10, జులై 2012, మంగళవారం

బుక్ పాయింట్ - శ్రీ రమణ

మొన్న ఆదివారం..టీవి 9 చానల్ లో బుక్ పాయింట్ ..కార్యక్రమం లో ..

ప్రముఖ రచయిత,కాలమిస్ట్, అసిస్టెంట్ డైరక్టర్.. శ్రీ రమణ గారు మరియు..
ప్రముఖ కవి,కథారచయిత అఫ్సర్ గారితో.. ఒక పరిచయ కార్యక్రమం ని ప్రసారం చేసారు.

శ్రీ రమణ
గారి "మిధునం" కధ తో.. తనికెళ్ళ గారి దృశ్య రూపం(సినిమా) గా గాన గంధర్వుడే కాదు , నటనా చాతుర్యం కల మన బాలసుబ్రమణ్యం, శ్రీమతి లక్ష్మి ముఖ్య పాత్రధారులు
నటించిన కొన్ని సన్నివేశాలను కూడా ఈ కార్యక్రమంలో చూపించారు.

అఫ్సర్ గారు శ్రీ రమణ గారి రచనలని విశ్లేషించారు. మారుతున్న జీవన విధానాన్ని" మిధునం " కథలలో ప్రతిబింబిస్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అయిన తీరుని శ్రీ రమణ గారి కథలలో మనం చూడవచ్చని చెపుతూ సంప్రదాయం ని వ్యతిరేకిస్తూ.. వ్రాసిన సంభాషణ లని వివరిస్తూ.. ఇంకా ఆ కథలని చదివి ఆ శైలిని అర్ధం చేసుకోవాల్సిన అవసరం గురించి చెప్పారు. మాట్లాడిన అతి తకువ సమయంలో అఫ్సర్ గారు చక్కగా శ్రీ రమణ గారి రచనలని విశ్లేషించే ప్రయత్నం చేసారు కూడా. (అతిదులని పిలిచి వారిని మాట్లాడనీయ కుండా అనుసంధానకర్త పదే పదే అడ్డుకుంటూ మాట్లాడటం మనవాళ్ళకి అలవాటే కదా!)

ఈ పరిచయ కార్య క్రమం అందరు చూడలేక పోవచ్చును. అదే సమయంలో .. ఈ టీవి చానల్ లో "సత్యమేవజయతే" ప్రసారం అవుతుంది. బాతాఖాని-లక్ష్మిఫణి - కబుర్లు శ్రీ రమణ లింక్స్ కూడా ఇచ్చారు. ఆ లింక్ లలో మళ్ళీ ఇక్కడ చూడవచ్చును.

ఆ కార్యక్రమం ని కొందరు చూసి కూడా ఉంటారు. మళ్ళీ ఆ కార్యక్రమం పై నేను చెప్పేది ఏమి లేదు. నాకు అంత అనుభవం-అర్హత లేదు కూడా.

కానీ.. నేను చెప్పే విషయం ఏమిటంటే.. ఆ కార్యక్రమంలో శ్రీ రమణ గారి ని పరిచయకర్త ఒక ప్రశ్న వేసారు.

మీకు రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదంటారు!. దానికి మీరేమంటారు? అని ప్రశ్నించారు.
అందుకు శ్రీ రమణ గారి సమాధానం నాకు చాలా బాగా నచ్చింది.

"నాకు రావలసిన దానికన్నా ఎక్కువ కీర్తి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నాకు లభించిన ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ. పురాణపండ,నండూరి లాంటి ప్రముఖుల ప్రోత్శాహం లేకుండా నేను ఇంత ఎదగలేను"కూడా అని కూడా చెప్పారు.

అలాగే బాపు-రమణ గారి వద్ద వారికి ఉన్న సాన్నిహిత్యం గురించి గుర్తుచేసుకున్నారు.

నేను ఇది ఎందుకు చెప్పదలచాను అంటే..

ఈ మధ్య ఒక పత్రికలో ఒక సినీ గేయ రచయిత ఇలా అన్నారు. "నా పాట జనం లోకి వెళ్లి నంతగా నేను జనం కి తెలియదు " అని. ఆ గీత రచయిత ప్రత్యక్షంగా జనానికి  కనబడాలని జనం తనని గుర్తించాలని, గుర్తింపు రావాలని కోరుకుంటున్నాడు . అలా కోరుకోవడం తప్పు కూడా కాదు.

ఒక రచయిత బాహ్యంగా కనబడుతూ జనం దృష్టిలోకి వెళ్లక పోయినా పర్లేదు. అతని రచనలు పాఠకుల్ని  ప్రభావితం చేయగల్గితే చాలు కదా అనిపించక మానదు. ఒక నాలుగైదేళ్ళగా చానల్స్ లో కూడా రచయితల పరిచయాలు,విశ్లేషణా కార్యక్రమాలు ద్వారా సాహిత్య పరిచయం వీక్షకులకి చేరువవుతుంది.

ఇక కొన్ని విషయాలు చూస్తే ..

ఒక కథా సంకలనం వెలువడగానే.. అనేక ప్రాంతాలలో పరిచయసభలు నిర్వహిస్తూ.. ప్రచారం చేసుకోవడం,సమీక్షలు విరివిగా రావడం చూస్తున్నాం. తగిన గుర్తింపు రాలేదని బాధపడిన వాళ్ళని చూస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారాలలో పరిచయ కార్యక్రమాలు విరివిగా రావడం చూస్తున్నాం. (అలా కూడా పబ్లిసిటీ పెరుగుతుంది కదా!)

విజయవాడలో కూడా స్వయంగా ముద్రింపజేసుకున్న కథా సంకలనాలకి,కవిత్వ సంకలనాలకి,నవల లకి ఇలాటి ప్రచారపు హోరుని నేను గమనిస్తాను.

పుస్తక పఠనం బాగా తగ్గిపోయిన ఈ రోజులలో మంచి సాహిత్యానికి  పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడినందుకు విచారించాలో,లేదా.. వారి వారి రచనలు అంత గొప్ప స్థాయిలో లేకున్నాపదే పదే సమీక్షలు,పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ కీర్తి ప్రతిష్టల కోసం ఎగబడటం చూస్తే.. హాస్యాస్పదంగాను ఉంటుంది.

ఇలాటి ఎగబ్రాకుడు తనాలు, దిగజారుడు చేష్టలు చాలా చూసినప్పుడు.. నాకిలా అనిపించింది. .

శ్రీరమణ గారి లాటి ప్రముఖ రచయిత తనకి తగినంత రాని పేరు ప్రఖ్యాతుల పట్ల అలా గొప్పగా వారి స్పందనని తెలుపడం నాకు బాగా నచ్చింది.

కళలకి, కళాకారులకి, సాహితీవేత్తలకి కూడా ప్రచారం అవసరమైన కాలం ఇది.ఏం చేద్దాం చెప్పండి. ?

(ఈ పోస్ట్ నేను ఎవరిని నొప్పించడానికి వ్రాసిన పోస్ట్ కాదు. వాస్తవాన్ని  వివరించే ప్రయత్నం చేసాను)

9, జులై 2012, సోమవారం

సలాం -ఎ - ఇష్క్ మేరీ జాన్


ముకద్దర్ కా సికిందర్

ముకద్దర్ కా సికిందర్ .. ఈ చిత్రం లో "సలాం ఎ ఇష్క్ మేరి జాన్ " పాటంటే నాకు చాలా ఇష్టం.
పాత్ర పరంగా రేఖ గణేషన్.. పాత్ర ఒక వేశ్య పాత్ర.ఆట పాటలతో అలరించే ఆ గృహానికి ..అమితాబ్ తొలిసారి తన మిత్రుని తో కలసి వెళతాడు.
అప్పుడు వచ్చే పాట ఇది. ఈ పాట సాహిత్యం చాలా బాగుంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఇది

రేఖ ప్రవేశం ఇలా ఉంటుంది ఈ పాటతో.

ప్రేమించే వారిని అడగవద్దు.వారి రాత్రి రారాజు యొక్క ఒంటరి తనం ఎలా గడుస్తుందో..అని
జీవన ప్రయాణం లో తోడుగా నడిచేవారు దూరమైనప్పుడు ఆ సమయంలో ఒంటరితనం ని గుర్తు చేసుకుంటారు
అలా దూరం అయినవారు కలవాలని విన్నపం చేసుకుంటారో..

అని చెపుతూ..

అభివాదములు ! ఓ.. నా ప్రియతమా!!

కొంచెం కనికరించి నీవు నన్ను ప్రేమించే ఓ.తప్పు చేయడానికి ఒప్పుకో..

.. నన్ను స్వీకరించు
నా ఈ హృదయం అశాంతి లో ఉంది నా హృదయం అశాంతి తో ఉంది తోడుగా ఉండే వారి కోసం
ఓర్పు లేకుండా ఉన్నాను.కారణం కలసి ప్రయాణించే వారి కోసం(జీవిత భాగస్వామి కోసం)

నీకు ఒక విషయం వినిపించనా..
వినిపించనా రాత్రికి సంబంధించిన ఓ..విషయం
చందమామ కూడా పూర్తి శోభతో ఉన్నాడు.హృదయంలో కల్లోలం ఉంది
కోరిక ఉంది హృదయం తూపానులోనే ప్రయాణం కొనసాగిస్తుంది.
ఒక మేఘం అకస్మాత్తుగా కదులుతూ అన్నివైపులనుండి చుట్టేసి చందమామపై కమ్మేసింది.
చందమామ కూడా ఆ నీడలో ఒదిగిపోయింది ( కరిగిపోయింది )

ఓహ్..ఏమైంది కదా! ఈ హుషారులో నా హృదయం కొట్టుకుంటుంది.
నా హృదయం తపించింది ఎవరి చూపు కోసమో!
అభివాదములు ...ఓ..నా ప్రియతమా!

కొంచెం కనికరించి నన్ను ప్రేమించే ఓ.తప్పు చేయడానికి ఒప్పుకో..

నీవు నన్ను స్వీకరించు

అప్పుడు..అతను కల్పించుకుని ఇలా చెపుతాడు.

దీని తర్వాత కథ ఏమయి ఉంటుందో..నేను చెపుతాను విను.
వింటుంటే నీ కళ్ళు మెరుస్తాయి.ఆశ్చర్యంతో..పెద్దవి అవుతాయి (టప టపా కొట్టుకుంటాయి)
విషయం హృదయానిది.ఏదైతే ఇప్పటిదాకా నీ హృదయంలో ఉన్నది నాకు ఈ పిలుపుతో పెదాలమీదకి వచ్చేస్తుంది..

దేవతా.. ఓ.. దేవతా.. (దేవదూతా)
ప్రేమలో పరాజయం పొందినవారికి, ప్రేమలో గాయపడినవారికి దారి చూపే దీపానివి నీవు..
మేమునీ గురించి విని వచ్చాము,నీకై వచ్చాము.
ఇప్పుడు మందు ఇస్తావో.లేక విషం అయినా ఇస్తావో..
నీ ఈ నివాసానికి మండిన హృదయం వచ్చి ఉంది.
ఒక్క ఉపకారం చేయి
ఒక్క ఉపకారం చేయి..
ఈ నీ ఆతిదికి ఒక్క ఉపకారం చేయి
నీవు జీవితాంతం సంతోషంగా ఉండాలని మేము ప్రార్దిస్తాము ఆశ్వీరదిస్తాము.
అభివాదములు ! !
ఓ.. నా ప్రియతమా!!
కొంచెము కనికరించి నీవు నన్ను స్వీకరించు

చిత్రం : ముకద్దర్ కా సికిందర్.
ఈ పాటకి సాహిత్యం:అంజాన్
సంగీతం:కళ్యాణ్ జీ-ఆనంద్ జీ.
గాయనీ-గాయకుడు :లతా మంగేష్కర్,కిషోర్ కుమార్.

హిందీ సాహిత్యం:




8, జులై 2012, ఆదివారం

కోటీశ్వరుడు

రోజు దినపత్రికలలో .. దరిద్రదేశంలో ధనస్వాములు ..శీర్షికగా
దేశంలో అధికమవుతున్న బిలయనీర్లు,ఒక ఏడాది కాలంలోనే పెరిగిన భాగ్యవంతులు పెదవాదేమో..ఇంకా పేదవాడు గా మారుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో.. పెట్టుబడిదారుడి మనస్తత్వం ఎలా ఉంటుందో..ఒక కథలో చదివాను. కథ "ప్రజా సాహితి" జూలై సంచికలో ప్రచురించబడింది. కథ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ షేర్ చేస్తూ..
కథ వ్రాసినది మాక్సిం గోర్కీ
తెలుగు సేత :ఆర్ .శాంత కుమారి.
కథ పేరు: కోటీశ్వరుడు.