4, నవంబర్ 2011, శుక్రవారం

"చిత్రలేఖ" నవల పై సమీక్ష

వివాహిత స్త్రీలలో భర్త మరణం తర్వాత  లేదా వివిధ కారణాల వల్ల మరొక పురుషుడి పై ప్రేమ చిగురిస్తుందా!? 


మానవ స్వభావానికి అతీతంగా.. ఏ కథ కానీ నవల కానీ రచించలేదన్నది సత్యం.
స్వభావ చిత్రణలో..కొంత స్వేచ్చ ఉండవచ్చునేమో కానీ..పూర్తి కల్పితం గా చేసే రచనలు ఉండవేమో ! తప్పొప్పులు  ఎంచకుండా.. రచయిత చెప్పిన పాత్ర స్వభావాన్ని పాఠకుడిగా కాకుండా.. సమకాలీన వ్యక్తిగా ఆ పాత్రల వెంట నడుస్తూ.. పాత్రలని అర్ధం చేసుకుంటూ..ఆ రచనని చదవడం వల్ల సమాజాన్ని  దార్శనీయకత తో చూసి ఒక అభిప్రాయానికి  రాగల్గుతామన్నది నా అభిప్రాయం. 
అందుకే ..ఈ చంద్రలేఖ నవల నాకు నచ్చింది. 

పదే పదే ప్రేమించడం,ప్రేమించబడటాన్ని  నైతిక విలువుల దృష్టిలో.. చాలా పెద్ద తప్పిదంగా గోచరించవచ్చు. బలహీనత,ఆకర్షణ అనేవాటిని మనిషి, మనసు గనుక నియంత్రణ చేయగల్గితే.. ఇలాటి రచనలు అవసరం లేదు కూడా..

ఇదే బ్లాగ్ లో నేను పోస్ట్ చేసిన మరో రాజేశ్వరి చచ్చిపోయింది.. పై.. చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ తరుణం లోనే .. నేను "చినుకు "మాస పత్రికలో.. ఈ వ్యాసం చూసాను. అనేక ముద్రణ లతో.. సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన ఈ నవలలో ఏం ఉందో ..తెలుసుకోవడం  కోసమైనా ఈ "చిత్ర లేఖ" అనువాద నవల చదవాలని అనుకుంటూ.. నాకు నచ్చిన ఈ సమీక్ష . ..

చిత్రలేఖ నవల పై సమీక్ష ..శ్రీమతి వాడ్రేవు వీర లక్ష్మి దేవి







ఈ వ్యాసం ని చినుకు మాస పత్రిక 2011 సంచిక లో .. చూడండి.

1 కామెంట్‌:

జ్యోతిర్మయి చెప్పారు...

వనజగారూ సమీక్ష ఆసక్తికరంగా ఉంది. చదవాల్సిన పుస్తకాల జాబితాలో కలుపుకుంటాను.