29, మే 2024, బుధవారం

సౌందర్యానుభవం మాటలుగా..

 ఒక శిల్పాన్ని కాని, ఒక చిత్రపటాన్నికాని, ఒక ఛాయాచిత్రాన్ని కాని, ఒక వ్యక్తి రూపాన్ని కాని, ఒక దృశ్యాన్నికాని, చూసినప్పుడు ఒకా నొక అనుభూతి మన మనస్సుమీద ముద్రవేస్తుంది. ఒక వాసన, ఒక స్పర్శ, ఒక రుచి, ఒక నాదం, ఒక రూపం మనలో నిద్రాణమై ఉన్న సహజాతా లను తట్టి లేపుతాయి. నిత్యజీవితంలో కలిగే ఈ అనుభవ వైవిధ్యం కళా సృష్టిలోకూడా సంవేద్యమవుతుంది. సామాజికుడికి అనుభూతమవుతుంది. ప్రతి మనిషిలోనూ ఇవి వుంటాయి. కొంత ఎక్కువగా వున్నవారు కవులు రచయితలు చిత్రకారులు సంగీతకారులు అవుతారు. నేనూ… అదే కోవలోకి చెందినదాన్ని అయివుంటాను.అందుకే… ఈ సౌందర్యానుభవం… 




కామెంట్‌లు లేవు: