మధుపంబు నైనా కాకపోతిని
ఆకు ఆకు పైన పూలు రాలాయి అక్షరాల వలె
పూలన్నీ యేరి దండ గుచ్చాను
అతడు అక్షరాలన్నీ పేర్చి కవితలల్లాడు
అల్లిన దండ వినమ్రంగా గుడికి చేరింది
కవిత అదృష్టవశాత్తు పత్రిక కెక్కింది
అది చూపి కవి గారు విర్రవీగారు
పూలు రోజూ విరబూస్తూనే వున్నాయి
పోటీకి వచ్చిన కవిత్వమేమో వెగటు కొడుతుంది.
పూల సౌందర్యం.. కాంచిన కనులది
కవితా సౌందర్యం.. అంతఃచక్షువుది.
ఏది మూయాలి!? ఏది తెరవాలి !?
నేను పూవునైనా కాకపోతిని
పోనీ..కవితా మధువును గ్రోలే
మధుపంబు నైనా కాకపోతిని
కవిని కాటేసేందుకు..
వనజ తాతినేని.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి