15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సామాన్యుడి వ్యాఖ్య.

పొద్దునే పేపర్ చదువుతూ నేను పైకి కోపం కక్కుతున్నా కాఫీ పొగలు కక్కినట్టు. 

నీ అమ్మ కడుపు మాడ.. 
అడగండి అంటున్నావ్ ! అంటే యిస్తాననేగా  అర్ధం. ఎవరి కొండలు అరగదీద్దామని నువ్వు కొండలు పోగేయడానికి. పోయినసారి చేసిన అప్పులే తీరలేదు. ఈసారి పోటీ చెయ్యం అని చేతులెత్తేస్తుంటే .. వాళ్ళని చూసి జాలిపడి నిన్ను తిట్టాలనిపిస్తుంది. సమిధలవడం   సోపానాలుగా మారడం గొర్రెలు చేసేపని. వాటికి మేత దొరుకుతుందనే ఆశ ఉంటే తప్ప.  

నారాయణమ్మ : ఎవరినమ్మా గొర్రెలు అంటున్నావ్. గొర్రెలకు తిరిగి మేయడమీ  తెలుసు. దొడ్లో వేసి బంగారం పెట్టినా తినవు. నువ్వట్టా అంటే మా చెడ్డ కోపం. మాట ఎనక్కి తీసుకోవాలి నువ్వు అంది.  

గొర్రెలంటే తెగ కోపం వచ్చేస్తుంది మనుషులకి. రావాల్లే   ఆమాత్రం.

(ఓటుకు ఐదు వేలు అడగండి అన్నమాటకు స్పందన )

****************

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా

గురజాడ అప్పారావు గారు ఈ గేయం వ్రాసేనాటికి ఈ దేశంలో మతవిద్వేషాలు లేవు. కానీ ఈనాడు ఆ గేయరచయితను కులదృష్టితో చూస్తున్న సూడో మేధావులను చూస్తే అసహ్యాన్ని మించి వేరే ఏదో కల్గుతుంది. కాశ్మీర్ కాశీరులదే. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. దానిని కాపాడుకోవడానికి దేశం ఎంతో ఖర్చు పెడుతుంది. ముస్లిమ్స్ ఎక్కువున్నారు కాబట్టి అది పాకిస్థాన్ కి సంబంధించింది అయిపోదు. శతాబ్దాల చరిత్ర తవ్వి చూస్తే  కాశ్మీర్ ఎవరిదో అర్ధమవుతుంది. కాశ్మీర్ ని విడగొట్టి ఇచ్చినంత మాత్రాన ఈ దేశంలో ఉగ్రవాద దాడులు జరగకుండా ఆగుతాయా అని ఎవరైనా నమ్మకంగా చెప్పగలరా ? ఈ దేశంలోకి ఎవెరెవరు ఎక్కడినుండి వచ్చినా ఇప్పుడు ఉన్నవారందరూ భారతీయులు.

ఒక ఉదాహరణ ఏమిటంటే ఒక కుటుంబంలో  ఒక వ్యక్తి దేశద్రోహం మొదలు పెడితే ఆ కుటుంబం మొత్తం విచారణ ఎదుర్కోవలసి రావడం చట్టపరమైన విచారణ. కాశ్మీర్ లో జరుగుతుంది అదే.

మనం వంటింట్లో చాకు తీసినప్పుడల్లా ఇంట్లో ఎవరినో ఒకరిని పొడవడానికి కాదని పచ్చి మిరపకాయని చీల్చి గింజలు రాల్చి  చేసుకునే వంటల్లో వేసుకోవడానికని కూడా అర్ధం చేసుకోవాలి. సాత్విక ఆహారం తినడం కూడా  మన హక్కు కాదంటారా?


(కాశ్మీర్ ప్రజలను అనుమానించి హింసిస్తుంది రాజ్యం  అందుకే ఉగ్రవాదం పెరుగుతుంది అనే మేధావుల మాటలకు )

ఒక ఉగ్రవాది దాడికి 43 మంది సైనికులు మరణం నేపథ్యంలో ..కొందరి  మాటలకు నా స్పందన

పొగలు గ్రక్కడం సామాన్యుడికి వచ్చు. ఇది సామాన్యుడి వ్యాఖ్య. 

కామెంట్‌లు లేవు: