20, జులై 2011, బుధవారం

వేయివేణువులు మ్రోగేవేళ..





   వేయివేణువులు మ్రోగేవేళ సాహిత్యం..క్రింద..

వేయి వేణువు మ్రోగేవేళ 
హాయి వెల్లువై పొంగేవేళ  
రాసక్రీడలో చేరేవేళ
రాదమ్మని లాలించేవేళ

నను పాలించగ నడచివచ్చితివా..
మొరనాలింపగా తరలి వచ్చితివా..గోపాలా..(నను) 

అరచెదిరిన తిలకముతో అదిగదిగో రాధమ్మ
అరజారిన పయ్యదతో  అదిగదిగొ గోపెమ్మ
ఎరుపెక్కిన కన్నులతో  ఇదిగిదిగో సత్యభామ
పొద పొదలొ ఎద ఎదలొ 
నీ కొరకై వెదుకుతు ఉండగ(నను)  

కంసుని చెరసాలలొ ఖైదీగా పుట్టావు  
కాంతల కౌగిళ్ళలో ఖైదీగా పెరిగావు 
కరకురాతి గుళ్ళలో ఖైదీగా నిలిచావు  
ఈ భక్తుని గుండె లో ఖైదీగా ఉండాలని (నను)


ఎంత చక్కని పాట. నాకైతే ఎంతో ఇష్టమైన పాట.వనమాలి పాటేదైనా అందునా..వేణువు ఎన్నిమార్లు విన్నా తనివితీరదు. "మామ" స్వరకల్పనలో వేణువు రాతిలో కూడా రాగాలు పలికిస్తుంది.   ఇక సాహిత్యం విషయంకి వస్తే ఆయన రాముడి పేరుని ఇంటి పేరులో కృష్ణుడిని పేరులోను సమన్వయపరచుకున్న దాశరధి కృష్ణమాచార్యులు.దాశరధి గా ప్రతీక.

ఇంతటి భక్తిరసంలో..ముంచెత్తుతూ ఆ సాహిత్యపు సొంపులు చూడండీ!!మధురాతిమధురం. సాహిత్యంలో వారి ముద్రని మరొకసారి చెప్పుకుందాం.

ఆ వనమాలికి భక్తులన్న అలవిమాలిన అనురాగం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం తాండవిస్తుంది.అందుకేనెమో..అసలే దక్షిణ నాయకుడు.అష్ట భార్యలున్నవాడు.ఆ పై పదహారువేల గోపెమ్మలు.అయినా ఆయన అందరిని సంతోషంగా ఉంచగల్గాడు. ఎందుకంటే నిజంగా ఆయన రెపల్లె లోనో, బృందావనిలోనో ఉండడు.ఆయన నివాసం భక్తుల హృదయాలు. పిలవగానే వడి వడిగా పరుగు పరుగున వాలిపోతాడు.వారిని పాలిస్తాడు..మొరలాలకిస్తాడు. తనని ఆరాదించే భక్తులకి బందీగా ఉంటాడు. అది వనమాలి భక్తులకి..ఇచ్చిన వరం. అదే సంగతిని..బహు సుందరంగా వ్రాసారు..ఆ కవి. నిజంగా ఆ నల్లనయ్య ఆ సాహిత్యానికి, ఆ..మధుర గానానికి..పరుగు పరుగున రాకపోడా అనేంత గొప్పగా ఉంధి సాహిత్యం.
వేణువు ఒకటి మ్రోగితేనే మది ఊగుతుంది.తూగుతుంది. అలాటి వేయి వేణువులు మ్రోగేవెళ ఎంతగానొ ప్రేమించే రాధమ్మని చేరి రాసక్రీడలో..మునిగే వేళ ఆపదలో ఉన్న భక్తుడు పిలవగానే.. ఉన్నపళాన ఆ నల్లన్నయ్య పరుగు పరుగున భక్తుల కడకు వచ్చెస్తే.. 

ఆయనంతే భక్తులని యెప్పుడు పాలించడానికి ..లాలించడానికి.. కనికరించడానికి..సిద్దంగా..ఉండగలడు . కానీ ఆయన దేవేరిలకి కోపం రాదు? మంచిసమయము..భార్యని వదిలేసి వెళ్ళిపోతే?ఇక వారి అవస్తలు..ఇలా..ఉంటాయని చెప్పడం ఒక శౄంగార కావ్యం కూడా..రసమయ జగత్తులో ఉండగా ఆ నల్లనయ్య ఆమెని విడిచి వెళ్ళగా మొహంతో..శయ్యం పై ఆ రాదమ్మ పొరిలి పొరిలి సగం చెరిగిన కుంకుమతో...ఊర్పులు విడుస్తుందని..

ఆ గొపెమ్మ ఏమో..కొరికతొ సగం జారిన పయ్యదతో..కలియచుడుతుందని, ఇక సత్యభామ తనని వొదలి వెళ్ళాడన్న కొపంతోను..వాంచ వల్ల ఎర్రగా మారిన కన్నులతో పొద పొదలోను ఆచూకి కోసం ఎద ఎద లోను వెదుకుతూ ఉంటె..నన్ను పాలి0చగా నువ్వు వచ్చావా గొపాలా!? అని ఆయనని ఆర్ధ్రంగా,ముకుళితమైన మనసుతో..కీర్తిస్తున్నాడు..ఆ భక్తుడు.

చెరసాలలో ఖైదీగా పుట్టి ఇంతుల కౌగిళ్ళలో..ఖైదీగా పెరిగి (అందరు ఆయనని ప్రేమించే వారే..కదా?) కరకు అయిన నల్ల రాతి గుళ్ళలొ ఖైదీగా మారినా (ఆయనని రాతి గుళ్ళల్లో మనమే ఖైదీగా మార్చాము. ఆయన నిజంగా భక్తుల హృదయాలలోనే ఉంటాడని చెబుతారు.)ఈ భక్తుని గుండెళో ఖైదీ కావాలని కొరుకుంటాడు. ఎంత ఆశొ! చూడండీ! అది అపారమైన భక్తికి..చిహ్నం.  
ఎంత చక్కని భావం. ఎన్ని సార్లు విన్నా..మళ్ళీ వినాలనిపించే పాట.ఈ చిత్రంలో శొభన్ బాబు గారు కృష్ణుడిగా ఎంత సుందర రూపమో! ఎ.ఎన్నార్ ఆహార్యం అంత చక్కనిదే !.అందుకే పదికాలాలు నిలిచే పాట. మీరు చూసి విని ఆస్వాదనలో మునిగి తేలాలని బుద్దిమంతుడు చిత్రంలో.. ఈ పాట పరిచయం. వేయి  వేణువులు  

మ్రోగే  వేళ   ఇక్కడ వినండీ!

2 కామెంట్‌లు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మంచి పాట మీద పోస్ట్ రాశారు. గుర్తుచేసినందుకు నెనర్లండి!

మురళి చెప్పారు...

ఇందులో 'రాధమ్మని లాలించే వేళ..' లైన్ అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టమండీ.. పలకడం, అభినయం కూడా కొంచం ప్రత్యేకంగా ఉంటాయి, గమనించండి..