుతాయి..అంటాను..నేను.

మనిషి  సంఘ జీవి.ఇప్పుడైతే.. అంతర్ముఖి. ఎవరికి నచ్చిన ప్రపంచం వారిది. ప్రక్కవాళ్ళతో మాట్లాడటం అంటే పరమ బోర్. అవి  కాలక్షేపపు  బటాణి కబుర్లు.. భూతద్దం తో.. వెదికినా మనఃస్పూర్తిగా మాట్లాడే వారు లేరు.  నోటితో మాట్లాడతాలు.. నొసలు విరవడాలు.. మనం వెళ్ళగానే ప్రక్కనున్న ఇంకొకరితో మన గురించి మాట్లాడటాలు..  అంతస్తులు బేరీజు వేయడాలు.. ఇవన్నీ ఉంటాయనే వాటితో పాటు  నాకు నిజంగా తీరిక లేకపోవడం కూడాతో.. నేను.. ఎవరితో.. మాట్లాడేదాన్ని కాదు.  కాదు.. ఒక సంఘటన తర్వాత నేను మారిపోయాను. ఆ సంఘటన ఏమిటంటే.

 ఒకసారి మా ఎక్సరే  నెల నెలా వెన్నెల లో.. "మానవసంబంధాలు" అనే అంశం ని.. సూచించాను..ఆ.. అంశం గురించి మాట్లాడేటప్పుడు " మా పక్కింటావిడ కి నాకు చెత్త సంబంధం " అన్నాను. అందరూ..ఆశ్చర్యంగా చూసారు.. నిజమే! నేను చెప్పింది ..అన్నాను.. వివరణ ఇస్తూ.. నిజమే.. దాదాపు పక్క పక్కనే సంవత్సరం బట్టి ప్రక్కప్రక్క ఇళ్ళలో.. ఉంటున్నాం. కనీసం నేను పలకరింపుగా నవ్వినా ఆవిడ నవ్వదు.ఇంకా నేను ఆమెతో  ఏమి మాట్లాడను..? కానీ.. రోజూ మాత్రం ఆవిడకి నాకు ఒక సంబంధం .. అదీ.. చెత్త సంబంధం. అంటే.. మా ఇంట్లో చెత్తని నేను ఆవిడ ఇంట్లో చెత్తని ఆవిడ కలసి..  ఇద్దరం ఇద్దరికీ మద్యన ఉన్న స్థలంలో.. ఒకసారి వేస్తూ.. ముఖ ముఖాలు.. చూసుకుంటాం ..అంతే! అన్నాను. అన్న తర్వాత కానీ.. నాకు మా బిల్డింగ్ లో..ఉన్న ఎవరితో.. నేను మాట్లాడనని.. హటాత్తుగా గుర్తుకొచ్చింది. అంతే.. అప్పటి నుండి.. కొద్ది కొద్దిగా అందరిని పరిచయం చేసుకుని మాట్లాడుతున్నాను.. "ఏకాకి కాకుండా.. కాకుల కులం  అని  అయినా అనిపించుకోవాలని"..అన్నమాట. .

ఇప్పుడు.. అందరూ.. ఏ అవసరం వచ్చినా.. అక్కా.. అంటూ.. కొందఱు.. మేడం ..అంటూ కొందఱు .. ఆంటీ.. అంటూ కొందఱు నన్నే పలవరిస్తారు..కలవరిస్తారు. నీళ్ళు అయిపోయాయి మోటార్ వెయ్యమనో.. బయటికి వెళుతున్నాం ..మా వాళ్ళు వస్తే.. తాళాలు ఇవ్వమనో.. లేట్ అవుతుంది గేటు తాళాలు వెయ్యకండి అనో.. సిలిండర్ వేయించుకోండి కొద్దిగా ..అంటూ.. ఇలా.. అన్నమాట.మా ఇంటి ఓనర్ గారి కన్నా నేనే ముఖ్యం అందరికి..ఆఖరికి కోత్త వాళ్ళు ఎవరైనా వస్తే.. నేనే ఇంటి యజమాని అనుకుని నాకే చెబుతూ ఉంటారు.. అయ్యబాబోయ్! ఆవిడ వింటే ఎక్కడ ఫీల్ అవుతారో అని నాకు..బెంగ. వెంటనే.. నేను కాదండీ.. ఇంటి యజమాని ఆవిడే నండీ..అంటూ..సరిదిద్దే ప్రయత్నం చేస్తాను. .ఆవిడ మాత్రం  చాలా గొప్పగా.. ఇంట్లో ఉన్న వాళ్ళందరు  ఇంటి యజమానులే లెండి..అంటారు. అంతే కాదు. కాయగూరలు.. పళ్ళు.. ఏవి అమ్మేవాళ్ళు వచ్చినా.. చక్కగా బేరం ఆడి అందరిని  గొంతు పోయేటట్లు కేకలు పెట్టి మరీ కొనుక్కోమంటారు. ఎవరు చెబుతారు చెప్పండి అలా.. ఒకటి మాత్రం చెప్పడం మరచాను.. మా మూడో అంతస్తు లో.. ఉన్న ఒకావిడ నన్ను   ఆంటీ..అంటుంటే కోపం వచ్చేది. ముఖానే  చెప్పేసాను.. మీ పిల్లలకి ఆంటీ ని కానీ.. మీకు కాదు  అని. ఎందుకంటే ఆమె పిల్లలు.. ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువు  చదువుతున్నారు కాబట్టి. అది తప్ప ఎలాటి రిమార్కులు లేని  అందమైన ఇరుగు పొరుగు సంబంధ బాంధవ్యాలు మావి. కాఫీలు.. టీలు .. కూరలు..ఇచ్చిపుచ్చుకుంటూ.. ఏ.టి.ఏం కెళ్ళి డబ్బు తెచ్చుకున్నంత ఈజీగా అప్పు పుట్టించుకుంటూ .. రోగం, నొప్పి వస్తే.. ఓదార్పుగా పలకరించుకుంటూ..  హాయిగా ఉంటున్నాం. రేపు మా ఇంటి ఎదురుగా రెండు కుటుంబాలు ఉన్నాయి.. వాళ్ళు అసలు.. పలకరు.. అంటే వాళ్ళు మమ్మల్ని వెలివేశారు..అన్నమాట. రేపు వాళ్ళని కాఫీకి పిలవాలి. అన్నాను.. (nescafe ప్రకటన  చూశానులెండి. అది నాకు బాగా నచ్చింది.)  అందరూ ..అలాగే..అన్నారు. ఇక నేను చెప్పేదేమిటంటే ..


మన చుట్టూ ఉన్న ప్రపంచంలో..ఉన్న వారిని అంటరాని వారిగా  చూస్తూ.. ఎక్కడెక్కడో.. ఉన్న వారితో.. మొబైల్ చాటింగ్, నెట్ చాటింగ్ చేస్తూ.. కొత్తవారితో.. స్నేహాలు చేసినంతగా  అంత ఈజీగా ..మన ఇరుగు పొరుగు లతో.. మనం స్నేహం గా ఉండలేక పోతున్నాం. అకారణ ఈర్ష్యాద్వేషాలు.. అంతస్తుల బేరీజులు..మనుషులని విడగొడుతున్నాయి. మన ప్రక్కవారితో.. హృదయపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు అందరూ.. మనవారే.. అంటాను నేను. పడమటింట్లో.. సాయంసమయం దీపం పెట్టి "ఇరుగు చల్లన పొరుగు చల్లన " అనుకోవడం అంటే ఇలా.. ఉండటం అని..అనుకుంటూ.. ఉండగానే.. దీపాలు వెలిగాయి.. మెల్లగా.. ఎవరి వాటాల్లోకి వాళ్ళు.. ఎవరి మనసుల్లోకి వాళ్ళు.. రేపు సోమవారం ఎవరి పనుల్లోకి వాళ్ళు. నాకైతే.. రోజూ.. ఈ.. సమయానికి.. కరంట్ పోవాలి ..అనిపించింది.