14, మార్చి 2019, గురువారం

నా యెంపిక

రాష్ట్రం కోసం ..
నా యెంపిక చంద్రబాబునాయుడు
మరి మీ యెంపిక!?
నేనొక రచయితను.2016 డిసెంబరు నెలలో “దాహం” అనే కథ వ్రాసాను. 2017 జనవరి 22న ఆదివారం ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ఆ కథ ప్రచురితం.రాజధాని భూముల సేకరణపై. కొన్ని ప్రశ్నలు సందేహాలు వెలిబుచ్చాను. జరిగేదంతా అభివృద్దేనా అని అనుమానాలు వెలిబుచ్చాను. ఈ ధనదాహం భూదాహం తీరేదేనా అని ఆవేదన వెలిబుచ్చతూ ఓ రైతు వ్యథకు అక్షర రూపం యిచ్చాను. నా ప్రశ్నల దాహానికి దప్పిక తీర్చే వారెవరు? అని ముగింపు యిచ్చాను. ఇంకో రెండేళ్ళకు నాకు చాలా సమాధానాలు లభించాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పట్టిసీమ నుండి నీరు, పోలవరంప్రాజెక్ట్ నిర్మాణం సాగిస్తూ..రైతులకు రుణ మాఫీ, పేదలకు ఇళ్ళు, వృద్ధులకు పెన్షన్లు, పేదవారికి ఆరోగ్య సహాయం, డ్వాక్రా మహిళలకు సహాయం, చంద్రన్న భీమా.. ఇలాంటి పధకాలతో ప్రభుత్వం మంచి పరిపాలననే అందించిందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితులలోచంద్రబాబునాయుడు గారి దార్శనికత ముందుచూపు అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. పక్క రాష్ట్రం పన్నాగాలు పనిచేయకుండా స్వతంత్రంగా అభివృద్ధి చెందే క్రమంలో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరం. చంద్రబాబు నాయుడు గారు వున్నవారిలో బెస్ట్. ఓ బాటలో పడుతున్న రాష్ట్ర బండిని గతుకుల బాటలోకి మళ్ళకుండా అదే బాటలో నడవడం నడిపించే నాయకుడుపై నమ్మకం వుంచి ఇంకో ఐదేళ్ళు సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేసుకున్న వాళ్ళం అవుతాం. రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ది సాధ్యం అవుతుందని.. ఆ విధంగా ఆ ప్రాంత నాయకులను ప్రశ్నించి సాధించుకోవడమే లక్ష్యంగా నడవాలని గొప్ప ఆకాంక్షతో ముందుకు నడవాలని ఒక పౌరురాలిగా నాఆకాంక్ష.
రాజధాని నిర్మాణం ఎక్కడ జరిగినా ఎవరు ముఖ్యమంత్రి అయినా.. జరిగేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. అంతకు క్రితం జరిగిన విమానాశ్రయ నిర్మాణం కోసం జరిగిన సేకరణలు, 101 ఆర్ధిక మండళ్ళు కోసం జరిగిన సేకరణలలో పేదవాడి భూములు లేవా..? విదేశీ సంస్ధలకు అభివృద్ధి పేరిట దారాదత్తం చేయలేదా..! రాజధాని నిర్మాణంలో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చి అండగా నిలిచారు. పరిశ్రమలకు పోర్ట్ లకు భూములివ్వడానికి రైతులు మళ్ళీ సిద్ధంగా వున్నారు. అభివృద్ధి అంటే ప్రాంత అభివృధ్ది ద్వారా వ్యక్తిగత అభివృద్ది కూడా. వ్యవసాయం పరిశ్రమలు ఉపాధి అవకాశాలు ఇవ్వన్నీ అనుభజ్ఞుడైన నాయకుడి ద్వారానే లభిస్తాయి. అంత ఛరిష్మా వున్న నాయకుడు చంద్రబాబునాయుడు. ఇంకోసారి నమ్మితే నష్టపోము. నమ్మకం వుంచుదాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిపై మరో ఐదేళ్ళు నమ్మకం వుంచి యెన్నుకుందాం. మన బిడ్డల భవిష్యత్ కోసం, ప్రాజెక్ట్ ల కోసం అమరావతి కోసం, పోర్ట్ కోసం, పేదవాళ్ళ సంక్షేమం కోసం. జై ఆంధ్రప్రదేశ్!!

కామెంట్‌లు లేవు: