8, అక్టోబర్ 2024, మంగళవారం

మమకారం -గోపీచంద్

 మమకారం -త్రిపురనేని గోపీచంద్

మట్టికి మనిషికి అనుబంధం. మనిషికి సొంత భూమి కల్గివుండాలని ఆరాటం. వ్యవసాయం వృత్తి అయినవారికి మరింత తాపత్రయం. ఈ కథలో జోగయ్య అహోరాత్రాలు శ్రమించి చాలా భూమిని సంపాదించాడు. అతను భూమే తన సర్వస్వం అని భావించాడు. ఆఖరికి  చావు బ్రతుకుల్లో వున్న భార్యను పట్టించుకోలేదు.తినే ముద్దను ఆస్వాదించలేదు. అన్ని బంధాలకన్నా మట్టి ముఖ్యం అనుకున్నాడు. అతని శ్వాస ధ్యాస అన్నీ మట్టే! ఆఖరికి ఆ మట్టి వాసనను పీలుస్తూనే ఊపిరి వదిలాడు. కానీ ఆఖరికి మట్టి వాసన ని కూడా ఆఘ్రాణించలేని ఆ మట్టి మనిషి ని చూసి మనం జాలిపడతాం. అబ్బురపడతాం. జీవితం జీవనం  తాత్వికత ను అర్దం చేసుకుని చిన్నగా నవ్వుకుంటాం. తప్పక వినండీ.. 

@VanajaTatineni‬ 



కామెంట్‌లు లేవు: