నేను నిన్ను లెక్కలేనన్ని రూపాల్లో, లెక్కలేనన్ని సార్లు ప్రేమించినట్లుంది... జన్మ జన్మల్లో, యుగయుగాల్లో, శాశ్వతంగా. మాయలో పడిన నా హృదయం పాటల హారాన్ని అల్లింది, మళ్ళీ అల్లింది. దాన్ని నువ్వు ఒక కానుకగా తీసుకుని, నీ అనేక రూపాల్లో మెడలో ధరించుకుంటావు, జన్మ జన్మల్లో, యుగయుగాల్లో, శాశ్వతంగా. నేను పాత ప్రేమ గాథలు విన్నప్పుడల్లా, అది యుగాల నాటి వేదన, అది కలిసి ఉండటానికో లేదా విడిపోవడానికో సంబంధించిన పురాతన గాథ. నేను గతాన్ని అలా చూస్తూ ఉండిపోతుండగా, చివరికి నువ్వు ఉద్భవిస్తావు, కాలపు చీకటిని చీల్చే ధ్రువ నక్షత్రపు కాంతిలో: నువ్వు శాశ్వతంగా గుర్తుండిపోయే ఒక ప్రతిబింబంగా మారతావు. నువ్వు నేను, ఊట నుండి ప్రవహించే ఈ సెలయేటిపై ఇక్కడ తేలియాడాం. కాలపు హృదయంలో, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ. మనం లక్షలాది ప్రేమికులతో కలిసి ఆడుకున్నాం, కలిసినప్పుడు ఉండే అదే సిగ్గుతో కూడిన మాధుర్యాన్ని, వీడ్కోలు పలికేటప్పుడు ఉండే అదే బాధాకరమైన కన్నీళ్లను పంచుకున్నాం. - పాత ప్రేమే అయినా, ఎప్పటికీ కొత్త కొత్త రూపాల్లో. ఈనాడు అది నీ పాదాల చెంత పోగుపడింది, నీలోనే దాని అంతాన్ని కనుగొంది. గడిచిపోయిన, శాశ్వతమైన సమస్త మానవాళి దినాల ప్రేమ: సార్వత్రిక ఆనందం, సార్వత్రిక దుఃఖం, సార్వత్రిక జీవం. సమస్త ప్రేమల స్మృతులు మన ఈ ఒక్క ప్రేమతో విలీనమవుతున్నాయి – మరియు గడిచిపోయిన, శాశ్వతమైన ప్రతి కవి గీతాలు.
ఇజాజత్ సినిమా ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ చిత్రం సుబోద్ ఘోష్ రచించిన “జాతుగృహ” అనే బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కింది. గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన సున్నితమైన ముక్కోణపు ప్రేమకథ చిత్రం. వర్తమానం ప్లాష్ బ్యాక్ ల మధ్య సినిమా నడుస్తుంది.
సంగీతం లో రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రం ఇది. ఆశా బోస్లే యొక్క ఆత్మను కదిలించే స్వరం “మేరా కుచ్ సామాన్” కి జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఉత్తమ సాహిత్యం అందించిన గీత రచయిత “గుల్జార్ “ కి మొదటిసారి జాతీయ అవార్డు లభించింది.
అనూరాధ పటేల్ పై చిత్రీకరించారు.
ఈ చిత్రంలో నాలుగు పాటలు ఆశాబోస్లే ఆలపించారు. “మేరా కుచ్ సామాన్” పాటకు కోట్లాదిమంది అభిమానులు వున్నారు. మన సమయంలో రెండు గంటల పదిహేడు నిమిషాలు ఈ సినిమా కోసం కేటాయించవచ్చు. రేఖ,నసీరుద్దీన్ షా అనూరాధ పటేల్ నటన బాగుంది. ముఖ్యంగా సుధ పాత్రలో రేఖ నటన మనసుకు హత్తుకుంటుంది. మేరా కుచ్ సామాన్ పాట సాహిత్యం మనసులను పట్టేస్తుంది. స్త్రీలు తమ మనసులో భావాలను బాధను వ్యక్తపరుచుకోవడానికి కవిత్వం ఉపకరిస్తుంది. గుల్జార్ కవిత్వం చాలా చాలా సున్నితమైన భావ ప్రకటన కల్గింది. ఈ పాట ఆశా బోస్లే పాటల బోషాణంలో అమూల్యమైన నిధి. మెత్తగా మంద్రంగా మనసును కోసేస్తుంది. ఆర్ డి బర్మన్ స్వరాలు వల్ల ఈ పాటకు ప్రాణం పోసింది అంటే అతిశయోక్తి కాదు. పాట వినండీ.. వింటూనే వుంటారు. పాటల పిచ్చి ఎక్కువగా ఉన్న వారిని వదలని పాట ఇది. 116 రాత్రులు పుట్టుమచ్చ, వర్షం, తడి హృదయం, వెన్నెల , గోరింటాకు వాసనలు.. ఇవన్నీ ముడిపడిన ప్రేమ సున్నితమైన వ్యక్తీకరణ మనసులను కదిలిస్తాయి.. ఇజాజత్ అంటే అనుమతి అని అర్ధం.
********************
मेरा कुछ सामान, तुम्हारे पास पड़ा है
सावन के कुछ भीगे-भीगे दिन रखे हैं
और मेरे एक ख़त में लिपटी रात पड़ी है
वो रात बुझा दो, मेरा वो सामान लौटा दो
Some of my things are still lying with you -
Some drenched monsoon days,
And a night wrapped in my one of my letters
Extinguish that night, and send these things back to me
నా వస్తువులు కొన్ని నీ దగ్గర ఉన్నాయి.
కొన్ని వర్షాకాలపు తడి రోజులు నీ దగ్గర ఉన్నాయి.
మరియు నా ఉత్తరాలలో ఒకదానిలో చుట్టబడిన ఒక రాత్రి.
ఆ రాత్రిని ఆర్పేసి, నా వస్తువులను తిరిగి ఇచ్చేయ్.
पतझड़ है कुछ, है ना?
पतझड़ में कुछ पत्तों के गिरने की आहट
कानों में एक बार पहन के लौटाई थी
पतझड़ की वोह शाख अभी तक काँप रही है
वो शाख गिरा दो, मेरा वो सामान लौटा दो
Remember, it was autumn....
In autumn, I gave you the sound of falling leaves,
After trying it on as earrings.
That branch from autumn is still trembling in winds
Make that branch fall, and send these things back to me
శరదృతువు అద్భుతం, కదూ?
శరదృతువులో ఆకులు రాలే శబ్దం
ఒకప్పుడు దాన్ని చెవుల్లో పెట్టుకుని తిరిగి ఇచ్చేశాను.
ఆ శరదృతువు కొమ్మ ఇంకా వణుకుతోంది.
ఆ కొమ్మను కింద పడేయండి, నా వస్తువులు నాకు తిరిగి ఇచ్చేయండి.
एक अकेली छतरी में जब आधे-आधे भीग रहे थे
आधे सूखे, आधे गीले, सूखा तो मैं ले आई थी
गीला मन शायद बिस्तर के पास पड़ा हो
वो भिजवा दो, मेरा वो सामान लौटा दो
Remember, once when we were both getting drenched,
since we were sharing one umbrella...
Half the things were drenched. The things that were still dry, I brought with me
But I think I left behind my rain-soaked heart beside the bed
Send that, along with the other things I've left behind.
మనమిద్దరం ఒకే గొడుగు కింద సగం తడిసిపోయినప్పుడు,
సగం పొడి, సగం తడి, నేను పొడి వాటిని తెచ్చాను.
తడి హృదయం మంచం పక్కన పడి ఉండవచ్చు.
దాన్ని పంపండి, నా వస్తువులను తిరిగి ఇవ్వండి.
एक सौ सोलह चाँद की रातें, एक तुम्हारे काँधे का तिल
गीली मेहँदी की खुशबू, झूठ-मूठ के शिकवे कुछ
झूठ-मूठ के वादे भी सब याद करा दूं
सब भिजवा दो, मेरा वो सामान लौटा दो
One hundred and sixteen nights of the moon, and that one mole on your shoulder
The scent of undried henna, and those moments of mock tantrums
Let me also remind you about all those false promises
Return everything that's mine, but still lying with you
నూట పదహారు వెన్నెల రాత్రులు, నీ భుజం మీద ఒక పుట్టుమచ్చ
తడి గోరింటాకు సువాసన, కొన్ని అబద్ధపు ఫిర్యాదులు
ఆ అబద్ధపు వాగ్దానాలన్నీ కూడా నీకు గుర్తు చేస్తాను
అన్నీ పంపించు, నా వస్తువులు తిరిగి ఇచ్చేయ్
एक इजाज़त दे दो बस, जब इनको दफ़नाऊगी
मैं भी वहीँ सो जाऊंगी,
मैं भी वहीँ सो जाऊंगी
Just grant me this one wish, that when I bury these things,
I will also breathe my last
నాకు అనుమతి ఇవ్వండి, నేను వాళ్ళని పాతిపెట్టినప్పుడు
ఈ ఉదయం completely నా మిత్రులకు అంకితం.. ఈ పోస్ట్. ముఖాన తిట్టలేక.. ఇలా! ఈ విషయంతో సంబంధం లేని వారు లైట్ తీసుకోండి. పోనీ చదివారా! ఈ జ్ఞానగుళికల్లో ఏదో మీరూ ఏరుకోవచ్చు. 😊👍
********
ఇతరులు మనకు చేసే హాని కన్నా మనకు మనం చేసుకునే హాని యెక్కువ.
ఎవరో ఏదో అంటూంటారు అని మానసికంగా ఇబ్బంది పడతుంటారు.
లేదా ఎదుటి వారు మోసం చేసారని మోసపోయామని బాధపడతారు.
ఇతరుల తప్పు ఎంతుందో మన తప్పు కూడా కొంత వుండనిదే ఏమీ ఏవీ జరగవు. పోనీ..జరిగినాయా.. తట్టుకోవాలి. చతికిలపడకూడదు. శక్తి ఉడిగి ముదుసలి అయి పరుగులు తీయలేకపోవచ్చు కానీ నడవగలరు, లేదా ప్రాకగలరు. అంతంత చదువులు చదివి వుంటారు. వేలమందికి బోధించి వుంటారు. చేతిలో యేదో ఒక సృజన వుంటుంది. అయినా.. యేదో కోల్పోయినట్టు వుండటం బాగుండదు.
జీవితం యేమి నేర్పింది!? మీరు యేమి నేర్చుకున్నారు!? కడుపున పుట్టిన బిడ్డలే ద్రోహం దగా చేస్తున్న కాలంలో కుడి చెయ్యికి యెడమచెయ్యికి ద్రోహం చేస్తున్న కాలంలో
యెవరో మోసం చేసారనో అవమానించారనో బాధపడటం మన లోపాలను మనమే బయటపడేసుకుంటూ ఆప్తులను దూరం చేసుకోవడం యెందుకు?
తత్వశాస్త్రం చదవడం మొదలుపెట్టండి. లేదా నాలుగు కథలు చదవండీ. వేటి మీద ఆసక్తి లేకుండా యే పని పై శ్రద్ధ లేకుండా జీవితాల్లో అద్భుతాలు జరగవు.
ఆలోచనలంత వృధా ప్రయత్నం వేరొకటి లేదు. 77 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని చూడండి. ఎలా కష్టపడుతున్నారో! మనం కీ బోర్డ్ పై నాలుగు పేరాలు రాయడానికి బాధపడి పోతాం. అనవసర దుఃఖాలు మోస్తూ.. కాలం బలవంతంగా అరగదీయడం.
తెలుగు సాహిత్యం అనువాదానికి నోచుకోక ఏడుస్తుంది. ఆంగ్ల సాహిత్యం యూరోపియన్ కవిత్వం అర్థం చేసుకోలేని విద్యార్థులు వున్నారు. ఆన్ లైన్ పాఠాలు చెప్పవచ్చు. పోసుకోలు కబుర్లు అతి తక్కువ జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలవు. మనుషులు వారి ప్రభావాలు చైతన్యం ఇవ్వాలి. బాధను మిగల్చకూడదు. మనం ఇతరులను బాధ పెట్టకూడదు. ఇతరులకు నువ్వు యేమి ఇచ్చావో అదే వస్తుంది. గుర్తు పెట్టుకోండి.
నన్ను చూడండి, తెల్లవారుజామున లేచి నాలుగు కథలు చదువుకున్నాను. నా ఆనందం కోసమే! తర్వాత ఇది రాస్తున్నాను.
ZEE5 లో కొరియన్ సీరీస్ “మదర్” చూడమని చెప్పాను, అన్నా కరెనినా నవల చదవండి. కానీ అన్నా లాగా ఆత్మ హత్య చేసుకోవద్దు అని చెప్పాను. అమృత సంతానం, ఆ వెన్నెల రాత్రులు నవలలు చదవమని చెప్పాను. ఒక్కరు కూడా చదివామని చూసామని చెప్పలేదు. కనీసం ఒక కథ చదవమని సూచిస్తే చదవలేరు. ఒక్క కవిత చదవలేరు. మేం గీసుకున్న గీతల్లోనుండి బయటకు రాలేము. కానీ..
మా జీవితాల్లో అద్భుతాలు మాత్రం జరగాలి అంటారు.
హే.. పోండి. మీతో స్నేహం చేస్తే.. నా మైండ్ ఖరాబు అవుతుంది. మా ప్రకాశం బ్యారేజ్ వరకూ వెళ్లి కాసిని చిల్లర నాణాలు నదిలో వదిలినట్టు మిమ్మల్ని వొదిలేస్తాను. పీడా పోద్ది. ఎక్కువకాలం toxic people ని నేను మోయలేను.
కనీసం స్త్రీ మిత్రులు అయినా “దారులేసిన అక్షరాలు“ చదవండి. అది చదివాక కూడా.. మీ ఏడుపుగొట్టు మాటలు చేతలు స్థితి మారకపోతే.. అది మీ ఖర్మ.
ఎవరూ ఏమీ చేయలేరు. మీ సొద వ్యథ నేనూ వినలేను. నా గుండె కూడా అనేక రకాలు మోయలేకపోతుంది.
ఎవరికి యెవరు యీ లోకంలో ..
ఎవరో వస్తారని యేదో చేస్తారని..
రెండు పాటలు అయినా వినండీ.
కనీసం.. మీ ఆలోచనలు అయినా లిపిబద్దం చేయండి. నేనిప్పుడు అదే చేశాను.
PS: ఈ పోస్ట్ నా దగ్గర మిత్రులను ఉద్దేశించి రాసింది. మీరు లైట్ గా తీసుకోండి. వాళ్ళు సీరియస్ గానే తీసుకుంటారు. నాకు తెలుసు. ఈ మాత్రం dose సరిపోతుందని నేను అనుకుంటున్నాను. 😊👍😘
నా కథల సంపుటి "రాయికి నోరొస్తే " కథలపై ..రచయిత,విమర్శకులు జి. వెంకట కృష్ణ గారి సమీక్ష .. "అడుగు " వెబ్ మాసపత్రిక 2017 నవంబర్ సంచికలో వచ్చింది .
బ్లాగర్ ఫ్రెండ్స్ ..మీరూ చదవండి .. నాకెంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే అంతర్జాలం నుంచి అంతర్జ్వలనంలోనికి ..అంటూ పరిచయం చేసారు. నేనొక రచయితని అని చెప్పుకోవడం కన్నా నేనొక బ్లాగర్ ని అని చెప్పుకోవడం నాకు గర్వకారణం కూడా .. వెంకట కృష్ణ గారూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు .
ఈ లింక్ లో ..వెంకట కృష్ణ గారు వ్రాసిన సమీక్ష చూడండి .. అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి
అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి
October 26, 2017
– వెంకట కృష్ణ
తాతినేని వనజ ఒక బ్లాగర్.బ్లాగులో అనుభూతి కథనాలు రాస్తూ రాస్తూ, నెట్ నుండీ ప్రింట్ లోకి వచ్చారీవిడ.నెట్లో వున్న భావవ్యక్తీకరణ ప్రింట్ లోనూ వుండాలని రాయికి నోరొస్తే,అనే కథాసంపుటిని ప్రచురించారు.వర్చువల్ రియాలిటీ కళ్ళముందు నిజమవటమే యీమె కథలు పుస్తకరూపం దాల్చడం.ఇందులోని కథలు ఒకట్రెండు మినహాయిస్తే అన్నీ వాడిపోని వాస్తవికతలే.రెండు మూడు మినహాయిస్తే అన్నీ నగరజీవిత చిత్రాలే.అయితే అన్ని కథలోనూ సంప్రదాయ సంస్కృతే సమస్యగా నడిపిస్తుంది, పరిష్కారం అన్వేషిస్తుంది.అన్నీ కథలూ స్త్రీ దృక్కోణం నుండి నడిచే కథలు గానేకాకుండా పురుషదృక్కోణం నుండీ నడిచే కథలూ వున్నాయి.సర్వసాక్షి కథనాలతో పాటు మ్యూజింగ్స్ లాంటి అంతరంగకథనాలూ వున్నాయి.మధ్యతరగతి దృక్కోణం నుండి అన్నికథలూ నడిచినా ఆ జీవితమే కాకుండా అట్టడుగు వర్గాల కిందికులాల అనుభవాలూ కథల్లోకొచ్చాయి.స్త్రీవాద ఛాయలున్న కథలు రాసినట్టే,మధ్యతరగతి స్త్రీలు అవకాశవాదులుగా ప్రవర్తించడాన్ని కూడా చిత్రించారు.వెరశి యీమె కథలు ఒక మూసలో కి కుదించి చెప్పడానికి వీలులేనివి.
రాయికి నోరొస్తే-తన అనాది అనుభవాలను తప్పక మాట్లాడుతుంది.అట్లనే చైతన్యం లేని స్త్రీ కి చైతన్యం వేస్తే తనకు జరిగే అవమానాల్ని ప్రశ్నిస్తుందనే సూచనతో వనజ గారు కథ రాసారు.సాఫ్ట్ వేర్ రంగంలో వుండి దేశవిదేశాల్లో గడిపిన ఆధునిక జంటలో పురుషుడికి,సగటు భారతీయ పురుషుడికి లాగానే పుట్టిన పిల్లల తనకు పుట్టినవాళ్ళేనా అనే అనుమానమొస్తుంది.DNA టెస్ట్ చెయించుకొమ్మని పట్టుబట్టి చేయించాక అది తప్పని తేలుతుంది.అయినా భార్యను క్షమాపణ అడగడు, పశ్చాత్తాపం ప్రకటించడు.అలాంటివాడి వైఖరిని నిరసిస్తూ విడిపోయే స్త్రీ కథ యిది.ఎంత ఆధునిక వేషమేసినా భారతీయ మగవాడు నీచ ఆలోచనలు మానడానికి చెప్పే కథ.
ఆడమనిషి గా పుట్టి పెరిగీ చదుకొనీ యెదిగినప్పటి యింటిపేరు ఒక్కసారిగా మాయమై పెళ్లి తోవచ్చిన కొత్త/పరాయీ యింటిపేరు , తర్వాతి జీవితాన్నంతా శాశించడంలోని ఆధిపత్యాన్ని వివరిస్తుంది ఇంటిపేరు కథ.కుంకుమబొట్టు రూపంలో హిందూ సంప్రదాయం చేసే అవమానపు గాయం గుర్తులను గడపబొట్టు కథ వివరిస్తుంది.స్త్రీలకు యెదురయ్యే అనేక అసహనాలు మరీ ముఖ్యంగా యిప్పటికాలపు విపరీతాలవళ్ళ యెదురయ్యే అసహనాలను కొంచెం వ్యంగ్యపు చురకలతో చెప్పిన కథనం ఇల్లాలిఅసహనం.
పై కథలన్నీ అంతోయింతో స్త్రీ వాద దృక్పథం నుండి రాసిన కథలు.అయితే స్త్రీ (మధ్యతరగతి)లలో వుండే అవకాశవాదాన్ని యెత్తి పడుతూ యిదే రచయిత్రి మర్మమేమి,పలచన కానీయకే చెలీ,కూతురైతేనేమీ, ఆనవాలు లాంటి కథలూ రాసారు.
ఈమధ్యకాలంలో ముస్లిమేతర మతాలకు చెందిన ఆడపిల్లలు గూడా నఖాబ్ ధరించి ముఖం కనబడనీయకుండా తిరుగుతూన్నారు. మర్మమేమి కథ యీ పాయింట్ చుట్టూ అల్లబడింది.ఈ కథలో నఖాబ్ ధరించి మొగుడి కళ్ళుగప్పి ప్రియుడితో తిరిగే హిందూ అమ్మాయి వల్ల నఖాబ్ ధరించడం తప్పనిసరి అయిన ముస్లిం యువతి పొరబాటున ఆ బాధిత మొగుడి దాడికి గురవుతుంది.నఖాబ్ దుర్వినియోగం లో వున్న అవకాశవాదాన్ని ప్రశ్నిస్తుంది కథ.అనవసర చనువుతో వగలువొలకబోస్తూ అవకాశవాదం తో స్నేహితురాళ్ళు నూ వాళ్ళభర్తలనూ వుపయోగించుకొనే స్త్రీ లున్నారనీ అట్లాప్రవర్తిస్తూ పలుచనైపోవద్దని స్త్రీ లను హెచ్చరించే కథ పలుచనగానీయకే చెలీ.మహిళల్లోని నెగెటివ్ షేడ్స్ నూ చర్చకు పెట్టడం రచయిత్రి లోని నిష్కర్షను వెళ్ళడిస్తుంది.తల్లిదండ్రులను వ్యాపారాత్మకంగా చూడ్డంలో కొడుకులే కాదు కూతుళ్ళూ తీసిపోరని కూతురైతేనేమి కథలో అంతే నిష్కర్షగా వివరిస్తుంది.ఫ్యాషన్ పేరిట అవమానకరమైన అర్ధనగ్న వస్త్రధారణ చేసే యువతి పోకడలను కంట్రీ వుమెన్ కూతురు కథలో అంతే నిష్కర్షగా విమర్శిస్తుంది.ఈ కథలనే కాదు అవకాశమొచ్చినప్పుడంతా మగపెత్తనాలను నిలదీస్తూ రాసినట్టే స్త్రీ లోని ఆధిపత్యాన్నీ అవకాశవాదాన్నీకూడా యీ రచయిత్రి నిగ్గుదేలుస్తుంది యీ కథలు సంపుటిలో.
అగ్రవర్ణ మధ్యతరగతి జీవితాలను చిత్రించడానికే పరిమితమైపోకుండా యీ సంపుటిలోని ఇంకెన్నాళ్ళు లాఠీకర్ర కథలు కిందికులాల స్త్రీ లను వారిలోని సాహసాన్నీ తెగింపు నూ చిత్రించాయి. ఇంకెన్నాళ్ళు కథలో సాంబమ్మ రాంబాబనే మోసగాడి మాయమాటలకు మొగుడ్ని వదిలేసి వాడికి వూడిగం చేస్తుంది.రాంబాబు సాంబను ఎడాపెడా వాడేసుకొని అప్పులపాల్జేసి పారిపోతాడు.తిరిగి యింకో స్త్రీ తో వుండి, ఆమె మొగుడు తంతే మళ్ళా సాంబమ్మ వద్దకే వచ్చినప్పుడు యీ సారి సాంబమ్మ వాడి మాయలో పడకుండా తన్ని తరిమి కొడుతుంది.సాంబమ్మ వంటి స్త్రీ లు యింకెన్నాళ్ళో మగదురహంకారాల్ని భరించరనీ జీవితానుభవం యిచ్చిన చైతన్యం తో వదిలించుకుంటారనీ చెబుతుంది రచయిత్రి.అలాగే కింది కులాల వ్యక్తులు యెంతో మానవీయంగా చిన్నపాటి అపేక్షలకైనా సదా కృతజ్ఞత గా వుంటారని,వాళ్ళని ఆదరించాలనీ చెబుతుంది రచయిత్రి కాళ్ళచెప్పు కరుస్తాది కథలో.
ఈ సంపుటిలో ముస్లిం జీవితాలను సృజించిన కథలున్నాయి.కాజాబీ,అమాయక ప్రేమను వివరించే జాబిలి హృదయం కథలో,అనివార్య పరిస్థితులలో పెళ్ళయి పిల్లలున్న మాధవ్ తో ఒక స్నేహితురాలి లాగా వుండే కాజాబీని ప్రేమకూ ఆరాధనకూ ప్రతిరూపంగా చిత్రించింది రచయిత్రి.అయితే కథలో వాళ్ళిద్దరి అకాల త్యాగమరణం వాళ్ళకు పుట్టిన పిల్లల్ని అనాథల్ని చేస్తుంది.మహీన్ కథలో, చదువు పట్ల ఆసక్తి వున్న మహీన్ ను పేద తల్లి చదివించలేకపోతుంది. అప్పుడప్పుడు వచ్చి పోయే తండ్రి యిచ్చే డబ్బులతో యిల్లు గడవడమే కష్టంగా వుండడంతో, మహీన్ ఫీజు కట్టడానికి చౌరస్తాలో పూలమ్మడానికి సిద్ధమవుతుంది.ఈ కథలో ముస్లిం స్త్రీలు బహుభార్యాత్వం వల్ల యెదుర్కొంటున్న దైన్యం చిత్రితమైవుంది.ఇప్పుడు కూడా రావా అమ్మా,కథ ఆశా అనే చిన్న పిల్ల తల్లి కోసం పడే తపన.ముస్లిం వ్యక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అమ్మాయి ఒక పాప పుట్టిన తర్వాత అతడి దురలవాట్లు భరించలేక విడిపోతుంది.అయితే పాపను తనవెంట తెచ్చుకోలేకపోయిన విషాదంలో యీకథ, తండ్రి మరణం-తల్లిమారువివాహం,అనే రెండు సంఘటనల నడుమ నలిగిపోయే ఆశాను ఆమె తల్లినీ దుఃఖభరితంగా మిగిలిస్తుంది.
2012 నుండి 2016 మధ్యా యీ రచయిత్రి 24కథలు రాసింది.సొంత బ్లాగు లోనూ వెబ్ మాగజైన్ లోనూ రాస్తూ అచ్చు పత్రికలకు ప్రయాణించింది.బ్లాగ్ రచన సీరియస్ గా చేసేవారికి పత్రికా సంపాదకులు పెట్టే లిమిటేషన్స్ తో నిమిత్తం వుండదు.కథానిర్మాణాలనో,శిల్ప చాతుర్యమనో చెప్పుకునే అడ్డంకులు ఉండవు. స్పాంటేనీటీ ప్రథమగురువు.కాస్తా రాయగలిగిన శక్తివున్న వేలవేల బ్లాగర్లు మనకళ్ళముందు అభిప్రాయప్రకటన చేస్తున్న కాలమిది.అచ్చును కేరేజాట్ అనుకున్నాక వచ్చే ధార చాలా స్వేచ్ఛ గలిగినది.అయితే అది కొండకచో గాఢత లేనిది కూడా.వనజ గారి కథనంలో బ్లాగ్ రచనా స్వేచ్ఛ ఆద్యంతమూ అగుపిస్తుంది.విషయ పరిజ్ణాణమున్న ప్రతి మనసులోనూ జరిగే మ్యూజింగ్ ప్రతికథనూ నడిపిస్తుంది.ఆ స్వేచ్ఛ ఆమెను ఇన్ హిబిషన్ లేని రాతలు రాయడానికి అవకాశమిచ్చింది.వెన్నెలసాక్షిగా విషాదం,స్నేహితుడా నాస్నేహితుడా, లఘు చిత్రం లాంటి కథలు అందుకు వుదాహరణగా నిలుస్తాయి.
ఈ కథలు అర్బన్ కథలుగా అగుపించినా స్థలరీత్యా సంభవించినా వీటి మూలం గ్రామీణమే.కథల్లో వచ్చే కాంట్రడిక్షన్ లన్నీ పాత సాంప్రదాయానికి ఆధునికతకు జరిగే ఘర్షణలే. వీటి తీర్పరిగా యీ రచయిత్రి ఆధునికత వైపుండి భారతీయ సాంప్రదాయం లో వున్న అన్ని చెడుగుల్నీ నిరసిస్తుంది.అంతిమంగా మానవీయత ను ప్రోది చేసేదిగా నిలబడింది. ఈ మెకు పర్యావరణ అపేక్ష వుంది.బయలు నవ్వింది, ఆనవాలు లాంటి కథల్లో అది కనిపిస్తుంది.ప్రకృతి పట్ల పారవశ్యం వుంది.సంగీతమైతే యెప్పుడు వీలుకుదిరితే అప్పుడు తెలుగు సీనీగీతాల చరణాలుగా కథల్లో కొస్తుంది.బ్లాగర్ కున్న స్వేచ్ఛ రీత్యా వయ్యక్తిక అనుభవాల అనుభూతులను కథనం చేయదగ్గ నైపుణ్యం రీత్యా కథకురాలిగా నిలబడ్డ యీమె భవిష్యత్తు లో మంచి కథలు రాయాలని ఆశీంచడం ఆమె బాధ్యత ను గుర్తు చేయడమే. ఈ సంపుటిలోని ఆమెనవ్వు పురిటిగడ్డ లాఠీకర్ర కథలు ఆనుభవ కథనాలుగా అగుపించినా వీటిని మరింత పరిశీలనగా గమనించి సృజించివుంటే యీకథలు యిప్పటి కోస్తాంధ్ర ఆత్మను ఆవిష్కరించివుండేవి.ఆమె నవ్వు కథ యెదోమేరకు కోస్తావ్యాపార సామాజిక స్వభావాన్ని పట్టుకున్న కథ.పురిటి గడ్డ కథ కోస్తాకు వలస వచ్చిన యితర ప్రాంతపు (కూలీ లుగా మారిన) రైతుల విషాదకథ. యీ వలసలు యెందుకు జరుగుతున్నాయనే కోణాన్ని తెరిస్తే, వనజ గారు అర్థం చేసుకోవాల్సిన కుట్రలను అర్థం చేయించే ఆకాశం అనంతమైందని చెప్పేకథ. లాఠీకర్ర , కోస్తాంధ్ర గ్రామీణ ప్రాంత అట్టడుగు వర్గాలు , బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వస్తే , అనివార్యంగా యెదుర్కొనే రాజ్యహింస. ఈ మూడు కథలూ యీ సంపుటి రీత్యా రచయిత్రి లేటెస్ట్ కథలు.ఆ తర్వాతి రాబోయే కథలన్నీ మరింత వైవిధ్యం గా విస్తృతంగా వుండాలని కోరడం అత్యాశ కాదు.