4, అక్టోబర్ 2019, శుక్రవారం

తెలుగు లెస్స

క్రీస్తుశకం 1515వ సంవత్సర ప్రాంతం.  కృష్ణదేవరాయలు కొండవీడు జయించాడు. కృష్ణానదికి కుడివైపున సైన్యాన్ని మొహరించి  కృష్ణానదిని దాటి కొండపల్లిని ముట్టడించాలని ప్రయత్నిస్తున్నాడు.
కంజీవరం ప్రాంతం నుండి తరిమివేయబడిన  కళింగాధిపతి కపిలేశ్వర గజపతి కొండపల్లిలో కేంద్రీకరించి వున్నాడు. రాయల సైన్యం అమరావతి నుండి ఉండవల్లి కొల్లూరు వరకు విస్తరించి వుంది 

రహస్యంగా ఒక సామాన్యమైన మనిషిలా రాయలవారు శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణుదేవాలయ సందర్శనకు వచ్చాడు. (దేవుడు లంక ) అప్పుడు కృష్ణలో వెన్నెలలో  నదీ విహారం చేస్తూ... 

కృష్ణమ్మను కీర్తించాడిలా.. 

సహ్యగిరి శిఖరాన 
శ్రీ కృష్ణ రూపాన 
కృష్ణమ్మ పుట్టింది 
ముందుకే సాగింది 

పరమేశు అంశాన 
వేణమ్మ పుట్టింది 
కృష్ణమ్మతో  కలిసి
కృష్ణవేణయ్యింది 

ముందుకే సాగింది 
ముచ్చట్లు పోయింది 






కామెంట్‌లు లేవు: