29, జులై 2012, ఆదివారం

నివేదిత




ఈ మధ్య నేను సాహితీ నికేతన్ కి వెళ్లి కొన్ని బుక్స్ తీసుకురావాలని అనుకున్నాను. ఈ లోపు.. మా ఫ్రెండ్ రమ అక్కడికి వెళ్లి కాల్ చేసి నీకు ఏం బుక్స్ కావాలని అడిగింది. నేను సిస్టర్ నివేదిత గురించి బుక్ కావాలని చెప్పాను. ఎందుకంటే.. ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి.

నివేదిత
అంటే అర్ధం సమర్పణ.
సిస్టర్ నివేదిత ..ఎక్కడో విన్నట్టు ఉంది కదా! అందమైన వ్యక్తిత్వం కల ఇర్లాండ్ దేశపు యువతి. పదిహేడు సంవత్సరాలకే టీచర్ గా మారింది. ఇరువై అయిదు సంవత్సరాలకే ఒక పాఠశాల స్తాపించింది.
వివేవకనందుడి ప్రసంగం విని ఉత్తెజితురాలయింది . స్వామీజీ ఒక రోజు భారతీయ స్త్రీల గూర్చి చర్చిస్తూ ..మా దేశంలో అమ్మాయిలి ఇప్పటివరకు పాఠశాల ముఖం చూడలేదు. మహిళలు విద్యావంతులు అయ్యేవరకు మా దేశం ప్రగతి సాధించదు. అని మార్గరెట్ వైపు చూస్తూ అన్నారు. నావద్ద మా దేశపు అభివృద్ధి చదువుకోసం వివిధరకాల ప్రణాళికలు ఉన్నాయి. వారిని ఆ పనిలో నిమగ్నం చేయడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా? అని అడిగారు.

తనపట్ల స్వామీజికి ఉన్న విశ్వాసానికి మార్గరెట్ ప్రభావితురాలయింది. ఆమె తనకు అంత యోగ్యతా ఉందా అని ఆలోచనలో పడగా ఆమె ఆలోచనలు తెలుసుకున్న స్వామీజీ ప్రపంచాన్ని మార్చేటందుకు నిన్ను నీవు సిద్దం చేసుకోవాలి. అప్పుడు నీతో పాటు మరికొందరు వస్తారు. నీ ఆత్మని మేలుకొలుపు అన్నారు.

బీదరికం,అంటరానితనం,ద్వేషం తదితర చెడు లక్షణాలతో నిండిఉన్న భారత దేశాన్ని ఆమె గమనించి ఆమె అక్కడికి పయనమయ్యారు.

1898 లో ఆమె కలకత్తాకి వచ్చారు. ఆమె తొందరగానే బెంగాలి జీవనం లో ఇమిడిపోయి.. బెంగాలి భాష నేర్చుకుని ఆ బాషా సాహిత్యాన్ని కూడా అర్ధం చేసుకున్నారు.

మార్గరెట్ ని ..ఆ తరువాత వివేకానంద రామకృష్ణ మఠానికి తీసుకుని వెళ్ళారు. ఆమెకి శారదా దేవి ఆస్సీస్సులు లభించాయి. తరువాత మార్గరెట్ హిందువుగా మారి పూజలు చేసారు. ఆమెని వివేకానందుడు ఆశ్వీర్వదించి "నివేదిత" అని నామకరణం చేసారు. పాశ్చాత్య సంస్కృతీ భారతీయ సంస్కృతిగా పరివర్తన చెంది..మార్గరెట్ నివేదిత అయింది.

ఆమె ఒక పాఠశాల ని ప్రారంభించారు.

ఇంటింటికి తిరిగి పెద్దలని ఒప్పించి బాలికలను కూడగట్టుకుని స్త్రీ విద్య కై పాటు పడ్డారు తర్వాత ఆమె సిస్టర్ నివేదిత గా ప్రాచుర్యం పొంది..ప్రజలకి సేవ చేసారు.

కలకత్తా లో ప్లేగు వ్యాది వ్యాపించి లక్షలాది ప్రజలు మరణిస్తుండగా.. ఆమె చలించి పోయి .. స్వయంగా రోగులకి సేవ చేసారు.

మురికి వాడలని,మూత్రశాలని శుభ్రం చేసారు. అది అక్కడి ప్రజలు గమనించి సిగ్గుపడి ప్రజలు ముందుకి వచ్చారు. అలా రోగుల సేవలోనే అలసి..ఆమెకి అనారోగ్యం సోకింది.

ఆమె ఇతరదేశాలకి వెళ్లి భారతీయ సంస్క్రతి ని గూర్చి గొప్ప గా ప్రసంగాలు చేసారు.

భారత దేశం గురించి..కొంతమంది క్రైస్తవ మతస్తులు ప్రపంచానికి చెడు గా చిత్రీకరించడం గుర్తించి.. వాస్తవాలని, భారత దేశం అంటే ఎలా ఉందొ..అన్న విషయాలని.. ప్రపంచ దేశాలకి తన ప్రసంగాల ద్వారా తెలియజేసింది.

అప్పుడు పాశ్చాత్యుల దోరణి మారింది. ఆమె నడుపుతున్న పాఠశాల లకి ధన సహాయం చేసారు.

వివేకానందుడి మరణం తర్వాత ఆమెకి ఇంకా భాద్యత పెరిగింది. స్వామీజికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె పూర్తిగా ఈ దేశ సేవలోనే నిమగ్నమైంది. స్వాతంత్ర్యం కోసం కూడా పోరాటం చేసేలా ప్రోత్సాహం ని అందించింది.

వందేమాతరం గీతం ఆమె నడుపుతున్న పాఠశాల ల లో ప్రార్ధన గీతం అయింది.

ఆమె రాట్నం వడికేవారు. నూలు బట్టలే ధరించేవారు.. అది బెంగాలి ప్రజలకి ఆచరణ అయింది. బెంగాల్ విభజన జరిగినప్పుడు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో నివేదిత స్వయంగా పాల్గొన్నారు.రబీంద్ర నాథ్ ఠాకూర్,గోపాల కృష్ణ గోఖలే, మహత్మా గాంధీజీ , బాల గంగాధర్ తిలక్ మొదలైనవారు ఆమెని తరచూ కలుస్తూండేవారు.

బెంగాల్ వరదలప్పుడు చాలా విస్తృతంగా పర్యటన చేసి సేవలు చేసారు. తీవ్ర అనారోగ్యం కి గురిఅయింది తన సంపద,నగలు అన్నీ బేలూరు మఠం కి సమర్పించింది. దాని ద్వారా ఒక నిధిని ఏర్పాటు చేసి..భారతీయ మహిళలకు జాతీయ శిక్షణ ఇవాలన్నది ఆమె కోరిక.

తర్వాత ఆమె కొద్దికాలానికే మరణించారు.

హిమాలయ సానువుల్లో ఆమె సమాధి చేయ బడింది. ఆ సమాధి మీద "భారత దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన సోదరి నివేదిత ఇక్కడ దీర్ఘ నిద్రలో ఉంది" అని వ్రాయబడింది.

ఆమె స్థాపించిన పాఠశాల పెద్ద సంస్థగా అవతరించింది. అక్కడ వేలాదిమంది భారతీయ యువకులు,మహిళలు జాతీయవాదం గురించి శిక్షణ పొందుతున్నారు.

ఒక పాశ్చ్యాత్య వనిత భారతీయ సంస్క్రతి పట్ల ఆకర్షితురాలాయి.. భారతీయ తత్వంలో ఇమిడి పోయి.. సేవా దృక్పదంతో.. తన జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నివేదిత.. స్పూర్తికరం.

భారతజాతికి గర్వకారణం కూడా. ఆమెకి ఎటువంటి అవార్డులు,రివార్డులు లభించినా.. ఆమె అసలు పేరు మార్గరెట్ నోబుల్. ఈ రోజుకి బెంగాల్ ప్రజలకి సిస్టర్ నివేదిత ఆరాధ్య మైంది .

భారతదేశానికి సేవ చేయడానికి తర్వాత కూడా మరికొందరు వచ్చారు. కానీ వారు.. సేవ పేరిట మతాన్ని కూడా మోసుకునివచ్చారు. సేవ చేసారు. మతం ని జొప్పించారు.

అంతే కదా.. ! భారతీయత అంటే.. ఎవరు ఏం మోసుకుని వచ్చినా స్వీకరించింది. తన లో ఐక్యం చేసుకుంది.

సిస్టర్ నివేదిత గురించి చదవాలి అనుకుంటే "నివేదిత" పుస్తకం సాహిత్యనికేతన్..లో .. లభ్యం అవుతుంది.తప్పక చదవండి.

7 కామెంట్‌లు:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

సిస్టర్ నివేదిత గురించి కొద్దిగా తెలుసు కాని మీ వ్యాసం ఆమెను గూర్చి పూర్తిగా తెలియజేసింది.గొప్ప మానవతావాది .

Sai చెప్పారు...

ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకున్నాను అండీ... ధ్యాంక్యూ వనజమాలి గారు..

కాయల నాగేంద్ర చెప్పారు...

ఒక గొప్ప మానవతావాదిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు వనజ గారు!

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ మంచి విషయం చెప్పారు. బాగుంది.

శ్రీ చెప్పారు...

మంచి విషయాన్ని మాతో పంచుకున్నారు వనజ గారూ!
@శ్రీ

Murthy K v v s చెప్పారు...

ఒక యోధుని ధ్రుఢ సంకల్పము,భారతీయ మాత్రు హ్రుదయము కలిగి ఉండమని వివేకానంద స్వామి ఆమెని ఆశీర్వదించారు.
well done...!!!

భాస్కర్ కె చెప్పారు...

ఓ గొప్ప జీవితాన్ని చక్కగా పరిచయం చేసారు, అభినందనలు.