సరాగమాల - వనజ తాతినేని.
వసంతం ఎప్పుడంటే
భూమి నవ్వుతూ వున్నప్పుడు
అంది ఆమె.
కాదు వయ్యారాల పువ్వులు
వికసించి నప్పుడు అన్నాడతను.
వైవాహిక ఘట్టం తర్వాత
గ్రీష్మం రసభంగం చేసింది
వర్షం తర్వాత..
ఆమె ఊపిరి పీల్చుకుంది.
అతని వేళ్ళ భాష ఆమెలోకి
నిదానంగా ఇంకుతుంది.
ఆమె దేహాన అగ్ని విరబూసింది.
రసోద్దీపన సమయంలో
మూడు ముళ్ళు స్తంభించాయి.
©️Vanaja Tatineni

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి