30, డిసెంబర్ 2022, శుక్రవారం

ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటి వెనుక కథ

 ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటి వెనుక కథ.  మూడేళ్ళ నా రచనా ప్రస్థానం వెనుక నా అక్షరాల ఆత్మ విశ్వాసం కథ యిది.

2020 నుండి పత్రికల్లో నా కథలు రాలేదు. కథలు వెనక్కి తిరిగి వచ్చినప్పుడల్లా.. నేను నిరాశ పడేదాన్ని. అయినప్పటికీ కథలు రాయడం మానలేదు. 

ముగింపు వాక్యం, నాన్నెప్పుడొస్తాడు, గీటురాయి, రస స్పర్శ, నీట చిత్తరువు కథలు తిరస్కరించిన కథలే! 

2020 లో  వొక్క కథ కూడా రాయలేదు. 

ఈస్తటిక్ సెన్స్ - Dr. గీతాంజలి భారతి

అరుణతార పత్రిక వారి వద్ద 6 నెలలు కాలం వుంది పరిశీలన లో. మెయిల్ పెట్టి నేనే వెనక్కి తీసుకున్నాను 

ఊహల మడుగు - Dr. శైలజ కాళ్ళకూరి

ప్రజాశక్తి స్నేహ, పాలపిట్ట, ఆంధ్రజ్యోతి తిరస్కరించాయి. 

వాతాపి జీర్ణం - పద్మజ సూరపనేని

ప్రజాశక్తి స్నేహ తిరస్కరించింది

రుణ బంధాలు - ఆర్.దమయంతి

 ప్రజాశక్తి స్నేహ తిరస్కరించింది

విముక్తం - పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి

ఆంధ్రజ్యోతి తిరస్కరించింది

ప్రేమే నేరమౌనా - రాధ మండువ

ఫేస్ బుక్ గోడపై ప్రచురించాను. 

పైడి బొమ్మ - శశికళ ఓలేటి

వెబ్ పత్రిక 4 నెలలు పరిశీలనలోనే వుంచింది. 

చిట్టిగుండె - ఎమ్ ఆర్ అరుణ కుమారి

విశాలాక్షి పత్రిక లో ప్రచురితం

కోకిల తల్లి - శాంతి ప్రబోధ వల్లూరి పల్లి

ఆంధ్రజ్యోతి తిరస్కరించింది. 

కుబుసం- అంజనీ యలమంచిలి.

అటా ప్రత్యేక సంచిక లో ప్రచురితం

ఈ అనుభవాల తర్వాత పత్రికలకు పంపడం మానుకున్నాను. 

దృశ్య భూతం - వారణాసి నాగలక్ష్మి

రెండు లక్షలు - శ్రీదేవి సోమంచి

చెరగని గీత - లక్ష్మి రాయవరపు

ఔనా - జ్వలిత దెంచనాల

పైన కథలన్నింటికీ సహ రచయితలు అడగగానే వ్యాఖ్యానం రాసారు. ఎవరూ ఈ కథలు బాగోలేదని మాట మాత్రం కూడా చెప్పలేదు. 

“విముక్తం” కథ ను మాత్రం పాలగిరి విశ్వ ప్రసాద్ రెడ్డి సూచన మేరకు సవరించాను. మూలం యే మాత్రం మార్చకుండా. 

R వసుధా రాణి గారు కుబుసం కథ కు వ్యాఖ్యానం రాయడానికి తిరస్కరించారు. అంజని యలమంచిలి గారు వ్యాఖ్యానం రాసి యిచ్చారు. 

బంగారు భూమి - సాహిత్య ప్రస్తానం వారి దగ్గర నాలుగు నెలలు వుంది. మెయిల్ పెట్టి నేనే వెనక్కి తీసుకున్నాను. అదే కథ.. 

బంగారు భూమి - బహుళ త్రై మాసిక పత్రిక లో ప్రచురింపబడింది. 

రంగు వెలిసిన కల - బహుళ త్రై మాసిక పత్రిక లో ప్రచురింపబడింది. 

ఇంకొక ప్రత్యేక సంకలనం కోసం కథ రాసాను. 

ఇకపై ఎవరైనా అడిగితే తప్ప కథ యివ్వను. నా అంతట నేను కథను పంపను. 

వీలును బట్టి డైరక్ట్ గా పుస్తకమే వేస్తాను. 

2023 లో 24 కథలతో “దుఃఖపు రంగు” కథా సంపుటి 

ప్రచురిస్తాను. 

సంఘటిత కు కవిత యిచ్చాను. సంకలనంలో నా కవిత వుంది. 

వీధి అరుగు లో ప్రచురించడానికి వారే కవితను యెంపిక చేసుకున్నారు. 

తెలుగుతల్లి వారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ప్రచురించారు. 

వీరందరికీ ధన్యవాదాలు 🙏

పత్రికలకు కథలు పంపి  తిరిగొస్తే నేను నిరాశ పడలేదు.. యువ రచయితలు మీరెవరూ కూడా నిరాశ పడవద్దు. 

- రచనలు ప్రచురించిన వీరందరికీ 

నా రచనలు చదువుతున్న పాఠకులందరికీ  ధన్యవాదాలతో.. వనజ తాతినేని.





#ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని

కామెంట్‌లు లేవు: