ముద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ముద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, అక్టోబర్ 2019, బుధవారం

పేరులోనే వున్నది..

చిగురించిన శిశిరం కథ ప్రచురణకు రాకమునుపు ఆ.. కథకు నేను పెట్టిన పేరు .. రాతి హృదయం. అసలు ఈ కథ “చేరేదెటకో తెలిసి” అనే కథకు సీక్వెల్ గా రాసిన కథ. కొద్ది గంటల్లో విరామం తీసుకోకుండా వ్రాసిన కథ. ఆదివారం సంచికలో ప్రచురణకు అనుకూలంగా దాదాపు 1500 పదాలకు కాస్త అటునిటుగా కుదింపబడిన కథ. ఈ కథకు రాతిహృదయం అనే టైటిల్ కన్నా “చిగురించిన శిశిరం” అని పెడితే బావుంటుంది అని సూచిస్తే సరేనన్నాను. ఎందుకంటే మంచి మంచి కథలు వ్రాసి నిత్యం యెన్నో కథలు చదివి పాఠకుల నాడిని గ్రహించగల్గిన వారి అనుభవం కదా..! ఇతివృత్తానికి తగినట్టు అని వారి అంచనా నిజమవుతుంది


ఇక యీ  కథ ప్రచురితమయ్యాక వచ్చిన స్పందన చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాను. ఇన్నాళ్ల తర్వాత యీ  వారంలో కూడా నిర్మల్ నుండి ఒక హెడ్మాష్టర్ గారు ఫోన్ చేసి అభినందించి నేను మర్చిపోలేని కథ అందించారమ్మా.. మీరు నాకన్నా చిన్నవారు. కానీ మీ పాదాలకు నమస్కరించాలని వుందమ్మా అన్నారు. ఒకోసారి ప్రశంసలు కూడా యిబ్బంది పెడతాయి. కథలు వచ్చినప్పుడల్లా మెసేజ్ పెట్టండి అని అభ్యర్దన. నెంబరు సేవ్ చేసుకున్నాను. ఫోన్ తీయగానే యదాలాపంగా మాట్లాడుతూ పేరు సరిగా వినం కదా... మీ పేరు సర్.. అని అడగలేకపోయాను. 😞 ఈ సారి కనుక్కోవాలి.
ఇకపోతే ఈ కథ వచ్చాక ఇదే పేరుతో రెండు కథలు వచ్చాయి. అదేమిటో కథలకు పేరు పెట్టుకునే టపుడు  తనిఖీ చేసుకోరా..! నేను కథకు పేరు పెట్టేటపుడు అంతకుముందు యెవరైనా ఆ పేరు పెట్టారో లేదో చూసుకుని మరీ పెడతాను. కాస్త పొయటిక్ గా వుండేటట్లు జాగ్రత్త పడతాను. పేరులో పెన్నిధి వుందంటారే అలాగన్నమాట. కథకైనా కవితకైనా వ్యాసానికైనా శీర్షిక, ఎత్తుగడ, ముగింపు ప్రాణం. అవి బాగుండకపోతే అంతగా పాఠకులను ఆకట్టుకోవని నా అనుభవం కూడా! 
నా కథల టైటిల్స్ కు అభిమానులున్నారు.  ప్రముఖ రచయిత్రి చంద్రలత ... ఫోన్ చేసి కథల గురించి మాట్లాడుతూ టైటిల్స్ గురించి ప్రత్యేకించి అభినందించారు. ఈ మధ్య "పూలమ్మి " టైటిల్ కూడా మరొక చోట కనబడింది. ఇతివృత్తాన్ని బట్టి శీర్షిక పెట్టడంలో సగం విజయం లభించినట్లే అనుకుంటాను. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వుంటాను. ముందు టైటిల్స్ అనుకుని వ్రాసిన కథలు వున్నాయి. అట్లాంటా  వున్న శారద గారు, తిరుపతి లో వున్నా విజయ కుమార్ గారు నా కథల టైటిల్స్ కు పెద్ద అభిమానులు.
ఈ మధ్య వ్రాసిన "నీట చిత్తరువు " టైటిల్ అర్ధం కాని  ఎడిటర్ కూడా వున్నారు . నీటి చిత్తరువు అంటే వాటర్ కలర్స్ తో వేసిన చిత్రమా అని అడిగారు కూడా ! నా తలకాయ అనుకుని నీటి చిత్తరువు కాదండీ .."నీట చిత్తరువు " అంటే నీటిలో కనిపించే చిత్రం అని వివరించాల్సి వచ్చింది. సరే .. ఎలాగూ వాళ్ళు ఆ కథ ప్రచురణకు అంగీకరించలేదనుకోండి. 
ఇప్పటికి తొంబై అయిదు కథలు వెలువడ్డాయి. ఇరవై ఆరేళ్ళ క్రితం రాసుకున్న "జాతర" కథ తర్వాత "వేకువ పువ్వు " అనే కథ వ్రాసాను. ఆ వ్రాసుకున్న ప్రతి కనిపించలేదు కానీ ..కథ గుర్తుంది . మళ్ళీ వ్రాస్తున్నాను. పంతొమ్మిదేళ్ళ క్రితం వ్రాసిన కథానిక "బంగారు " ..ఇలా తొంబై అయిదు  కథలు ఈబ్లాగులో ..మీరు బ్లాగ్ తెరిచిన తర్వాత కిందికి చూస్తూ  కుడివైపున ..ఒకచూపు వేస్తే ... నా కథలు శీర్షికలో అన్ని కథల లంకె లు వున్నాయి. హాయిగా చదువుకోవడానికి నేను శ్రద్ధ తీసుకుని అలా లంకెలు యిచ్చాను. పత్రికలలో వచ్చిన కథలన్నింటిని రెండుమూడు రోజులుగా పిడిఎఫ్ ఫైల్ లోకి మార్చి వుంచాను. ఆ లింక్స్ కూడా ఇవ్వగలను. 
ఇంకా మెదడులో సంక్లిప్తమైన బ్లూ ప్రింట్ లో వున్న అనేకానేక కథలు వున్నాయి . ఓ అయిదు కథలున్నాయి కానీ నాలుగు నెలలుదాకా వాటిని పంచుకునే ఉద్దేశ్యం లేదు . పత్రికలకు పంపే ఆలోచన లేదు . బ్లాగ్ లో రాసిన టపాలలో చాలా అచ్చుతప్పులున్నాయి. వాటన్నింటిని సరిచేసుకోవాలి ముందు. అప్పుడు హడావిడిగా వ్రాసేసాను. కొంత తెలియక తప్పులు వ్రాసేసాను. అజ్ఞానం అలా వర్ధిల్లింది. ఏమైనా ... సహృదయంతో చదివిన మిత్రులందరికీ నమస్సులు. ధన్యవాదాలు.  
నా కథా ప్రయాణం గురించి ఎవరూ నన్ను అడగలేదు. పత్రికలలో పరిచయానికి నాకంత ఉత్సాహం లేదు అనేదానికన్నా ..అసలు అడిగినవారు లేరు. నా కథా ప్రయాణం గురించి నేను చెప్పుకోవడమే తప్ప. నాకు పత్రికలలో పనిచేసేవారిలో స్నేహితులు లేరు. అలాగే నాకొక కోటరీ (గుంపు ) లేదు. నేను వారిని పొగుడుతూ ఉంటే బదులుగా వారొచ్చి నను పొగుడుతూ వుంటారన్నమాట. అందుకు నేనెప్పుడూ దూరం కాబట్టి ... ఎంత ప్రశాంతంగా జరిగిపోతున్నాయో రోజులు.  :) 
మళ్ళీ చెపుతున్నాను ..పేరులోనే పెన్నిధి వుంది ..అనుకోవాలి అనుకుంటుంటే .. పేరులో ఏముంది అన్నారు ఒకరు. ఇదంతా కూడా చెప్పాలిప్పుడు.  :) 
పేరు ఉచ్చరించినప్పుడు వెలువడే వైబ్రేషన్స్ పాజిటివ్ గానూ నెగిటివ్ గానూ కూడా వుంటాయట. శబ్దం కూడా లయాత్మకంగా అర్ధవంతంగా వుండటం వల్ల  వీనులవిందుగా వుంటుంది కదా ! 
నా పేరు పెట్టేటప్పుడు కూడా ..మా అమ్మ చాలా శ్రద్దగా నా పేరు పెట్టారంట. నా  పేరులో వున్న మూడక్షరాలు. హల్లులే కదా ! హల్లులు పలకాలంటే అచ్చులు సహాయం లేకుండా పలకడమే కుదరదు కదా ! నా వరకు నా పేరంటే చాలా యిష్టం కూడా ! 
వనమున జనియించినది , నీటిలో జనియించినది ... నీలి కమలం   



29, ఆగస్టు 2019, గురువారం

లవ్ జె జగద్ధాత్రి ముద్ర


కొందరు రచయితలూ కవులు రచనలలోనే కాదు జీవితం జీవించి చూపడంలో కూడా ప్రేమైక స్వభావమే. ఆ ప్రేమ కోసం లోకం గీసిన సరిహద్దురేఖలను చెరిపేసి తమకు కావాల్సిన విధంగా జీవించి చూపుతారు. వద్దనుకుంటే తేలికగా జీవితాన్ని ముగించుకుంటారు. అది వారి ముద్ర ఆమె కవితలో చిన్న భాగం ఇక్కడ ..

పురాతన ధాత్రి
ఒకనాడు జన్మించింది
అందరికీ తెలిసినట్టుగానే ,
చాలా కాలం క్రితం
ఈ పురాతన ధరణి మరణించాల్సిందే .
కనుక వేడి గాలులను రేగనివ్వండి ,
నీలి కెరటాలను తీరం తాకనివ్వండి ;
ఎందుకంటే ప్రతి ఇరు సంధ్యలూ
ఇక నీవు చూడలేవు
శాశ్వతంగా.
అన్నీ జన్మించినవే
ఏవీ తిరిగి రావు మరల
ఎందుకంటే జన్మించినవన్నీతప్పక మరణించాల్సిందే!


"ప్రేమంటే శరీరంతోనో, హృదయంతోనో వేరు వేరుగా జీవించడం కాదు. దూరంగా వున్నప్పటికీ వొకరి మనసు స్పందిస్తే రెండో వారికి గుండె మెలిపెట్టినట్లు వుండటం" అని ఆమెకి అనుభవమై వొడలెల్లా కన్నీటి సంద్రమే.

ఆ సంద్రంలో ఆ క్షణంలోనే ఆమె మునిగిపోవచ్చు. - నేను వ్రాసిన కథ "రాతి హృదయం " నుండి ఈ వాక్యం.

ఈ బ్లాగ్ లో పదే పదే చదవడం చూసాను.ఎవరో ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారనుకున్నాను. కానీ అనుమానం రాలేదు. జరగాల్సింది జరిగిపోయాక యిప్పుడనిపిస్తుంది.. అయ్యో ..అని. ఆమె తన ధాత్రి బ్లాగ్ నుండి ఆ కథను పదే పదే చదివారని తెలిసింది.

 సాహితీ లోకం గురించిన తెలిసిన వారందరికీ విశాఖ జగతి గారు తెలిసే వుంటారు. జగమెరిగిన జగతి జగద్దాత్రి అనుకోవచ్చు. అందరిని ప్రేమగా పలకరించే ఆమెను మర్చిపోవడం కష్టం. సహచరుడు రామతీర్ధ గారు మరణించాక కల్గిన వొంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయం తెలియగానే షాక్ అయ్యాను

ఆమెతో ఫేస్బుక్ లో కాకుండా వ్యక్తిగతంగా మూడు నాలుగుసార్లు వ్యక్తిగత సంభాషణ జరిగిందినేనెవరో ఆమెకు పరిచయం లేకపోయినా నా  కవిత "నా ఏకాంతంలో నేను" అనే poem translate చేసారు. "మర్మమేమి" కథ తీసుకున్నారు. Translate చేయడానికని. ఈ మధ్య రేపటి టీచర్లుఅనే కథ రాసారు share చేసి Tag చేయబోతే Facebook deactivate చేసి వుంది. Call చేస్తే తీయలేదు. కొద్దిరోజులకు facebook కి మళ్ళీ వచ్చారు. నేను మంజు యనమదల కలిసి ఆమె దగ్గరకు వెళదామనుకున్నాము. ఇంతలో యిలా..  ఒంటరితనం అంత భయంకరం యింకోటి లేదు. 😞😢

జగద్దాత్రి చనిపోయిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం  గురించి అనేక సంగతులు బయటకు వచ్చాయి. అవన్నీ నాకు తెలియక ముందు యెలాంటి ఫీలింగ్ వుందో తెలిసిన తర్వాత అదే ఫీల్ నాకు. నేను జడ్జ్ చేయను. కానీ moral policing చేస్తూ యెన్నెన్నో వ్యాఖ్యానాలు. అసహ్యమేసింది మనిషి చనిపోయాక కూడా వ్యాఖ్యానించడం చూసిఒంటరితనం భరించలేక చనిపోయారు అని  అంటే అదే బాధ. ప్చ్. ఒంటరితనం వేయి కొండచిలువులు కలసి చుట్టేసిన ఊపిరాడనితనం. అందరూ జీవించడానికి రకరకాల కారణాలు వెదుక్కుంటారు ఆమె జీవించడానికి కారణమే లేదు అనుకుని ఉండవచ్చు. కవులు రచయితలు సున్నిత మనస్కులు అని నిరూపించారు 😥


ఈ కల్లోల ప్రపంచంలో రకరకాల బాధలు. మనవి కాకపోయినా యేదో బాధనాలుగైదు రోజులుగా నాలో  అలాంటి  బాధే! మనసు కృంగకుండా ప్రశాంతంగా వుండటాన్ని సాధన చేస్తున్నా.. ఆమె గురించి సానుభూతిగా వ్రాసిన మాటలు చూసి మెసెంజర్ ద్వారా కొన్ని వివరాలు అందించారు ఇద్దరు వ్యక్తులు. ఆ వివరాలు చూసిన తర్వాత కూడా ఆమెపై నా అభిప్రాయమేమీ మారలేదుకూడా!   తర్వాత నా ఆలోచనలు నాణేనికి రెండో వైపు అనుకుంటూ ..ఇలా వ్రాసుకున్నాను.

ఉబుసుపోక కాదు యీ మాటలు రాస్తున్నది. నా ఆలోచనలను వ్రాస్తున్నా! జరిగిన తప్పిదంలో పురుషుడిని వదిలేసి స్త్రీని మాత్రమే జడ్జ్ చేయడం నాకు నచ్చలేదు.

ఒకప్పుడు నా మధ్య నా భర్త మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తు చేసుకుంటున్నాను.

"ఒక పురుషుడు హటాత్తుగా చనిపోతే ప్రియురాలు కూడా వెంటనే చచ్చిపోతుంది అతనంటే అంత ప్రేమ. భార్య కావాలంటే పొర్లుగింతలు పెడుతూ గుండెలు బాదుకుంటూ యేడుస్తుంది కానీ .. అని నా భర్త.

వెంటనే.. "భార్యకు అనేక భాధ్యతలుంటాయి వాటిని వదిలేసి భర్త తో పాటే మరణించడానికి ఆ ప్రేమ అనేది అతను ఆమెకు ఏనాడైనా యిస్తే కదా.. ఆ భాధ్యతలేమిటో అతనికి తెలిస్తే కదా " అన్నాను నేను.

ప్రేమ తెలియకపోయినా పర్లేదు బాధ్యత మాత్రం అందరికి తెలిసి ఉండాలి.

ఆ బాధ్యత లేకుండా వ్యక్తిగత ఆనందం కోసం ప్రాకులాడిన వారికి అయిన వాళ్ళెవరూ మిగలరూ..సమాజమూ వారిని అర్ధం చేసుకోదు. రాళ్ళుచ్చుకుని వెంటబడి మరీ కొడుతుంది.

మనుషుల వ్యక్తిగత వివరాలు తెలియకుండా నాకు తెలిసిన వారు యిలా మరణించినవారు రెండు జంటలున్నాయి. ప్రియురాలు చనిపోయాక కొన్నాళ్ళకు ఆ పురుషుడు చనిపోవడం వొకటి అయితే రెండవది పురుషుడు చనిపోయాక అతని ప్రియురాలు విరక్తితో వొంటరితనంతో ఆత్మహత్య చేసుకోవడం.

కారణాలు ఏవైనా .. ఇలాంటి సహజీవనాలలో స్త్రీ ని వొక్కరినే తప్పు పట్టడం భావ్యం కాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎవరెవరో అవాకులు చెవాకులు పేలిన మాటలు వింటున్నా బాధేస్తుంది. అప్పుడిలా అనుకుంటాను.

స్త్రీలకూ వొక విజ్ఞప్తి మీ చదువులు ఆర్ధిక స్వావలంబనలూ దైర్యాన్ని ఒక్కటే కాదు విజ్ఞతను కూడా యివ్వాలి. ముఖ్యంగా మీరు తల్లిదంద్రులైతే మీరు మరింత బాధ్యతగా ఉండాలని గుర్తెరగాలి తప్ప సమాజానికి సవాల్ విసిరి బ్రతుకుతున్నాం అని గొప్పగా బోర విరుచుకుని నడిచి కడకు అనామకులుగా కడతేరిపోకూడదు. మరో రాజేశ్వరి కాకూడదు అని అనుకోవాలి అని

 ఈ విషయం అర్ధమైనా సరే అనుచితంగా కామెంట్స్ చేయకండి ప్లీజ్.. సానుభూతి చూపుతూ కూడా మనం ఆలోచించవచ్చు. పాఠాలు నేర్చుకోవచ్చు అని సున్నితంగా హెచ్చరించాను. అయినా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే వున్నారు. సరే ఒకరి అభిప్రాయాన్ని మనం మార్చలేం. ఎవరి అభిప్రాయం వారిదిగతంలో ఇలాంటి అనుభవంతోనే "జాబిలి హృదయం " కథ వ్రాసాను. ఆసక్తి ఉంటే యీ లింక్ లో చదువుకోవచ్చు.

జగతి జగద్ధాత్రి గురించి నా స్పందనను చూసిన మరికొందరు మెసెంజర్ లలో ఫోన్ కాల్స్ లో విపరీతంగా చెప్పుకున్నారు. ఆ విషయం నాకు తెలిసి నవ్వుకున్నాను. మనుషులకు ఎంతసేపు సమాజాన్ని వేలెత్తి చూపించే పని మాత్రం 24*7 కావాలి. సమాజానికి కళ్ళెం వేసి నడిపించడం మావల్ల కావాలి అన్నట్టు వుంటాయి వారి మాటలు. సంస్కృతీ సంప్రదాయం వివాహ వ్యవస్థ అనైతికం అంటూ మూకుమ్మడిగా గళాలు విప్పడం మొదలెడతారు.

నేను శుద్ద సంప్రదాయవాదినే. కానీ ఇతరుల జీవితాలను నిర్దేశించాలనో కట్టడిచేయాలనో అనుకోను. వేష భాషలందు ఆధునికంగా వుంటాను. మూఢాచారాలను నిరసిస్తూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడుతూ... స్త్రీ పక్షపాతిగా వుంటూనే పురుషులను సమానంగా గౌరవిస్తాను.

ప్రతి వ్యక్తికి వ్యక్తి స్వేచ్ఛ వుంటుంది. ఆ స్వేచ్ఛతో వారు బ్రతకడం వల్ల ఇతరులకు యేమి హాని జరగదు. జరగనంత వరకూ ఎవరి బ్రతుకు వారిని బ్రతకనివ్వాలి తప్ప ముల్లు కర్రతో వెనుక పొడవడం సమంజసంకాదు. జగద్దాత్రి ఆమె వ్యక్తిగత ఆకాంక్షలకు వ్యక్తిస్వేఛ్చకు ప్రతీకగా నిలిచారు. ఆమె నిర్ణయాలకు ఆమె జవాబుదారీ. యిష్టమైనట్టు జీవించడం మరణించడం ఆమె హక్కు. 

మీ అభిప్రాయం మీకున్నట్లే ఎదుటివారికి వారి అభిప్రాయాలుంటాయి. మీ అభిప్రాయమే సరైనది అనుకుంటూ యితరులను బాధ పెట్టకూడదు. సమాజం మొత్తాన్ని right track పై నడిపించాలనుకునే మితిమీరిన ఆశ నాకు లేదు ఇతరులకు వుండకూడదని భావిస్తాను.

మాటల ద్వారా పరోక్ష వ్యాఖ్యానాల ద్వారా ఒక మనిషిని బాధకు గురిచేసేంత కుసంస్కారం వుండకూడదు. అది మరీ పాపం.

పాండిత్యం వున్న వాళ్ళు పండితులు జ్ఞానం వున్న వాళ్ళు గురువులు కావచ్చు. కానీ హృదయ సంస్కారం వున్నవాళ్ళు అన్నీ కాగలరు.

ఓం శాంతి శాంతి శాంతి.

జగద్ధాత్రి  గురించి నా స్పందనతో  పాటు ఆమె మరణం తర్వాత విన్న వ్యాఖ్యానాలను ఇక్కడ ఉదహరించాను. ఇది నివాళి కాదు. ఆమె పై నా అభిమానం యిలా వుంది, లోకం తీరు యిలా వుంది అని చెప్పడమే నా వుద్దేశ్యం.
రామతీర్ధ తో తనకున్న అనుబంధం యేమిటో "ఆ కిటికీ " అనే కవితలో వ్రాసుకున్నారు. అది చదివాక కూడా మనం వారి బంధాన్ని ఆమోదించలేని కుసంస్కారం నెలకొని వుంటే మనం నిత్యం చూస్తున్న అనేకానేక బంధాల బోలుతనాన్నికూడా  గర్హించాలి అని నా అభిప్రాయం. 

ప్రేమమూర్తి జగతి జగద్దాత్రి గురించి ఆమెకు ఎంతో సన్నిహితురాలైన "సాయిపద్మ" వ్రాసిన నివాళి క్రింద క్లిప్పింగ్ లో చూడవచ్చు. 
జగద్దాత్రి బ్లాగ్ ఈ లింక్ లో .. ఆమె వ్రాసుకున్న వ్రాతలు రచనలు ఇక్కడ కొన్ని చూడవచ్చు.



7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

"సు" మన్




సుమన్ గారి  మరణవార్త నాకు చాలా చేదుగా అనిపించింది. విచారం ముంచుకొచ్చింది.

బుల్లి తెరపై తనదైన ఒక ముద్ర తో ప్రేక్షకులకి సన్నిహితుడు.

అన్నిటికి మించి.. మాకు సమీపంలో.. (పెనమలూరు) మాకు సురపరిచితమైన వాళ్ళు.

ఎక్కడో.. బీరకాయపీచు చుట్టరికం కూడా.

"నెమలికన్ను" బ్లాగ్ లో  సుమన్ కి శ్రద్దాంజలి చదివి నిర్ఘాంతపోయాను.

మేము చదివేది .. ఆంధ్రజ్యోతి పేపర్. అందులో ఒక్క ముక్క న్యూస్ కూడా లేకపోవడం వింతగా అనిపించింది.

మా ప్రక్కనే ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ..ఉంది. (ప్రియ ఫుడ్స్ ) ఆ  సంస్థకి సుమన్ గారు  ఎం .డి కూడా.

అయినా ఈ రోజు యదావిధిగా (విచిత్రంగా ) పని దినం జరిగింది.   సాయంత్రం  సంతాప సభ జరిగినట్లు విన్నాను .

ఒక  కళాకారుడు పైగా ఒక ప్రముఖుని   కుమారుడు ,ఒక సంస్థకి ఎం.డి.  వారి మరణం  పట్ల  వహించిన నిర్లక్ష్య వైఖరి చాలా బాధ కల్గించింది.

"కళంకిత  "  సీరియల్  లో  "సన్మతి నీయవే  భారతి సకల కళల హారతి" పాట గుర్తుకు వచ్చింది. ఎందుకీ కొందరు మనుషుల్లో.. అంతరాలు.!!?

 " సుమన్" గారికి శ్రద్దాంజలి.


29, జులై 2012, ఆదివారం

నివేదిత




ఈ మధ్య నేను సాహితీ నికేతన్ కి వెళ్లి కొన్ని బుక్స్ తీసుకురావాలని అనుకున్నాను. ఈ లోపు.. మా ఫ్రెండ్ రమ అక్కడికి వెళ్లి కాల్ చేసి నీకు ఏం బుక్స్ కావాలని అడిగింది. నేను సిస్టర్ నివేదిత గురించి బుక్ కావాలని చెప్పాను. ఎందుకంటే.. ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి.

నివేదిత
అంటే అర్ధం సమర్పణ.
సిస్టర్ నివేదిత ..ఎక్కడో విన్నట్టు ఉంది కదా! అందమైన వ్యక్తిత్వం కల ఇర్లాండ్ దేశపు యువతి. పదిహేడు సంవత్సరాలకే టీచర్ గా మారింది. ఇరువై అయిదు సంవత్సరాలకే ఒక పాఠశాల స్తాపించింది.
వివేవకనందుడి ప్రసంగం విని ఉత్తెజితురాలయింది . స్వామీజీ ఒక రోజు భారతీయ స్త్రీల గూర్చి చర్చిస్తూ ..మా దేశంలో అమ్మాయిలి ఇప్పటివరకు పాఠశాల ముఖం చూడలేదు. మహిళలు విద్యావంతులు అయ్యేవరకు మా దేశం ప్రగతి సాధించదు. అని మార్గరెట్ వైపు చూస్తూ అన్నారు. నావద్ద మా దేశపు అభివృద్ధి చదువుకోసం వివిధరకాల ప్రణాళికలు ఉన్నాయి. వారిని ఆ పనిలో నిమగ్నం చేయడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా? అని అడిగారు.

తనపట్ల స్వామీజికి ఉన్న విశ్వాసానికి మార్గరెట్ ప్రభావితురాలయింది. ఆమె తనకు అంత యోగ్యతా ఉందా అని ఆలోచనలో పడగా ఆమె ఆలోచనలు తెలుసుకున్న స్వామీజీ ప్రపంచాన్ని మార్చేటందుకు నిన్ను నీవు సిద్దం చేసుకోవాలి. అప్పుడు నీతో పాటు మరికొందరు వస్తారు. నీ ఆత్మని మేలుకొలుపు అన్నారు.

బీదరికం,అంటరానితనం,ద్వేషం తదితర చెడు లక్షణాలతో నిండిఉన్న భారత దేశాన్ని ఆమె గమనించి ఆమె అక్కడికి పయనమయ్యారు.

1898 లో ఆమె కలకత్తాకి వచ్చారు. ఆమె తొందరగానే బెంగాలి జీవనం లో ఇమిడిపోయి.. బెంగాలి భాష నేర్చుకుని ఆ బాషా సాహిత్యాన్ని కూడా అర్ధం చేసుకున్నారు.

మార్గరెట్ ని ..ఆ తరువాత వివేకానంద రామకృష్ణ మఠానికి తీసుకుని వెళ్ళారు. ఆమెకి శారదా దేవి ఆస్సీస్సులు లభించాయి. తరువాత మార్గరెట్ హిందువుగా మారి పూజలు చేసారు. ఆమెని వివేకానందుడు ఆశ్వీర్వదించి "నివేదిత" అని నామకరణం చేసారు. పాశ్చాత్య సంస్కృతీ భారతీయ సంస్కృతిగా పరివర్తన చెంది..మార్గరెట్ నివేదిత అయింది.

ఆమె ఒక పాఠశాల ని ప్రారంభించారు.

ఇంటింటికి తిరిగి పెద్దలని ఒప్పించి బాలికలను కూడగట్టుకుని స్త్రీ విద్య కై పాటు పడ్డారు తర్వాత ఆమె సిస్టర్ నివేదిత గా ప్రాచుర్యం పొంది..ప్రజలకి సేవ చేసారు.

కలకత్తా లో ప్లేగు వ్యాది వ్యాపించి లక్షలాది ప్రజలు మరణిస్తుండగా.. ఆమె చలించి పోయి .. స్వయంగా రోగులకి సేవ చేసారు.

మురికి వాడలని,మూత్రశాలని శుభ్రం చేసారు. అది అక్కడి ప్రజలు గమనించి సిగ్గుపడి ప్రజలు ముందుకి వచ్చారు. అలా రోగుల సేవలోనే అలసి..ఆమెకి అనారోగ్యం సోకింది.

ఆమె ఇతరదేశాలకి వెళ్లి భారతీయ సంస్క్రతి ని గూర్చి గొప్ప గా ప్రసంగాలు చేసారు.

భారత దేశం గురించి..కొంతమంది క్రైస్తవ మతస్తులు ప్రపంచానికి చెడు గా చిత్రీకరించడం గుర్తించి.. వాస్తవాలని, భారత దేశం అంటే ఎలా ఉందొ..అన్న విషయాలని.. ప్రపంచ దేశాలకి తన ప్రసంగాల ద్వారా తెలియజేసింది.

అప్పుడు పాశ్చాత్యుల దోరణి మారింది. ఆమె నడుపుతున్న పాఠశాల లకి ధన సహాయం చేసారు.

వివేకానందుడి మరణం తర్వాత ఆమెకి ఇంకా భాద్యత పెరిగింది. స్వామీజికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె పూర్తిగా ఈ దేశ సేవలోనే నిమగ్నమైంది. స్వాతంత్ర్యం కోసం కూడా పోరాటం చేసేలా ప్రోత్సాహం ని అందించింది.

వందేమాతరం గీతం ఆమె నడుపుతున్న పాఠశాల ల లో ప్రార్ధన గీతం అయింది.

ఆమె రాట్నం వడికేవారు. నూలు బట్టలే ధరించేవారు.. అది బెంగాలి ప్రజలకి ఆచరణ అయింది. బెంగాల్ విభజన జరిగినప్పుడు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో నివేదిత స్వయంగా పాల్గొన్నారు.రబీంద్ర నాథ్ ఠాకూర్,గోపాల కృష్ణ గోఖలే, మహత్మా గాంధీజీ , బాల గంగాధర్ తిలక్ మొదలైనవారు ఆమెని తరచూ కలుస్తూండేవారు.

బెంగాల్ వరదలప్పుడు చాలా విస్తృతంగా పర్యటన చేసి సేవలు చేసారు. తీవ్ర అనారోగ్యం కి గురిఅయింది తన సంపద,నగలు అన్నీ బేలూరు మఠం కి సమర్పించింది. దాని ద్వారా ఒక నిధిని ఏర్పాటు చేసి..భారతీయ మహిళలకు జాతీయ శిక్షణ ఇవాలన్నది ఆమె కోరిక.

తర్వాత ఆమె కొద్దికాలానికే మరణించారు.

హిమాలయ సానువుల్లో ఆమె సమాధి చేయ బడింది. ఆ సమాధి మీద "భారత దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన సోదరి నివేదిత ఇక్కడ దీర్ఘ నిద్రలో ఉంది" అని వ్రాయబడింది.

ఆమె స్థాపించిన పాఠశాల పెద్ద సంస్థగా అవతరించింది. అక్కడ వేలాదిమంది భారతీయ యువకులు,మహిళలు జాతీయవాదం గురించి శిక్షణ పొందుతున్నారు.

ఒక పాశ్చ్యాత్య వనిత భారతీయ సంస్క్రతి పట్ల ఆకర్షితురాలాయి.. భారతీయ తత్వంలో ఇమిడి పోయి.. సేవా దృక్పదంతో.. తన జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నివేదిత.. స్పూర్తికరం.

భారతజాతికి గర్వకారణం కూడా. ఆమెకి ఎటువంటి అవార్డులు,రివార్డులు లభించినా.. ఆమె అసలు పేరు మార్గరెట్ నోబుల్. ఈ రోజుకి బెంగాల్ ప్రజలకి సిస్టర్ నివేదిత ఆరాధ్య మైంది .

భారతదేశానికి సేవ చేయడానికి తర్వాత కూడా మరికొందరు వచ్చారు. కానీ వారు.. సేవ పేరిట మతాన్ని కూడా మోసుకునివచ్చారు. సేవ చేసారు. మతం ని జొప్పించారు.

అంతే కదా.. ! భారతీయత అంటే.. ఎవరు ఏం మోసుకుని వచ్చినా స్వీకరించింది. తన లో ఐక్యం చేసుకుంది.

సిస్టర్ నివేదిత గురించి చదవాలి అనుకుంటే "నివేదిత" పుస్తకం సాహిత్యనికేతన్..లో .. లభ్యం అవుతుంది.తప్పక చదవండి.

28, జూన్ 2012, గురువారం

మా "వాఘ్య"

అన్ని జన్మలకన్న ఉత్కృష్ట మైన మానవ జన్మ ఎత్తిన మనం ఇతర జీవుల పట్ల భూతదయ కల్గి ఉండటం చాలా మంచిది.అవసరం కూడా

మనతో పాటు ప్రకృతిలోని అన్ని జీవులకు జీవించే అవకాశాన్ని మనం కల్పించాలి.ఒక వేళ అలా కల్పించలేకపోయినా వాటి జీవన విధానానికి మనం భంగం వాటిల్ల నీయకుండా  ప్రక్కకు తొలగి వెళ్లిపోవాలి.

చాలా మంది ఇతర జీవుల పట్ల చాలా దయతో ప్రవర్తిస్తుంటారు.అలాటి వారిని చూసి నేను మనఃస్పూర్తిగా హర్షిస్తూ ఉంటాను.

 "మాలాకుమార్" గారి సాహితీ బ్లాగ్లో "మా వీధి మహారాణి కి పురుడొచ్చింది " చూసి వచ్చిన తర్వాత గుండె బరువెక్కింది.

అందుకు కారణం  మా "వాఘ్య"

"వాఘ్య" అంటే మరాఠా యోధుడు చత్రపతి శివాజీ పెంపుడు జంతువు. విశ్వాసానికి,స్వామి భక్తి కి నిదర్శనం.." వాఘ్య" శివాజీ మరణించిన తర్వాత అతని చితి మంటలలో దూకి తన స్వామి భక్తి ని చాటుకున్న కుక్క "వాఘ్య"

నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. ఛత్రపతి శివాజీ చరిత్ర అంటే మరీ ఇష్టం.

ఆ ఇష్టం వలనే.. మేము పెంచుకుంటున్న కుక్క పిల్లకి "వాఘ్య" అని పేరు పెట్టాను.

మేము పెంచుకోవడం అనేకంటే మా అబ్బాయి "నిఖిల్ చంద్ర " ప్రేమగా పెంచిన "వాఘ్య" అంటే బాగుంటుంది.

మా అబ్బాయి చాలా సున్నిత మనస్కుడు. తనకి మొక్కలన్నా,జంతువులన్నా వల్లమాలిన ప్రేమ.

నాకు పెళ్ళై  అత్తవారింటికి వెళ్ళే టప్పటికి మా ఇంట్లో రెండు "భైరవ"లు ఉండేవి.

ఒక దాని పేరు రాజు. రెండవది "నాన్సీ" (నాన్సీ రీగన్ ప్రభావం ఏమో..మావారు దానికి అలా నాన్సీ అని పేరు పెట్టారు)

ఈ రెండు మా ఇంటికి సింహాలవలె కాపలా .కాసేవి. చీమ చిటుక్కుమన్నా పసిగట్టి మమ్మల్ని జాగురుకత తో మేల్కొల్పేవి. మా పెయ్యలతోను,కోళ్ళ తోనూ కూడా ఆడుకునేవి . వాటి ఆటలు చూస్తే ఎంతొ సరదాగా ఉండేవి కూడా.

"రాజు" అయితే రాజు లాగే ఉండేది . ఇంత పొడవుగా ఉండేది. వెన్ను విరిచి నిలబడిందంటే..చూసేవాళ్ళకి పై ప్రాణాలు పైనే పోయేవి. వాటికి ఆహారం పాలు,అన్నం అప్పుడప్పుడు గ్రుడ్లు..అంతే!

అర్ధరాత్రుళ్ళు మా పొలం లో జొరబడి దొంగతనంగా అరటి తోటలో గెలలు నరుక్కుని వెళ్లేవారి పని పట్టాలన్నా  లేదా.. నీళ్ళ కాలువలకి అడ్డువేసి నీళ్ళు వాళ్ళ  పొలాలలోకి మళ్ళించు కునేవారిని గుర్తించాలనుకుని  యజమాని బయలుదేరి .. రాజూ ..వెళదాం . రా!  అనగానే అలా గస్తీ కి వెళ్ళేటప్పుడు.. యజమాని కన్న ముందే పరుగులు తీసి..వాళ్ళని నిలువరించేది. కదిలితే..కండలు ఊడిపోవాల్సిందే! అలాటి రాజు.ఏడెనిమిదే ఏళ్ళు మాతో ఒకరిగానే మెలిగేది. ఒకరోజు హటాత్తుగా మాయమయిపొయింది. చుట్టూ ప్రక్కల ఊర్లలో కూడా వెతికారు. ఎక్కడా కనబడలేదు. ప్రాణాలతో ఉంటే..మా రాజు.. ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్న తిరిగి వచ్చి ఉండేది. ఎవరో వచ్చి మత్తుమందు జల్లి బస్తాలో కట్టి వేసుకుని వెళ్లిపోయారని తర్వాత తెలిసింది. మా ఇంట్లో ఎవరు గ్రుక్కెడు మంచి నీళ్ళు త్రాగకుండా ఏడ్చి..ఏడ్చి..ఊరుకున్నాం.

ఇక నాన్సీ రాజు లేని దిగులుతో.. తొందరగానే చనిపోయింది.

తర్వాత మా ఇంట్లోకి మళ్ళీ పెంపుడు జంతువులని అంగీకరించలేకపోయాం కూడా.

మా అబ్బాయి కొంచెం పెద్దవాడు అయ్యాక తన చదువు కోసమని చెప్పి మా వ్యవసాయ క్షేత్రం ని వదిలి ఒక విలేజ్  లోకి షిఫ్ట్ అయ్యం. అక్కడ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. మా అబ్బాయి రోజు గుడి దగ్గర వాలే పావురాళ్ళని చూసి తను పావురాళ్ళని పెంచుకోవాలని ఇష్టపడ్డాడు.సరే అని వాళ్ళ నాన్నగారు రెండు పావురాలని తెప్పించి పంజరాలు ఏర్పాటు చేయించి ఇచ్చారు. వాటికి ధాన్యం ఆహారం గా పెట్టేవాళ్ళం. బాగా అలవాటు అయ్యేవరకు పంజరంలోనే ఉంచి..బాగా అలవాటు అయ్యాయి అనుకున్న తర్వాత   బయటకి స్వేచ్చగా వదిలేసేవాళ్ళం. అలా పావురాల కువ కువలతో.. మా ఇల్లు సందడిగాను ఉండేది. కాస్త అపరిశుభ్రం గాను ఉండేది. అది నాకు అసలు నచ్చేది కాదు. ఒక విధమైన నీచు వాసన ..ఆ వాసన రాకుండా బోలెడంత శ్రమ పడాల్సి వచ్చేది. అందుకనే పంజరాలని మా ఇంటి బయట ఉన్న నూరు వరహాల చెట్టుకి వేలాడదీసాను.అందులో అప్పుడప్పుడు మాత్రమే ఉండి..ఎక్కువ సేపు క్రిందనే తిరిగేవి.

మా అబ్బాయి స్కూల్ నుంచి రావడం వాటిని చేతుల్లోకి తీసుకోవడం..వాటికి కబుర్లు చెప్పడం,ధాన్యం వేయడం..ఇలా పొద్దంతా గడిపెసేవాడు. హోం వర్క్ లు చేయకుండా అలా చేస్తే ఊరుకుంటానా..! బాగా కోప్పడే దానిని.

ఒకరోజు తెల్లవారేసరికి రెండు పావురాళ్ళు విగత జీవులై పడి ఉన్నాయి.ఇక మా అబ్బాయి ఏడుపు చూడలేము.అలా ఏడ్చాడు అన్నమాట.. పావురాళ్ళ మరణం కి కారణం ఏమంటే అర్ధరాత్రి ఒక పిల్లి కోడి పిల్లలని తినడానికి వచ్చి అవి దొరకక పావురాళ్ళ పై దాడి చేసి మెడని కొరికేసి చంపేసింది.

ఇది జరిగిన కొన్నాళ్ళకి మా ఇంటి వెనుక భాగంలో బాడుగ కి ఉండే ఓ..ముస్లిం కుటుంబం వారికి పెద్ద ఆల్షేషియన్ డాగ్ ఉండేది. వాళ్ళ కుటుంబానికి దానికి ఆహారం పెట్టడం తలకి మించిన భారం అయ్యేది. ఆ ఆల్షేషియన్ డాగ్ కి వాళ్ళు పెట్టె ఆహారం చాలక చాలా కోపంతో.. కట్టేసిన గొలుసులని కూడా తెంచేసి  మీద పడేది. ఓ.. నాలుగు అడుగుల పొడవు వంద కేజీలు బరువు ఉండేదేమో కూడా.. దానిని అదుపు చేయాలంటే చాలా కష్టం అయ్యేది.

ఆ కుక్క యజమాని ..నాకు ఒక విషయం చెప్పారు. మేము ఈ కుక్కని పెంచలేకపోతున్నాం..ఎవరికైనా ఇచ్చేద్దాం అంటే మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఆ కుక్క చూలింత కూడా. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు తీసుకుని దీని ని అమ్మేస్తాం. అప్పటి వరకు మీరు ఒక పూట ఆహారం పెట్టారా ..అని అడిగింది. నేను సరే నని ..ఆ కుక్కకి ఆహారం పెట్టేదాన్ని.ఓ..అరకేజీ బియ్యం నాలుగు గ్రుడ్డ్లు, వాటితో పాటు..ఓ..అరకేజీ మాంసం కూడా దానికి పెట్టాల్సి వచ్చేది. నేను తప్ప ఆ కుక్క సమీపం కి ఎవరు వెళ్ళేవారు కాదు. నేను ఆహరం పెడతాను కాబట్టి నన్ను ఏమి అనేది కాదు.
ఆ కుక్క..ప్రసవించి మూడు పిల్లలు పెట్టింది. రెండు ఆడ + ఒక మగ. పుట్టిన నాలుగు రోజులకి ఆడ కుక్క పిల్లలని ఒక్కోదానిని ఆరు వేల రూపాయలకి ఆ ముస్లిం కుటుంబం వాళ్ళు అమ్మేసుకున్నారు. ఇక మిగిలింది మగ కుక్క పిల్ల. (ఆడ కుక్క పిల్లలకి రేటు ఎక్కువట.ఉత్పత్తి కోసమేమో!)

మా అబ్బాయి రోజూ  ఆ కుక్క పిల్లని చూసి మురిసి పోయేవాడు కాని తల్లి కుక్కని చూసి భయపడి దగ్గరికి వెళ్ళేవాడు కాదు.

మనం ఆ బుజ్జి కుక్క పిల్లని పెంచుకుందాం అమ్మా ! అని అడిగాడు.ఆ బుజ్జి ముండని చూస్తే..నాకు ముద్దు వచ్చింది.అలాగే అన్నాను.నేను తల్లి కుక్కకి ఆహారం ఇవ్వడం మూలంగా నాకు ఆ బుజ్జి ముండని ఫ్రీగా ఇచ్చేసారు.
సాయంత్రానికి తల్లిని అమ్మేసారు. అలా తల్లిబిడ్డల రుణాన్ని కాష్ చేసుకోవడం బాధ అనిపించిది కాని..ఆ ఆల్షేషియన్ పెంచడం మాత్రం చాలా కష్తం  పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు..? అని బాధపడ్డాను

ఇక మా ఇంట్లో పెరిగే బుజ్జి కుక్క పిల్లకి "వాఘ్య" అని నామకరణం చేసాను. దానికి తల్లికి లా మాంసాహారం ఇవ్వకూడదనుకుని ఒక్క పాలు మాత్రమే అలవాటు చేసాం. అప్పటికి ఈ పెడి గ్రిల్ గట్రా ఉంటాయని నాకసలు తెలియదు.మా "వాఘ్య" కి స్నానం చేయించడం పాలు త్రాగించడం,దానిని ముద్దులాడటం మా అబ్బాయి వంతు.

"వాఘ్యా..అని పిలవడం ఆలస్యం.. పరుగులు పెట్టేది. నోరు తెరిచిందా  ఆపడం భలే కష్టం గా ఉండేది. వాఘ్యా..అన్న పేరు.. చాలా ఫేమస్.అయి కూర్చుంది అడిగిన వారికి అడగని వారికి అందరికీ వాఘ్య అంటే ఎవరో దాని స్వామి భక్తి ఏమిటో తెగ చెప్పేసేదానిని కూడా!. భలే పేరు పెట్టారండీ.వెదికి పెడతారు అన్న కాంప్లిమెంట్ వచ్చేది.  అది నాకు చాలా గర్వంగాను ఉండేది.

నెల్లూరు జిల్లాలో నవంబర్ మాసం అంటే..తుఫాను ల కాలం అన్నమాట. ఆ సంవత్సరం ఎడతెగని వర్షాలు కురిసాయి. నాకు విపరీతమైన జలుబు  ఎన్ని మందులు వాడినా కంట్రోల్ అయ్యేది కాదు. అప్పుడు డాక్టర్ అడిగారు..మీ ఇంట్లో పెంపుడు జంతువులూ ఉన్నాయా..? అని

నేను మా వాఘ్య గురించి చెప్పాను. అయితే దానికి దూరంగా ఉండండి అని చెప్పారు. అంతే! ఇక వాఘ్యకి మా ఇంట్లో ప్రవేశం లేకపోయింది. బయట వరండాలో కట్టేసే వాళ్ళం.వాఘ్య చిన్నది కాబట్టి దానికి టాయిలెట్ హాబిట్స్ ఇంకా బాగా అలవాటు కాలేదు. అనారోగ్యం వల్ల శుభ్రం చేయాలంటే నాకు చాలా చిరాకు వచ్చేది. అప్పట్లో చాలా మానసిక మైన ఒత్తిడి ఉండటం వల్లనేమో నేను ఎలర్జికల్ ఆస్తమా కి గురి అయ్యాను.

అందుకని "వాఘ్య" ని వరండాలో నే ఉంచడం వల్ల వర్షానికి తడచి పోయేది. వర్షపు జల్లుల నుండి తప్పించుకుని వర్షం పడని చోటున తలదాచుకోవడానికి నేను అవకాశం ఇవ్వలేదు. వాఘ్యాని గొలుసుతో బందించి వేసాను. అలా రెండు రోజులు తడచి దానికి జ్వరం వచ్చి కన్ను తెరవకుండా పడి ఉండేది. మా వారు పశువుల హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఇంజ్జక్షన్ చేయించారు. కానీ ఫలితం లేకపోయింది. "మా వాఘ్య" చనిపోయింది.

చనిపోయిన "మా వాఘ్య" ని చూసి ..మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు. నువ్వే.. శుభ్రం శుభ్రం అంటూ..వర్షంలో కట్టేసి..దానిని చంపేసావు..నువ్వే చంపేసావు.. నువ్వే చంపేసావ్ !! అని నన్ను పదే పదే కోపంగా,రోషంగా అన్నాడు.

నేను మనసులో ఎంతో.. ఏడ్చాను. (ఇప్పటికీ  ఆ విషయం తలచుకుంటే నాకు దుఃఖం ముంచుకొస్తుంది. ఇప్పుడు కళ్ళ నీళ్ళు కారుతున్నాయి) నేను తప్పు చేసానని అర్ధం అయింది. మా అబ్బాయి నన్ను నిందించడంలో తప్పు లేదనికూడా అనుకున్నాను.

జ్వరంతో..కళ్ళు తెరవకుండా ఉన్నప్పుడు కూడా.. వాఘ్యా.. అని పిలిస్తే..మెల్లగా కనులు విప్పి తోక ఊపి మళ్ళీ నీరసంగా కళ్ళు మూసుకున్న మా వాఘ్య నే గుర్తుకు వస్తూ ఉంటుంది. వాఘ్యని మరువడం నా వల్ల కాలేదు. (అంతర్లీనంగా దాని మరణం కి కారణం నేనే అని ఏమో)

మా అబ్బాయిని వాఘ్య మరణం నుండి బయటకి తీసుకు రావడం చాలా కష్టం అయింది. వెటర్నరీ డాక్టర్ వచ్చి .. వాఘ్య తల్లి కి వ్యాక్సిన్ సరిగా వేయించక పోవడం వల్ల వాఘ్య మాత్రమే కాదు..తనతోపాటు పుట్టిన పిల్లలు అన్నీ కూడా చనిపోయినవి ..అని చెప్పాక గాని .. కొంచెం శాంతపడినట్లు కనబడలేదు. వాఘ్య..వాఘ్య అని మాతో పిలిపించుకుని.. పసి దానిగా ఉండగానే మాకు దూరమైన వైనం నాకు చాలా  చాలా బాధాకరం.

నిజానికి పుట్టిన తర్వాత ఇమ్యునైజేషన్ కోసం వ్యాఘ్య కి వాక్సినేషన్ వేయించాలని కూడా నాకు తెలియదు. అలా జరిగిపోయింది అంతే!

మా అమ్మ..అనేవారు..ఈ ఇల్లు బాగో లేదమ్మా, బిడ్డ ముచ్చట పడి పావురాళ్ళు పెంచుకుంటే చనిపోయాయి,కుక్క పిల్లని పెంచుకుంటే అదీ చనిపోయింది. నీకు  కూడా ఆరోగ్యం సరిగా లేదు..అని బాధపడేవారు. నేను కూడా ఏమిటో ఇలా జరుగుతున్నాయని  భయపడ్డాను కూడా ! అప్పటి పరిస్థితి అది.

ఓ..రెండు ఏళ్ళ క్రితం కూడా మా అబ్బాయి..మనం కుక్కపిల్లని పెంచుకుందాం  అమ్మా  అని అడిగితె  నేను తీవ్రంగా వ్యతిరేకించాను.మన ఇంట్లో మరో వాఘ్య ని ఉండటం చూడలేను "వద్దు" అన్నాను.

"వాఘ్య " ని నేను మరువలేను. ఆ చిన్ని ప్రాణం మరణానికి నేను కారణం అయ్యానేమో అని నాకు తీరని వేదన.

మా అబ్బాయికి నేనెప్పుడు ఆ విషయంలో సారీ చెపుతుంటాను .

అలాగే ఏ మాత్రం భూతదయ లేకుండా ఓ..చిన్ని ప్రాణం పట్ల నేను చూపిన నిర్దయ.. నన్ను నేను క్షమించుకోలేనిది. వ్యక్తిగా నాలో ఉన్న ఈ లోపం నన్ను వెంటాడేది వేదించేది.

ఇలా పంచుకున్నందుకు.. బాధ నుండి నేను కొంచెం తెరిపిన పడ్డాను అనుకుంటూ...

స్వామి భక్తికి ,విశ్వాసానికి నిదర్శనం ఈ అసలైన "వాఘ్య"



7, నవంబర్ 2011, సోమవారం

మూగబోయిన ‘ భూపేన్ ’ రాగం

భూపేన్ హజారిక ఆలపించిన   గీతాలు 
నేను ఎంతగానో ఇష్టపడే ఓ..సంగీత దిగ్గజం. వారి మరణం చాలా బాధ కల్గించింది. వారి పాటలు ఒక నాలుగు పరిచయం తో పాటు మరింత వివరంగా ఇక్కడ లింక్ లో.
మూగబోయిన ‘ భూపేన్ ’ రాగం
సంగీత దిగ్గజం భూపేన్ హజారికా కన్నుమూత
ముంబై: అపురూప స్వరఝరి ఆగిపోయింది. స్వాతిముత్యపు మెరుపులాంటి సాహిత్య పుష్పం నేలరాలింది. అస్సాం అడవుల నుంచి మహానగరాల దాకా సాగి, కోట్లాది గుండెల్లో పులకరింతలు రేపిన శ్రుతిలయల బాటసారి ప్రస్థానం ముగిసింది. సంగీత, సాహిత్య దిగ్గజం భూపేన్ హజారికా జీవనగానం అస్తమించింది. ఆయన శనివారమిక్కడి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. నాలుగు నెలలకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ల హజారికా సాయంత్రం 4.30 ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. నిమోనియా కారణంగా పలు అవయవాలు పనిచేయకపోవడంతో ఆయన చనిపోయారని ఆస్పత్రి ప్రతినిధి జయంత నారాయణ్ సాహా చెప్పారు. నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని, వెంటిలేటర్, డయాలసిస్‌పై ఉన్నారని ఆస్పత్రి సీఈవో డాక్టర్ రామ్ నారాయణ్ చెప్పారు. హజారికా అంతిమ క్షణాల్లో ఆయన జీవిత సహచరి, దర్శకురాలు కల్పనా లాజ్మీ ఆయన పక్కనే ఉన్నారు. హజారికా శ్వాస సమస్యతో జూన్ నెలాఖర్లో ఈ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే ఐసీయూ గదిలో ఉన్నారు. డయాసిస్ చికిత్స పొందారు. గత నెల 23న ఆరోగ్యం బాగా క్షీణించి, నిమోనియా సోకింది. చిన్న శస్త్రచికిత్స కూడా జరిగింది. సెప్టెంబర్ 8న ఆయన ఆస్పత్రిలోనే అభిమానుల గీతాలాపన మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు జరుపుకున్నారు. హజారికా కెన్యాలో జన్మించిన భారత జాతీయురాలు ప్రియమ్‌ను పెళ్లాడారు. వారి సంసారం కొన్నేళ్లే సాగింది. వారికి తేజ్ హజారికా అనే కుమారుడు జన్మించాడు. తర్వాత హజారికా కళాత్మక చిత్రాల దర్శకురాలు కల్పనా లాజ్మీకి దగ్గరయ్యారు. మరణించేదాకా ఆమెతోనే ఉన్నారు. వారిది మూడు దశాబ్దాల అనుబంధం.
స్వరలోక సంచారి..: బహుముఖ ప్రజ్ఞశాలికి అచ్చమైన ఉదాహరణ హజారికా. ఆయన గాయకుడు, సంగీతకారుడు, కవి, పాత్రికేయుడు, నటుడు, రచయిత, సినీనిర్మాత. ‘దిల్ హూమ్ హూమ్ కరే..’, ‘ఓ గంగా బెహతీ హో..’ లాంటి మరపురాని గీతాలు ఆలపించిన ఆయన సాహిత్య, సినీ రంగాల్లో కూడా తనదైన ముద్ర చూపారు. మంద్ర, ఉచ్ఛ స్వరాల మధ్యన ఉండే విలక్షణ స్వరంతో సాగే ఆయన గానం గురించి చెప్పాలంటే పదాలు చాలవు. ఆయన సుసంపన్న అస్సామీ సంప్రదాయ, గిరిజన సంగీతాల నుంచి అద్భుతం, అపురూపమైన స్వరజగతిని సృష్టించి శ్రోతల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. దక్షిణాసియా కళారంగానికి ఆయన విశిష్ట ప్రతినిధి, అస్సామీ రచయితల్లో ప్రముఖుడు. ఆ భాషలో వెయ్యికిపైగా గీతాలు రాశారు. కథలు, వ్యాసాలు, యాత్రారచనలు, కవితలు, పిల్లల పాటలు కూడా రచించారు. పిల్లాపెద్దలు ఆయన్ను ఆప్యాయంగా ‘భూపేంద్ర’ అని పిలుచుకుంటారు. అస్సాంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి గుర్తుగా ఆయనను ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’ అని అంటారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా ఆయన వీరాభిమాని. ఓ సభలో హజారికాతో తనకిష్టమైన పాట ‘మోయ్ ఎతి జజాబోర్’ను పాడించుకున్నారు.
గిరి‘జానపదమే’ ప్రేరణ.. 

హజారికా తనను తాను సంచారి(జజాబోర్)గా అభివర్ణించుకునేవారు. ఆ సంచారమే ఆయనను కళావేత్తగా తీర్చిదిద్దింది. గిరిజన జానపద సంగీతం తనకు ప్రేరణ అని ఆయన చెప్పేవారు. ‘గిరిజన సంగీతం వింటూ పెరిగా. నాకు గానకళా వారసత్వం మా అమ్మనుంచి వచ్చింది. ఆమె నన్ను నిద్రపుచ్చడానికి జోలపాటలు పాడేది. అందులో ఓ పాటను ‘రుదాలి’ చిత్రంలో వాడుకున్నా’ అని తెలిపారు. ఆయన అమెరికాలో చదువుకుంటున్నప్పుడు ప్రఖ్యాత నల్లజాతి గాయకుడు పాల్ రాబ్సన్‌తో పరిచయమేర్పడింది. రాబ్సన్ పాట ‘ఓల్డ్ మేన్ రివర్’ స్ఫూర్తితో హజారికా ‘బిస్త్రినో పరోరే’(హిందీలో ఓ గంగా బెహతీ హో) గీతాన్ని స్వరపరిచారు. ఇది వామపక్షాల కార్యకర్తలకు దాదాపు జాతీయగీతమైంది. విద్యాభ్యాసం తర్వాత హజారికా ఇండియన్ పీపుల్స్ థియేటర్ మూవ్‌మెంట్(ఇప్టా)లో పనిచేయడానికి ముంబై చేరుకున్నారు. సలీల్ చౌధురీ, బలరాజ్ సాహ్నీ ఇతర మార్క్సిస్టు మేధావులతో కలిసి పనిచేశారు. ఆ నగరంతో మమేకమయ్యారు. 

సినిమాల్లో..:హజారికా అస్సామీ, బెంగాలీ, హిందీ సినిమాలకు వందలాది పాటలు రాసి, స్వరకల్పన చేశారు. శకుంతల,ప్రతిధ్వని తదితర అస్సామీ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. వాటికి సంగీతమూ అందించారు. పాటలూ పాడారు. కల్పనా లాజ్మీతో కలిసి రూపొందించిన రుదాలి, ఏక్‌పల్, దార్మియాన్, దామన్, క్యోన్ వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చాయి. 
తీరని లోటు:హజారికా మృతిపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కళారంగానికి చేసిన సేవలు మరపురానివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. మృణాల్‌సేన్, మహేశ్‌భట్ తదితర సినీ ప్రముఖులు హజారికాతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 
దుఃఖసంద్రంలో కల్పనా లాజ్మీ..
హజారికా అస్తమయంతో ఆయన జీవిత సహచరి కల్పనా లాజ్మీ విషాదంలో మునిగిపోయారు. కన్నీళ్ల పర్యంతమవుతూ ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘నా తండ్రిని, సోదరుడిని, ప్రేమికుడిని, భర్తను, స్నేహితుడిని కోల్పాయా.. ఆయన కళాకారుడే కాదు సంఘ సంస్కర్త కూడా’ అని చెప్పారు. 
జీవిత విశేషాలు..
జననం: అస్సాంలోని సాదియాలో 1926 సెప్టెంబర్ 8. ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించారు. 
విద్యాభ్యాసం: 1942లో గువాహటిలో ఇంటర్మీడియెట్, 1944లో బెనారస్ హిందూ వర్సిటీ నుంచి బీఏ, 1946లో పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ. తర్వాత కొలంబియా వర్సిటీలో మాస్‌కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ. 
తొలిపాట: 12 ఏళ్లప్పుడు అస్సామీ చిత్రం ఇంద్రమాలతి(1939)లో
చివరి పాట: ఈ ఏడాది విడుదలైన ‘గాంధీ టు హిట్లర్’ సినిమాలో ‘వైష్ణవ జన్..’
అవార్డులు, పదవులు: జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడు(1976లో.. చమేలీ మేమ్‌సాబ్ చిత్రానికి), అంతకుముందు కొన్ని చిత్రాలకు రాష్ట్రపతి పతకాలు. 1977లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 1992లో దాదా ఫాల్కే అవార్డులు.1967-72 మధ్య ఎమ్మెల్యే(అస్సాం)గా.1999-2004 మధ్య సంగీత నాటక అకాడమీ చైర్మన్.
అరుదైన ‘ఆవిష్కరణ’: జీవించి ఉండగా తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్నారు. అఖిల అస్సాం విద్యార్థి సంఘం గువాహటిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆయన 2009లో ఆవిష్కరించారు.
"సాక్షి"వార్తా  పత్రిక  లో  ప్రచురించిన  భాగం  ఇది

20, అక్టోబర్ 2011, గురువారం

"సోది చెపుతానమ్మ సోది"

నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు అసలే కరంట్ కోత. రెండవ వేసవి కాలం తలపిస్తున్న రోజులు.  కాస్త గాలి పోసుకుందామని దినపత్రిక చేతిలో పట్టుకుని వరండాలోకి వచ్చాను.

ఇంటిముందు నుండి "సోది చెపుతానమ్మ సోది" అని సాగదీసి పలుకుతూ.. రిపీట్ గా భలే రిధమిక్ గా అనుకుంటూ వెళుతుంది సోది అమ్మి.    వెళుతున్న ఆమె వైపు నేను ఆసక్తిగా చూడటం గమనించి.. సోది చెబుతాను బిడ్డా!రమ్మంటావా? అనడిగింది. ఉహు..వద్దు !  తల అడ్డంగా తిప్పుతూ  అన్నాను. ఆమె ముందుకు కదిలింది.


మా  చిన్నప్పుడు సంగతి గుర్తుకు వచ్చింది. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు  మా పందిట్లో బిచాణా  పెట్టి మరీ అమ్మలక్కలు సోది చెప్పించుకునేవాళ్ళు.  నమ్మనివాళ్ళు నవ్వుకోవడం,నమ్మినవాళ్ళు సంతోష పడటమో, దిగులుపడటమో గుర్తుకొచ్చింది.

సాధారణంగా పల్లెలలో గేదె సరిగ్గా పాలు ఇవ్వకపోయినా, బుడ్డోడికి జ్వరం తగిలినా సోది అడగడం సోది అమ్మి  ఏం చెప్పిందో అలాగే చెప్పినట్లు  చేయడం చేసేవారు.

"అమ్మ కూడా అప్పుడప్పుడు సోది దగ్గర కూర్చునేది. ఆమె  సోదిలోకి ఎప్పుడూ.. మా చనిపోయిన మేనత్త వచ్చి ఆమెని మర్చిపోయారని పండగకి చీర కూడా పెట్టడంలేదని ఆక్షేపించేది.

అప్పుడు అమ్మ ఒక కొత్త చీర కొనడం ఆమె పేరిట దేవుడి దగ్గర పెట్టడం తర్వాత ఎవరైనా  ముత్తయిదవ  కి  ఆ చీర ఇవ్వడం చేసేది.

ఒకోసారి మా నాన్న గారి మేనత్త సోదిలోకి వచ్చేది. ఆమె వచ్చిందంటే ఏడుపుతోనే మొదలు. మా నానమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. ఐదుగురు అన్నదమ్ముల మద్య ఒకే ఆడపడుచు. నూట పాతిక ఎకరాల భూస్వాముల కుటుంబంలో అల్లారుముద్దుగా పెరిగి మా ఊరిలోనే మరో గొప్పింటి కోడలిగా వెళ్లి .కట్న కానుకలు పేచీలవల్ల బావిలో దూకి ఆత్మ హత్య చేసుకుందట. ఆమె సోదిలోకి వస్తే అందరూ భయపడేవారు.

 నాకు అప్పుడప్పుడే..జ్ఞానం వికసించి   కాస్త హేతుబద్దమైన ఆలోచనలు పుట్టుకొచ్చి .. "అమ్మా! నిజంగా చనిపోయినవారు అలా సోదిలోకి వస్తారా? వట్టిదే !  నువ్వు నమ్మబాకు, ఆ సోది అమ్మి నోటికొచ్చింది ఏదో చెపుతుంది.. అంతే! అనేదాన్ని.  నమ్మడం నమ్మకపోవడం కన్నా..ఆ సోదమ్మికి ఓ నాలుగు రూపాయలు, ఒక చాటెడు నూకలు ఇస్తే ఏం పోద్దిలే! అనేది అమ్మ.

నానమ్మ అయితే.. సాక్షాత్ కలియుగదైవం వెంకటేశ్వర స్వామే ఎరుకల రూపంలో వచ్చి జరగబోయే దాన్ని సోది రూపంలో చెప్పి వెళ్ళాడట. మనకైతే కుల దైవం వస్తాడు.  ఇప్పుడు నువ్వలా అనకూడదు, తప్పు అనేది.  లెంపలు వేసుకో అనేది కూడా ! సరే, పెద్దవాళ్లకి ఎదురు చెప్పలేం కదా!  లెంపలేసుకోకపోయినా మౌనంగా ఉండేదాన్ని.

 ఆ సోది  అమ్మి   చెప్పే మాటలు వింటూ.. ఎవరికి ఏం చెప్పిందా..? వాళ్ళకి చెప్పిందే ఇంకొకరికి ఇంకో రూపంలో..ఎలా చెపుతుందా? గట్టిగా అడిగితే  టక్కున చేతిలో మీటుతూ ఉన్న సోది బుర్ర (గుమ్మడికాయ బుర్ర) కింద విసిరి పడేసి పలాయన వాదం చేసేది. డబ్బు దశకం ముందే ఇచ్చేసే వాళ్ళు  కాబట్టి మరో మాటకి అవకాశం ఉండేది కాదు.

మా పక్కింటి పిన్నో.. ఎదిరింటి అత్తో.. మేము అనుకున్నది రాలేదు.. సోది దండగ అని తిట్టుకునే వాళ్ళు. అలా తిడితే పాపం తగుల్తుంది, కులదైవం కోప్పడతాడు అని అమాయకంగా ముఖం పెట్టి చురకవేస్తూ హెచ్చరించేదాన్ని. పిల్లలు చదువుకుని చెడిపోతున్నారు..అని దులపరించుకుని వెళ్ళేవారు. ఆ కాసేపూ.. మా పందిరి క్రింద తుఫాను వచ్చి వెలిసినట్టు ఉండేది. 

ఇలా నేను ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంటూనే ఉన్నాను. అంతలో మళ్ళీ రిటన్ లో ఇటే  వస్తుంది సోది అమ్మి.

తరాలు మారాయి కదా సోది ఏ విదంగా చెపుతుందో.. చూద్దాం అని ఆసక్తి కలిగి సోది చెప్పాలి రామ్మా! అని పిలిచాను.

 ఆమె లోపలి వచ్చి కాసిని చల్లని మంచినీళ్ళు అడిగి ఇప్పించుకుని తాగి  వరండాలో ఫ్యాన్ కింద తీరిగ్గా   కూర్చుంది . మా ఇంటిలో చేట అటకెక్కి కూర్చుంది. మా పక్కింట్లో  చేట  అడిగి తీసుకుని ఏం పుచ్చుకుంటావు?  అడిగాను. పాతిక రూపాయలమ్మా..అంది. రోజుకి ఎన్ని సోదిలు  చెబుతావ్ ? అని అడిగి ఆదాయం లెక్క వేయాలనుకుని. మా నానమ్మ మాట తప్పు అలా అడగకూడదు అని చెప్పింది గుర్తుకొచ్చి  ఆ చేటలో బియ్యం ఒక కేజీ కి తక్కువ కాకుండా పోస్తూ ఇప్పుడు ఈ సోది అవసరమా? ముప్పయి అయిదు రూపాయల ఖరీదైన బియ్యం ఓ పాతిక రూపాయల ఖర్చు అనుకుంటూనే.. చేట బయటకి తెచ్చి పాతిక రూపాయలు చేటలో పెట్టి ఇంతలోనే ఎన్న చేట ఆలీ డైలాగ్స్ గుర్తుకొచ్చి నవ్వుకుంటూ..

కాస్త పసుపు-కుంకుమ ,  వక్క పెట్టి.. అమ్మ,నానమ్మ పెట్టిన దణ్ణాలని మనసులో గుర్తు తెచ్చుకుంటూ  ఆ చేటని తాకుతూ దణ్ణం పెట్టుకున్నాను. 

సోది అమ్మి.. సోది బుర్రని మీటుతూ.. సోది మొదలెట్టింది.. 

మధుర మీనాక్షి   పలుకు 
కంచి కామాక్షి పలుకు
బెజవాడ కనక దుర్గమ్మ పలుకు
జొన్నవాడ కామాక్షమ్మ పలుకు 
శ్రీ శైల భ్రమరామ్మ పలుకు 
సకల దేవతలు పలుకు..
అమ్మ పలక మన్న పలుకు చెప్పటానికే   వచ్చా 
అడిగింది అడిగినట్లు చెపుతా.. అడగంది అడిగినట్లు చెపుతా.. 
మాట చెప్పి పోదామనే వచ్చినా బిడ్డా.. 
అమ్మ పై నమ్మకం పెట్టుకుని అడుగు.. 
జరగబోయేది చెపుతా జరిగింది చెపుతా.. వినుకోయే తల్లి..
అని నా ఎడమ చేయి అందుకుని..
నీ ఎడమ భుజం తాకిందంటే పుట్టింటి  సోది అడుగుతున్నవని అర్ధం,కుడి భుజం తాకిందంటే మెట్టినింటి  సోది అని అర్ధం. 

నేను చెపుతున్న సోది ఏమంటే.. 
అంటూ.. నా పుర చేయిని ఎడమ భుజం తాకించి.. ఈ సోది అడుగుతున్నవే బిడ్డా.. ! ఎందుకడుగుతున్నవంటే.. ఈ దినాలు వచ్చిన్నయంటే నన్ను తల్చుకుని కన్నీరు మున్నీరు అవుతావే బిడ్డా!అంది.. 

నేనేమి తలచుకోవడం లేదు ఎవరు నువ్వు.. ? అడిగాను.

ఎవరని అడుగుతావేటి బిడ్డా.. నన్ను మర్సిపోయావా?  ఈ సోది చెప్పేటి చెయ్యి మగవాళ్ళయితే  గడ్డం అంటుతుంది. ఆడవాళ్ళైతే  మొఖాన ఉన్న బొట్టు అంటుకుంటుంది. నేను చెప్పేటి ఈసోది.. ఆడ కూతురి సోది అంటూ నా నుదుట బొట్టుని అంటించింది. 

అయితే నువ్వు ఆడమనిషివా?  అయితే నాకు ఏమి అవుతావు..అన్నాను.. నిజంగా ఆ టైం లో నేను పక్కాగా మా అమ్మ  సోది అమ్మిని ఎలా  ప్రశ్నించేదో అలాగే  గుర్తుకు తెచ్చుకుని మరీ అడిగాను అన్నమాట.

ఏమవుతావంటే ఏమి చెప్పెనే బిడ్డా!నువ్వు నాకు బాగా కావల్సినదానివి, నువ్వు ఏటికి ఎదురీదుతున్నావ్ ?  నీకు కష్టం వచ్చినప్పు డల్లా  నేను నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను.నీకు నీ దారిలో ఎదురేలేదు బిడ్డా! అన్నీ బాగానే ఉన్నా  నన్ను మరసి పోయావే బిడ్డా ..మీ పుట్టుకకి కారణం అయిన వారిని పట్టించుకోవడం లేదే బిడ్డా అంది..

“నువ్వు ఎవరు ఎందుకు అలా అంటున్నావ్? నేను ఏటికి ఎదురీదడం లేదు..ఎవరిని పట్టించుకోకుండా ఉండనూ  లేదు.. అబద్దం చేపుతున్నావ్ “అన్నాను వాదనగా.  

“నేను నిజమే చెపుతున్నా.. బిడ్డా ! నీ ఇంటి ఇలవేలుపు చెపుతున్నాను బిడ్డా!”

“ఎవరు నా ఇంటి ఇలవేలుపు” ..మళ్ళీ ప్రశ్న.

“అడిగిందే అడుగుతున్నావ్? చెప్పింది వినాలి..బిడ్డా ! “

“నీ ఇంటి ఇలవేలుపంటే.. ఆ ముక్కంటి దేవుడే బిడ్డా, ఇది కూడా అబద్దమంటావా?   నేను చెప్పింది ఇనుకుని  జాగ్రత్త పడాలే బిడ్డా! ఆ శ్రీశైల మల్లికార్జున్డే పలికిస్తా ఉండే, నమ్మవే బిడ్డా! “

నాకు కాస్త కాదు.. బాగానే  నమ్మకమే కలిగింది.. 

“ఏం చెప్పలనుకున్నావు?  ఏం చేయాలి నేను.?” అన్నాను.

“నీ బిడ్డని చూసుకున్నట్లే  నీకు జనమ ఇచ్చినవాల్లని  బాగా చూడాలే బిడ్డా!  అత్తమామాలని బాగా చూడాలి బిడ్డా” అంది.  అన్నీ మంచి మాటలే చెపుతుంది అనుకున్నాను. 

“నీ పాడి పంట నీ బిడ్డల బాగోగులు అన్నీ నేను చూస్తూ ఉంటాను నువ్వు మాత్రం నన్ను మర్సిపోకుండా.. పండగకి పబ్బనికి మాత్రమే కాదు రోజు గురుతు ఉంచుకుంటానే  ఉండావ్. నాకు సంతోషంగానే ఉంది బిడ్డా.. నీ తోడబుట్టిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి బిడ్డా.. నీ తోడబుట్టిన వాళ్లకి కోపం ఎక్కువ. నువ్వే సర్దుకుని ఉండాలే బిడ్డా”  అని  చెపుతూ ..నా ముఖం వంకే చూస్తూ.. సోది పరిసమాప్తి చేద్దామని చూస్తున్నట్లుంది. 

“అన్నీ బాగానే ఉన్నాయి, ఇంతకి నువ్వు ఎవరు..నాకేమవుతావు?”  అడిగాను మళ్ళీ.. 

ఈ సారి కోపంగా “ఎన్ని సార్లు అడుగుతావే బిడ్డా! నేను   నిన్ను కన్నకడుపే బిడ్డా” అంటూ నా ఉదర భాగాన్ని  తాకి చూపి టక్కున సోది బుర్ర కింద పెట్టేసింది. మెల్లగా అన్నీ సర్దుకుని బయలుదేరింది. 

ఇంక నాకు మాటలు లేవు.. కళ్ళు రెండు సెలయేరులయ్యాయి. కారుమబ్బులు కరిగినట్లు ధారాపాతంగా కన్నీటి  వర్షం.

సోది అమ్మి సోది ని నమ్మానో లేదో తెలియదు కానీ.. 

అమ్మ గుర్తుకు వచ్చింది.అడుగడునా ఆమె ప్రేమ గుర్తుకు వచ్చింది. ఆమె వేసిన బాట గుర్తుకు వచ్చింది. మా కోసం పడిన కష్టాలు గుర్తుకు వచ్చాయి.మా కోసం పడిన తపన గుర్తుకు వచ్చాయి.

ఈ నెలలోనే అమ్మ మాకు దూరమైన రోజు.. (అక్టోబర్  రెండు ) మా  నోటి కి "అమ్మా" అనే పిలుపుకి తాళం పడిన రోజు. అన్నీ గుర్తుకు  వచ్చాయి.లోపలి వచ్చి తనివితీరా అమ్మని తల్చుకుని, అమ్మ ప్రేమని తల్చుకుని ఏడ్చాను.

కాసేపటకి కొంచెం గిల్టీ ఫీలింగ్ తో.. నాన్నకి ఫోన్ చేసి పలకరించాను. ఇక్కడిరా నాన్నా !..ఒక పది రోజులు ఉండి  వెళ్ళవచ్చు. అని పిలిచాను.

అమ్మ పోయాక ఆయన అక్కడే ఉన్నారు. పుట్టి పెరిగిన వూరు వదిలి ఉండలేనంటూ  ఒక వేళ వచ్చినా.. ఒక పూటకే చెప్పుల్లో కాళ్ళు పెడతారు. చూస్తూనే వారించకుండా  మేము మౌనం వహిస్తాం.  అది కూడా ఎస్కేపిజం అనుకుంటాను.   

ఒక ఆసక్తి + ఒక సరదా కలిపి..అమ్మ జ్ఞాపకాల ఊటలో..ముంచివేసింది. ఇది మాత్రం నిజం.  అమ్మ గురించి ఇంకొన్ని పోస్ట్ లలో వ్రాస్తాను. ఈ కవిత అమ్మ గురించి వ్రాసుకున్నదే.


సోదమ్మి మాత్రం పొట్టకూటికోసం నాలుగు సరిపడే మాటలు చెప్పి ..

చెప్పి చెప్పకుండా, అర్ధం అయి కానట్టు చెప్పు కుంటూ..నాలుగు రాళ్ళు సంపాదించుకుంటూ.. జనాన్ని  మభ్య పెడుతూ ఉండవచ్చు.

 వాళ్ళు  ఎక్కడో..ఏదో ఒక మాట  అదీ.. మనకి అన్వనయిన్చుకునేలా మాటలు చెప్పి వెళుతుంటారు..  కానీ  పెద్ద పెద్ద వాళ్ళు  స్వామీజీలు వేదాలు, ఉపనిషత్తులు,భారత,భాగవతాలు ఉదహరిస్తూ మంచి  మాటలు చెప్పినట్లు చెప్పి  మనలని వాళ్ళ మాయా జాలంలోకి లాక్కుని కట్టలు కట్టలు డబ్బులు గుంజే రకం అయితే కాదుగా.. అనుకుంటూ.. నిట్టూర్చాను.        

     

  

14, అక్టోబర్ 2011, శుక్రవారం

మృత్యు శకటం ఆ కవిని మోసుకేళుతుంది..



ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాను.
ఇలాంటి రోజు ఎవరి జీవితంలోనైనా  ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా వస్తుంది. 
ఈ రోజు ఇలా వచ్చినందుకు కోపమైతే లేదు కానీ
ఇన్నిరోజులు చావుకి బ్రతుకుకి మద్య ఊగిసలాడించి
అందరితో..ఇంకెన్నాళ్ళు!? ఈ బాధ  చూడటం నరక ప్రాయం కదా! అనుకుంటూ..
ఈ రోజు కై ఎదురుచూపులు మిగిల్చావు. 
బతికినన్నాళ్ళు భావాలతో యుద్ధం చేసి అక్షరాలతో సహవాసం చేసిన
ఆ భావశిల్పికి మరణ శాసనం ని లిఖించడానికి 
ఇరువదినాలుగు దినాలు అవసరపడ్డాయంటే..
నీకు అలాటి కవి హృదయం లేదని అర్ధం చేసుకుంటూ..
నీ మహిష వాహనపు గంటలు వినకుండా.. ఆ భావకుడు..
చేతనా అచేతానావస్త లోను  పాటకి  ప్రాణం  పోయాలని 
మలి చరణం రాసుకుంటూ.. ఉన్నట్టుంది.
పొంచి ఉన్న నీడలా.. ఎప్పుడయినా కబళించే నీకు
సుకవి కి మరణం లేదని అతనెప్పుడు..  
చిరంజీవిగా పాటలో బ్రతికుంటాడని.. తెలుసు కదా! 
మృత్యు శకటం ఆ కవిని మోసుకెళుతుంది..    
భావాలు దారంతా పూలలా  వెదజల్లబడుతున్నాయి.


 జాలాది గారి ఆత్మకి శాంతి కల్గించాలని ప్రార్ధిస్తూ..