2, నవంబర్ 2011, బుధవారం

ఓ..వచన కావ్యం స్త్రీ.. .

ప్రపంచంలో శ్రామిక వర్గం కన్నా  అతిదారుణంగా దోచుకోబడుతుంది స్త్రీ
                                                                                                  _లెనిన్  


"కన్నీటిలో   తడిసిన కరుణ కావ్యం స్త్రీ .జీవన రంగులన్నిటిలోను గుండె ముంచి గీసిన సన్నిహిత చిత్రం స్త్రీ.
బాలిక నుండి భార్య వరకు నడచిన జీవన గాధ స్త్రీ. ఈ సృష్టిలో ఆమె స్వేచ్చగా బ్రతికింది తల్లి కడుపులో మాత్రమే.." అని వ్రాసిన చరమ పంక్తి ఈ కావ్యం కార్చే చివరిభాష్పం..అంటూ .. ఓ..వచన కావ్యం స్త్రీ.. .
 ఆ వచన కావ్యం లో..కొంత భాగం ఇది.

స్త్రీని .. పౌరాణిక యుగం నుండి 
నేటి సాహిత్య,సినీ ప్రపంచం వరకు 
ఆదిశక్తి, పరాశక్తి ,పవిత్ర మూర్తి 
పతివ్రత,జగన్మాత,అగ్ని పునీత అంటూనే..
పురుష ప్రపంచపు కంటి రెటీనాకు
భాగ వస్తువుగా,విలాస వస్తువుగా 
వివస్త్రను చేసి చిత్రిస్తూ
మత్తెక్కిన కళ్ళ నిషాలో నంజుకు తింటూనే ఉన్నారు 
ఆమె నాజూకు తనాన్ని నలిపెస్తూనే ఉన్నారు..
ఆమె తుళ్ళినా,కుళ్ళినా,సోమ్మసిల్లినా
ఆమె సొగసుని,వయసుని 
పిండుకుని తాగుతూనే ఉన్నారు.
ఆమెకు ..
అందాలన్నీ ఉండాలి ..హక్కులు తప్ప
సొగసులన్నీ ఉండాలి.స్వేచ్చ తప్ప
తిట్టినా,కొట్టినా,దుమ్మెత్తి పోసినా 
నోరెత్తి మాట్లాడకూడదు 
బానిసత్వం-నీరసత్వం
ఆమె వారసత్వగా..అనుభవించాలి...
అంటూ.. వ్రాసిన  వచన కావ్యం..ఏ స్త్రీ ..వ్రాసినదో..అయితే.. స్త్రీ వాద కవిత్వం అంటారు .
పురుష ప్రపంచాన్ని అన్యాయంగా ఆది పోసుకుంటున్నారు అనగలరు  అనిపించింది. 
ఎందుకంటె ఆడవారి ఆక్రోశాన్ని తిట్టు కవిత్వంగా.. వర్గీకరించిన వారు ఉన్నారు కదా!
  నేడు ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ధన దాహంలో..
విదేశి నాగరికత మత్తుమందులకు బలైపోతూ .. ఈ దేశం నుండి 
ఎగుమతి కాబడుతున్న 
రబ్బరు,కాఫీ ,తేయాకుల మద్య 
భోగ వస్తువుగా-రహస్యంగా 
ఈ కుష్టు వ్యవస్థలో 
అనేక కోణాల మద్య
ఇంత దారుణంగా ,నగ్నం గా నీచంగా 
వంచింపబడుతున్నా
ఆమెకు ఈ అరాచకాలు,బలాత్కారాలు
చాలవన్నట్లు 
విదేశాలకు అమ్ముడుపోతుంది అక్కడ జీవితాంతం 
ఖైదీగా,బానిసగా 
ఖుషీ అందించే మెషీనుగా
ఈమె మార్చ బడుతుంది...
ఇలా దీర్ఘంగా సాగిన వచన కావ్యం తెలుగు విశ్వ విద్యాలయం వారి సహకారంతో.ప్రచురించి.. ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది.ఇప్పటికి మూడు ముద్రణలు వచ్చాయి. 
ఈ వచన కావ్యం రచయిత.."కొల్లూరి" 
ప్రతులకు..ఎక్సరే సాహితీ సంస్థ .. అరండల్ పేట,విజయవాడ-2.
  

కామెంట్‌లు లేవు: