14, ఏప్రిల్ 2011, గురువారం

"జ్ఞానార్జన ఇక్కడ - ధనార్జన అక్కడ"


చిలక పలుకులు పలికే చిన్నారులు సైతం నేను ఇంజినీర్ ని అవుతాను,డాక్టర్ ని అవుతాను,కంప్యుటర్ సైన్సు చేస్తాను.తర్వాత     అమెరికా వెళతాను అక్కడ  బోల్డన్ని డబ్బులు సంపాదిస్తాను..అంటూ ఉంటారు తర్వాత తర్వాత..ఏమిటో..వివరించలేరు. ఇది నిజంగా బాలల ఆలోచనా?కాదు..కాదు..పెద్దలు నూరిపోసిన ధోరణి. దేశం లో మూడోవంతు మంది అజ్ఞాన అంధకారంలో మునిగి ఉంటె మరోవైపు అంది వచ్చిన   అవకాశాలు  అంది పుచ్చుకుని రెక్కలు కట్టుకుని మేధావులంతా  విదేశాలకి valasa  వెళుతున్నారు. విద్యావంతులు వలస వెళ్ళడానికి కారణం ఉన్నత విద్యా అవకాశాల కోసం కావచ్చు .అక్కడ లబ్యమయ్యే సౌకర్యాలే కావచ్చు.లేదా అక్కడ లభించే ఆకర్షణీయమైన జీతం లభించే ఉద్యోగం కావచ్చు. . కానీ వెళ్ళిన  వారు తిరిగి రావడం  లేదు.
మన ప్రతిభ విదేశాలలో..మారు మ్రోగుతుంటే సంబర పడుతున్నాం.మనకి ఉపయోగపడటం లేదన్న బాధ మటుకు వెక్కిరిస్తుంది.కొన్ని దేశాల వారు  వలస వెళ్ళినా అక్కడ సంపాదించిన ఆస్తులను,తమ నైపుణ్యాన్ని  తీసుకు వచ్చితిరిగి తమ తమ దేశంలలో స్థిర పడి దేశ అభివృద్దిలో పాలు పంచుకుంటున్నారు.కొన్ని దేశాలు మేదోవలసని నియంత్రిస్తున్నాయి.ఆ బాటలో మనము నడవాలి.మేధోవలస ఆగాలి .ఎవరికైనా సేవలకి ప్రతిఫలం ధనం మాత్రమే కాదు.అన్నిటికన్నా మించినది ఆత్మ సంతృప్తి.ఏ దేశ అభివృద్ధి అయినా అ దేశ ప్రజల కృషిలోనే ఉంటుంది అని గుర్తించి  తమ అభివృద్ధిని దేశ అభివ్రుద్ధిలోనే కాంక్షించి ..జన్మ భూమి రుణాన్ని తీర్చుకోవాలి. వలస పక్షులు ఎన్నటికైనా సొంత గూటికి చేరడం పరిపాటి. పక్షులైనా మన వలస వాదులకి పథా నిర్దేశాని సూచించాలి.  
నేను ఈ పోస్ట్ (క్షమించాలి } ఈ చిరు వ్యాసం వ్రాసి 8 సంవత్సరాల అయిదు నెలలు దాటింది. సకల ఆంధ్రజ్యోతి దిన పత్రికలో..అచ్చుఅయ్యింది {నవంబర్ 7 గురువారం 2002 } "జ్ఞానార్జన ఇక్కడ - ధనార్జన అక్కడ" అన్న శీర్షికతో..అచ్చు అయింది.ఇప్పుడు అయితే కొన్ని ఆలోచనలు రూపాంతరం చెందవచ్చు కానీ..ఇప్పటికి ఫై అభిప్రాయంతో   ఏకీభవిస్తాను...  ఈ వ్యాసాన్ని అనుకోకుండా ఈ రోజు గుర్తుకు తెచ్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది. ఒక బ్లాగ్ మిత్రుడు మీరు మీ అభిప్రాయాలని పత్రికలలో.. ప్రచురణ కోసం ఎందుకు పంపకూడదూ..అని అడిగారు.వివిధ పత్రికలలో వచ్చిన నా ఆర్టికల్స్ ని  వీలు వెంబడి బ్లాగ్లో..పెడతాను. మిత్రునికి ధన్యవాదములతో  ..  .

కామెంట్‌లు లేవు: